By: ABP Desam | Updated at : 13 Jan 2022 06:04 PM (IST)
రైతుల కోసం కేసీఆర్ జైలుకెళ్లడానికైనా సిద్ధమేనన్న టీఆర్ఎస్
ఇప్పటి వరకూ ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతూ వస్తున్నారని ఇప్పుడిక వ్యవసాయమే వద్దని చెబుతున్నారా అని కేంద్రంపై టీఆర్ఎస్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి విరుచుకుపడ్డారు. ఎరువుల ధరల పెంపు అంశంపై తెలంగాణభవన్లో ప్రెస్మీట్ పెట్టిన మంత్రులు కేంద్ర విధానాలపై ఘాటు విమర్శలు చేశారు. అన్నం పెట్టే రైతన్న కు అడుగడుగునా కేంద్రం ఇబ్బందులు సృష్టిస్తోందని.. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయి లో ఉన్న దేశాన్ని వ్యవసాయం నుంచి తప్పించే ఆలోచన చేస్తున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మొన్నటి దాకా ధాన్యం కొనమన్నారు. ఇప్పుడేమో ఏకంగా వ్యవసాయమే వద్దంటున్నట్టుందన్నారు. కరెంటు కు మీటర్లు అంటారు.. ఎరువుల ధరలు పెంచుతారు. ఇక రైతు వ్యవసాయం ఎలా చేస్తాడని మంత్రులు ప్రశ్నించారు.
Also Read: తెలంగాణలో జీవో 317 మంటలు ! ఆ జీవోలో ఏముంది ? ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ?
బీజేపీ కి రైతు విభాగం కిసాన్ మోర్చా కూడా ఉందని ఎరువుల ధరల పెంపుపై కిసాన్ మోర్చా ప్రధాని మాట్లాడితే .. రైతుల బాధేంటో తెలుస్తుందన్నారు. ఆర్ ఎస్ ఎస్ కూడా బీజేపీ కి అనేక విషయాల మీద సలహాలు ఇస్తుంది.. ఆ సంస్థ వాళ్ళు రైతులను ఇబ్బందులు పెట్టమని చెప్పారా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారం లో లేని రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే పని గా పెట్టుకున్నారని..తెలంగాణ కు పేరొస్తే దేశానికి పేరొచ్చినట్టు కాదా అని మంత్రులు మండిపడ్డారు. తెలంగాణ వ్యవసాయ విధానాలు ఎందుకు కేంద్రానికి నచ్చడం లేదన్నారు.
Also Read: రాఘవ కేసులో పోలీసులపై ఒత్తిడి? రౌడీషీట్ ఓపెన్ చేయకుండా ఆడ్డుకుంటుందెవరు?
సీఎం కేసీఆర్ వి గొంతెమ్మ కోరికలు కాదని..రైతులకు న్యాయం చేయమంటే తప్పెలా అవుతుందని మంత్రులు ప్రశ్నించారు. ఎరువుల ధరలను పెంచడాన్ని బీజేపీ సమర్ధించగలదా అని సవాల్ చేశారు. పచ్చటి తెలంగాణ లో విషం కలపాలని బీజేపీ కుట్ర చేస్తోందని బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం కాదు. ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చేయలేని పీఎం మోడీ ని ప్రశ్నించాలని సవాల్ చేశారు. అన్నీ వర్గాల సమస్యలను సీఎం కేసీఆర్ తీరుస్తున్నారు. భవిష్యత్ లో కూడా తీరుస్తారని బీజేపీ నేతలు పిచ్చి పిచ్చి కూతలు మానుకోవాలని మంత్రులు హెచ్చరించారు.
Also Read: ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !
నిజామాబాద్ జిల్లాకు గోల్డ్ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం
Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క
TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!
Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!