By: ABP Desam | Updated at : 11 Jan 2022 06:00 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
గతంలో జలయజ్ఞం చేపట్టి రైతులకు సాగునీరు అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకోవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను కూడా చేపట్టామన్నారు. జలయజ్ఞంలో భాగంగానే చాలా ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడిపై అందించామని గుర్తుచేశారు. పౌల్ట్రీ ఫామ్ లను కూడా బలోపేతం చేశామన్నారు. ఈ అన్ని అంశాలపై చర్చకు మంంత్రి కేటీఆర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డేట్, టైం చెబితే చర్చకు సిద్ధమన్నారు.
Also Read: ప్రగతి భవన్కు బీహార్ ప్రతిపక్ష నేత.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కీలక చర్చలు ...
ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు
టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరూరా బెల్ట్ షాపులు ఓపెన్ చేసిందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. లిక్కర్ అమ్మకాలతో 7 ఏళ్లల్లో లక్షా 50 వేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారన్నారు. తాగుబోతులకి కేసీఆర్ అంబాసిడర్ గా మారిరని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తులసి వనం లాంటి తెలంగాణను గంజాయి వనంలా మార్చారని ఆరోపించారు. గజ్వేల్ ఫామ్ హౌస్ లో అసలు ఏం పండిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గంజాయి సాగు చేస్తున్నారనే అనుమానం వస్తుందన్నారు. గజ్వేల్ ఫామ్ హౌస్ ను పర్యాటక ప్రాంతంగా మార్చి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతు బీమా ఇస్తున్నామని పత్రికల్లో పెద్దపెద్ద యాడ్స్ వేసుకున్న టీఆర్ఎస్ సర్కార్... 2014 ఆగస్ట్ నుంచి 2018 వరకు మూడున్నర ఏళ్లల్లో 75 వేల 14 మంది రైతులను బలిగొందని ఆరోపిచారు.
రైతు హంతకులు కేటీఆర్, కేసీఆర్
'దేశంలో ఇలాంటి రాష్ట్రం ఎక్కడ లేదు. మూడున్నరేండ్లల్లో ఇంత మంది చనిపోయారంటే. 7 ఏళ్లల్లో ఇంకేంత మంది చనిపోయి ఉంటారో లెక్కలు బయటపెట్టాలి. 18 నుంచి 58 ఏళ్ల వయసు ఉన్న రైతులు చనిపోతున్నారు. ఈ రైతుల చావులకు కేసీఆర్ సర్కార్ కారణం కాదా?. రైతు బంధు సంబురాలు అంటున్నారు. వీరిని మూతి మీద కొట్టాలి. రైతు హంతకులుగా కేటీఆర్, కేసీఆర్ మారారు. రైతుల చావులపై చర్చ చేయడానికి సిద్ధం. అమరవీరుల స్థూపం వద్దా కుర్చుందామా లేదంటే రైతుల మధ్యలోనే మాట్లాడుకుందామా. సవాల్ విసిరితే కేటీఆర్ అయ్యా చాటున లేదంటే కోర్టు చాటున దాకుంటాడు. ' అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఫ్లవరిస్టులు తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు.. బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు
TS High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సర్కార్కు మళ్లీ ఎదురుదెబ్బ, హైకోర్టులో మూసుకున్న దారులు! సుప్రీంలో పిటిషన్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
Revanth Reddy: ప్రగతి భవన్ను పేల్చేసినా ఏం కాదు, దుమారం రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు - BRS ఆందోళన
Breaking News Live Telugu Updates: రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ
Hyderabad Crime News: ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది - తర్వాతే అసలు కథ మొదలైంది!
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Shiva Rajkumar Emotional : కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ
Pawan Kalayan Fans: దుర్గమ్మకు పవన్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్- తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్!
Earthquake Risk Zones: ఇండియాలోనూ భారీ భూకంపాలు తప్పవా? హై రిస్క్ జోన్లో ఆ నగరాలు