అన్వేషించండి

Top Headlines Today: ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు పక్కా వ్యూహం !- కేసీఆర్‌ కే ఓటెస్తం అంటూ కొన్నిచోట్ల తీర్మానం

Top 5 Telugu Headlines Today 27 August 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

ఏ మూల చూసినా టీడీపీనే - ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు పక్కా వ్యూహం !
అధికారంలో ఉంటే అధికార  బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. పార్టీని పట్టించుకోరు. అదే అధికారం లేకపోతే పూర్తి సమయం పార్టీ కోసం కేటాయిస్తారు. ఆయన రాజకీయ వ్యూహాల గురించి ఎవరికీ డౌట్స్ ఉండవు. ఘోర పరాజయం ఎదురైనా.. ఏ మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గించుకోలేదు. మొదటగా నడక ప్రారంభించారు. తర్వాత జాగింగ్ చేశారు. ఇప్పుడు పరుగు అందకుంటున్నారు. ఎన్నికలకు ఆరేడు నెలల ముందే ఏపీలో ఎటు వైపు చూసినా తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపించేలా ప్లాన్ చేసుకున్నారు. మినీ మేనిపెస్టోను ప్రకటించి.. పార్టీ నేతలందర్నీ ఇంటింటికి పంపుతున్నారు. పూర్తి వివరాలు

ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డిక్లరేషన్లు పెట్టండి - హరీశ్ రావు డిమాండ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై అధికార పార్టీ నుంచి విమర్శలు మొదలు అయ్యాయి. ముందు కర్ణాటకలో డిక్లరేషన్ చేసి తర్వాత ఇక్కడ ప్రకటించాలని మంత్రి హరీశ్ రావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, ఛత్తీస్‌ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, అక్కడ వెయ్యి మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. పూర్తి వివరాలు

పేరుకు మాత్రం ఏపీ తెలుగు భాషాభివృద్ధి సంస్థ, లోపల దిమ్మతిరిగే తప్పులు - విపరీతంగా ట్రోలింగ్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు చెందినదిగా వైరల్ అవుతున్న ఓ లేఖ సోషల్ మీడియా విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. అయితే, ఆ లేఖ కచ్చితంగా తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ విడుదల చేసిన లేఖ అనే దానిపై స్పష్టత లేదు. కానీ, అందులోని అక్షర దోషాలు విపరీతంగా ఉన్నాయి. కనీసం ఒక్కో లైనుకు ఒక్కో తప్పు చొప్పున ఆ లేఖలో ఉన్నాయి. తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రదానం చేయబోయే పురస్కారం కోసం ఆ సంస్థే విడుదల చేసిన ఓ ఉత్తర్వులో అన్ని తప్పులు ఉండడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. పూర్తి వివరాలు

119 నియోజకవర్గాలు 1000 అప్లికేషన్లు, కాంగ్రెస్‌కు పెద్ద పరీక్షే, ఆ 881 మంది గమ్మునుంటారా?
కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్రంగా పోటీ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తులు సమర్పించారు. కొందరు స్వయంగా వెళ్లి దరఖాస్తులు సమర్పిస్తే మరికొందరు తమ అనుచరుల ద్వారా గాంధీభవన్ లో అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు ఇల్లెందు నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు ఆశావహులు.  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మూడు నియోజకవర్గాలకు దరఖాస్తు పెట్టారు.  తన ఆశావాహులు అందరితో దరఖాస్తులను పెట్టించారు. ఇలా చాలా మంది నేతలు రెండు మూడు నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీలు అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు

కేసీఆర్‌ సార్‌కే ఓటెస్తం - కామారెడ్డి జిల్లాలో 9 పంచాయతీల్లో తీర్మానం
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన సమయంలో సీఎం కేసీఆర్ తాను గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్‌ఎస్‌ను బలపరిచేందుకు ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కేసీఆర్ గెలుపు చారిత్రాత్మకంగా ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగా ఏకంగా పంచాయతీలకు పంచాయతీలే ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget