అన్వేషించండి

Crime News: పతంగులు నింపిన విషాదం - గాలిపటాలు ఎగరేస్తూ వేర్వేరు జిల్లాల్లో ముగ్గురు మృతి

Telangana News: పండుగ పూట పతంగులు ఎగురవేస్తూ ముగ్గురు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణలో జరిగింది. 3 జిల్లాల్లో వేర్వేరు చోట్ల గాలిపటాలు ఎగరేస్తూ వీరు ప్రాణాలు కోల్పోయారు.

Three People Died While Flying Kites In Telangana: పండుగ సందర్భంగా పతంగుల సరదా వారి ప్రాణం తీసింది. భవనాలపై గాలిపటాలు ఎగరేస్తూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనలు నిర్మల్, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ (Nirmal) పట్టణంలోని గుల్జార్ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ షఫీ రెండో కుమారుడు హుఫేజ్ (11) తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉన్న బాలుడు బుధవారం స్నేహితులతో కలిసి పతంగులు ఎగురవేసేందుకు ఓ భవనంపైకి వెళ్లాడు. గాలిపటం ఎగరేస్తూ భవనం పైనుంచి కింద పడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అటు, యాదాద్రి జిల్లా (Yadadri District) మోటకొండూరు మండలం అమ్మనబోలులో జూపల్లి నరేందర్ (48) సంక్రాంతి సందర్భంగా మంగళవారం డాబాపైకి ఎక్కి పతంగి ఎగురవేశారు. డాబాపై రక్షణ గోడ లేకపోవడంతో కిందపడిపోయారు. తీవ్ర గాయాలైన ఆయన్ను కుటుంబసభ్యులు ఆలేరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు, రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడకు చెందిన కె.మహేశ్‌యాదవ్ (39) పతంగి ఎగురవేయడానికి మంగళవారం ఓ భవనం ఎక్కారు. గాలిపటం ఎగరేస్తూ అదుప తప్పి భవనం పైనుంచి కింద పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అటు, చైనా మాంజా దారాలు తగిలి వివిధ ప్రాంతాల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read: Congress Arrests: బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
KTR on Kavitha Party: చాలా పార్టీలు వస్తూంటాయి, పోతూంటాయి - కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
చాలా పార్టీలు వస్తూంటాయి, పోతూంటాయి - కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Punjab Crisis: పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Embed widget