అన్వేషించండి

Darmapuri Srinivas: డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Telangana News: కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం ప్రకటించారు. ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

Darmapuri Srinivas Funeral With Official Ceremony: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) (Darmapuri Srinivas) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్ కీలక పాత్ర పోషించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సైతం డీఎస్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. డీఎస్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని.. ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని గుర్తు చేసుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని పేర్కొన్నారు. 

ప్రముఖుల నివాళి

డీఎస్ పార్థీవ దేహానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డీఎస్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డీఎస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజా సేవకే అంకితమయ్యారని.. 2004- 2009 వరకూ అసెంబ్లీలో ఆయన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. డీఎస్ మృతి పట్ల మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందారని.. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డీఎస్ పార్థీవ దేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్ సుదీర్ఘ కాలం సేవలందించారని పేర్కొన్నారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

డీఎస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డీఎస్ పార్థీవ దేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి.. మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు డీఎస్ భౌతిక కాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Also Read: Dharmapuri Srinivas: శీనన్న ఇక లేరు- ప్రముఖల సంతాపం- ఐ విల్‌ మిస్ యూ డాడి అంటూ ఎంపీ అరవింద్ ఎమోషనల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Volunteers In Andhra Pradesh: వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
New Criminal Laws: కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
లోక్‌సభలో శివుడి ఫొటోతో రాహుల్ గాంధీ స్పీచ్‌, స్పీకర్ అభ్యంతరం
లోక్‌సభలో శివుడి ఫొటోతో రాహుల్ గాంధీ స్పీచ్‌, స్పీకర్ అభ్యంతరం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Volunteers In Andhra Pradesh: వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
New Criminal Laws: కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
లోక్‌సభలో శివుడి ఫొటోతో రాహుల్ గాంధీ స్పీచ్‌, స్పీకర్ అభ్యంతరం
లోక్‌సభలో శివుడి ఫొటోతో రాహుల్ గాంధీ స్పీచ్‌, స్పీకర్ అభ్యంతరం
Prabhas Mania : 4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు
4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు
Andhra Pradesh: అమరావతి నిర్మాణానికి పింఛన్ సొమ్ము 10వేలు విరాళంగా ఇచ్చిన దివ్యాంగుడు ముకేష్‌
అమరావతి నిర్మాణానికి పింఛన్ సొమ్ము 10వేలు విరాళంగా ఇచ్చిన దివ్యాంగుడు ముకేష్‌
Viral Video: జలపాతంలో పడి కొట్టుకుపోయిన కుటుంబం, సాయం కోసం ఆర్తనాదాలు - క్షణాల్లో గల్లంతు
జలపాతంలో పడి కొట్టుకుపోయిన కుటుంబం, సాయం కోసం ఆర్తనాదాలు - క్షణాల్లో గల్లంతు
Pension Money: 'స్పృహ తప్పి పడిపోయా, రూ.4 లక్షలు ఎత్తుకెళ్లారు' - ప్రొద్దుటూరులో పింఛన్ సొమ్ము మాయం, పోలీసుల అనుమానం
'స్పృహ తప్పి పడిపోయా, రూ.4 లక్షలు ఎత్తుకెళ్లారు' - ప్రొద్దుటూరులో పింఛన్ సొమ్ము మాయం, పోలీసుల అనుమానం
Embed widget