News
News
X

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ్టి ముఖ్యమైన అప్‌డేట్స్ ఇవే

జోడో యాత్రకు సంఘీభావంగా గణతంత్య్ర సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర నేడు కొనసాగునుంది.

FOLLOW US: 
Share:

ఆల్‌ ఇండియా కోటా ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

ఆల్‌ఇండియాకోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిశ్వవిద్యాలయం  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ హోమియోపతి కళాశాలల్లోని ఆల్‌ ఇండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 3వ తేది సాయంత్రం 6 గంటలవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏఐఏపీజీఈటీ-2022 అర్హత సాధించిన అభ్యర్ధులు ఈ ఆల్‌ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

నేటి నుంచే టీచర్ల బదిలీలు

తెలంగాణలో నేటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభంకానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నెంబర్‌ 5ను జారీ చేశారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరుగుతాయిని అందులో ఆమె స్పష్టం చేశారు. కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల(హెచ్‌ఎం) పదోన్నతికి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఈనెల 28వ తేదీ నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీనికి మూడు రోజులే గడువు విధించారు. 

కొనసాగుతున్న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర 

జోడో యాత్రకు సంఘీభావంగా గణతంత్య్ర సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర నేడు కొనసాగునుంది. తమతమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలంతా ఈ యాత్రను ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ ను టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ భారత్ జోడో యాత్ర కు కొనసాగింపుగా వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం మదనపల్లిలో హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 

హైటెక్స్ లో పెటెక్స్ ఇండియా ప్రదర్శన 

నేటి నుంచి హైటెక్స్ లో పెటెక్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభం కానుంది. 500 రకాల కుక్కలు, 120 రకాల పిల్లులను ప్రదర్శించనున్నారు. 

హైదారాబాద్ లో లిటరేచర్ ఫెస్టివల్

నేటి నుంచి హైదారాబాద్ లో లిటరేచర్ ఫెస్టివల్ సెక్రటేరియట్ సమీపంలోని విద్యారణ్య స్కూల్లో ప్రారంభంకానుంది. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత్ దామోదర్ మౌజోతోపాటు రచయితలు, కళాకారులు, దర్శకులు ఈ కార్యక్రమాికి హాజరుకానున్నారు. 

Published at : 27 Jan 2023 08:09 AM (IST) Tags: Telugu News Today Telangana LAtest News TS News Developments Today Telangana Headlines Today

సంబంధిత కథనాలు

Political  Panchamgam :  ఏ పార్టీ పంచాంగం వారిదే -  రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?

Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?

Karimnagar News: ఉగాది పండుగ చేసుకునే పరిస్థితి లేదు, నష్టపోయిన పంటల్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈటల

Karimnagar News: ఉగాది పండుగ చేసుకునే పరిస్థితి లేదు, నష్టపోయిన పంటల్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈటల

Kavitha : ప్రగతి భవన్‌కు చేరుకున్న కవిత - 24న సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ !

Kavitha :   ప్రగతి భవన్‌కు చేరుకున్న కవిత - 24న సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ !

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

టాప్ స్టోరీస్

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?