Breaking News: కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ఒక మహిళ తన అత్త తలపై చపాతీ కర్రతో బలంగా కొట్టి హత్య చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా నివాసం ఉండే ప్రియాంక అనే మహిళ తన అత్త మైధిలిపై చపాతీ కర్రతో దాడికి పాల్పడింది. తలపై గట్టిగా కొట్టడంతో మైధిలి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అత్త వేధింపులు భరించలేకే ప్రియాంక ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్
కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. శ్రీశైలం విద్యుత్ పైఇరు రాష్ట్రాల అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాట కోసం తెలంగాణ పట్టుబట్టింది. 5 గంటలకుపైగా సమావేసం జరిగింది.
బాలీవుడ్ సీనియర్ నటి సైరా బాను పరిస్థితి విషమం.. ఐసీయూ వార్డులో చికిత్స
ఇటీవల కన్నుమూసిన వెటరన్ నటుడు దిలీప్ కుమార్ భార్య, బాలీవుడ్ సీనియర్ నటి సైరా బాను ఆరోగ్యం మరింత విషమించింది. మూడు రోజుల కిందట బీపీ సమస్యతో ముంబైలోని ఖార్ ఆసుపత్రిలో చేరిన సైరా బాను పరిస్థితి విషమించడంతో ఆమెను ఐసీయూ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.





















