అన్వేషించండి

Telangana News: ఆన్ లైన్ ఆర్థిక మోసాల నమోదులో తెలంగాణనే టాప్!

Telangana News: గతేడాదికి సంబంధించిన ఆన్ లైన్ ఆర్థిక మోసాల నమోదులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. 2021లో ఒక్క తెలంగాణలోనే 2003 కేసులు వచ్చాయి. 

Telangana News: 2021వ సంవత్సరానికి సంబంధించి ఆన్ లైన్ ఆర్థిక మోసాల నమోదులో తెలంగాణ ప్రథమంగా నిలిచింది. గత సంవత్సరం ఒక్క తెలంగాణలోనే 2003 కేసులు నమోదు అయ్యాని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిసి 14007 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలోనూ ప్రతి ఏటా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. లోక్ సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2010వ సంవత్సరంలో 282 కేసులు నమోదు కాగా.. 2020లో 3361కి కేసులు చేరుకోవడం గమనార్హం. 2019లో 172 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. 2020లో 582 మందిని, 2021లో 743 మంది ఆన్ లైన్ లో మోసగాళ్లని అరెస్ట్ చేసినట్లు వివరించింది. శిక్షల్లో మాత్రం భారీ తేడా ఉందని కేంద్రం వెల్లడించింది. అలాగే 2010లో ఇద్దరికి, 2020లో 202 మందికి, 2021లో 3 కేసుల్లో మాత్రమే శిక్షలు పడినట్లు కేంద్రం స్పష్టం చేసింది. 

పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ ఆశలు..

పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మొదట వాట్సాప్, ఫేస్ బుక్, టెక్స్ట్ మెసేజెస్ చేస్తూ.. అమాయకులు ఆకర్షితులయ్యేలా చేస్తారు. పార్ట్ టైం జాబ్స్ పేరిట ఇంట్లో కూర్చుని రోజుకి 10,000 నుంచి 25,000 వేల వరకూ సంపాదించడంటూ మెస్సేజెస్ చేస్తారు. ఒక్కసారి మనం ఆ లింక్ ను క్లిక్ చేసినా, అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసినా ఇక మన పని అయిపపోనట్టే. అలా రోజుకి హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు దాదాపు 20 నుంచి 30 వరకు కేసులు వస్తున్నాయంటే మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే లక్ష రూపాయలు దాటితేనే ఫిర్యాదు చేసేందుకు బాధితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. లక్షకు తక్కువ జరిగిన ఫిర్యాదులు స్థానిక పోలీస్ స్టేషన్ లోనే నమోదవుతాయి. దీని బట్టి రోజుకి కనీసం వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్న మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న వారు పరువు కోసమో లేదా కొంత డబ్బే కదా అని ఫిర్యాదు కూడా చేయడం లేదు. 

ముక్కూ, మొహం తెలియని వాళ్లకు అస్సలే డబ్బు పంపించొద్దు..

లాకే డౌన్ తరవాత ఇటువంటి మోసాల సంఖ్య అధికమైంది. ఎప్పుడైనా, ఎవరైనా సరే ఉద్యోగం పేరుతో డబ్బు అడిగితే అది కచ్చితంగా మోసపురితం అని గ్రహించాలి. అదే విదంగా ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఒకసారి డబ్బు కట్టాక.. మళ్లీ మళ్లీ పెద్ద మోతాదులో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయమని అడిగితే మీరు మోసపోతున్నట్లు గుర్తించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగులను, హౌస్ ఫైవ్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం పేరుతో మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ముక్కూ, మొహం తెలియని వాళ్లకు డబ్బులు పంపించకూడదని పేర్కొంటున్నారు. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే తమను ఆశ్రయించాలని కోరారు. అప్పుడే ఇలాంటి మోసాలను అడ్డుకోగలం అని తెలిపారు. ముఖ్యంగా యువత ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి మోసాలకు గురవకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLAs Disqualification Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
Sreeleela: 'రాబిన్‌హుడ్' డిజాస్టర్ తర్వాత శ్రీలీలకు మరో షాక్... క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి 'కిస్సిక్' పాప అవుట్?
'రాబిన్‌హుడ్' డిజాస్టర్ తర్వాత శ్రీలీలకు మరో షాక్... క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి 'కిస్సిక్' పాప అవుట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Digvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP DesamRishabh Pant Poor form 27Cr Auction price | IPL 2025 లో ఘోరంగా విఫలమవుతున్న పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLAs Disqualification Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
Sreeleela: 'రాబిన్‌హుడ్' డిజాస్టర్ తర్వాత శ్రీలీలకు మరో షాక్... క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి 'కిస్సిక్' పాప అవుట్?
'రాబిన్‌హుడ్' డిజాస్టర్ తర్వాత శ్రీలీలకు మరో షాక్... క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి 'కిస్సిక్' పాప అవుట్?
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
KCR Met BRS Leaders: ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
ETV Win OTT Release: 4 సినిమాలు, 3 వెబ్ సిరీస్‌లు, సర్‌ప్రైజ్‌లు ఎన్నో - ఏప్రిల్‌ 2025లో 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇవే
4 సినిమాలు, 3 వెబ్ సిరీస్‌లు, సర్‌ప్రైజ్‌లు ఎన్నో - ఏప్రిల్‌ 2025లో 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇవే
Property Loan: ఆస్తి తనఖా లోన్‌లపై లేటెస్ట్‌ వడ్డీ రేట్లు - రుణం తీసుకునే ముందు ఇది తెలుసుకోండి
ఆస్తి తనఖా లోన్‌లపై లేటెస్ట్‌ వడ్డీ రేట్లు - రుణం తీసుకునే ముందు ఇది తెలుసుకోండి
Embed widget