By: ABP Desam | Updated at : 10 Aug 2021 12:16 PM (IST)
తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్పై విద్యాశాఖ ప్రతిపాదన (ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పిల్లల చదువులన్నీ గందరగోళంలో పడ్డాయి. వారు సరిగ్గా స్కూలుకు వెళ్లి ఏడాదిన్నర అవుతోంది. రెండో వేవ్కు ముందు స్కూళ్లు తెరిచినప్పటికీ కేసులు పెరిగిపోవడంతో మూసేయాల్సి వచ్చింది. ఇప్పుడు రెండో వేవ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. మళ్లీ స్కూళ్లు తెరవాలని పాఠశాల విద్యాశాఖ కోరుతోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఈ క్రమంలో కొవిడ్ మూడో వేవ్ హెచ్చరికలు ఉన్నందున ఈ సమయంలో పాఠశాలలు తెరవడం సాధ్యమా అనే సందేహం తలెత్తుతోంది.
ఆగస్టు 15 నుంచి తెరవాలి: విద్యాశాఖ
దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లను దశలవారీ పద్ధతిలో ఇప్పటికే తెరిచారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తెలంగాణలో కూడా స్కూళ్లు తెరవడంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 1న జరిగిన మంత్రి మండలి సమావేశానికి ముందు రోజు తాము నివేదికను సమర్పించామని, కానీ ఆ విషయం కేబినెట్లో చర్చించలేదని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 15 తర్వాత స్కూళ్లను దశల వారీగా మొదలుపెట్టాలని తాము సూచించామని చెప్పారు.
అయితే, స్కూళ్లను రోజు విడిచి రోజు కరోనా నిబంధనలతో తెరవాలని ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. దీనికి తగ్గట్లుగా కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో స్కూళ్లు తెరవడం లేదు. అయితే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరచుకుంటే ఇక్కడ కూడా స్కూళ్లు తెరవాలని ఒత్తిడి వస్తుంది కాబట్టి.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: Telangana ACB: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏవో, ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్.. ఏసీబీ అధికారులు షాక్!
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
ఏపీలో ఈనెల 16 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నారు. తమిళనాడులో సెప్టెంబరు 1 నుంచి మొదలుపెట్టనున్నారు. అక్కడ 9 నుంచి 12 తరగతులను 50 శాతం విద్యార్థులతో నేరుగా క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కర్ణాటకలో 9 నుంచి 12 తరగతులకు ఈ నెల 23 నుంచి ఆఫ్లైన్ క్లాసులు మొదలుపెట్టనున్నారు. ఇక్కడ విద్యార్థులను రెండు గ్రూపులుగా వేరు చేసి రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్లో ఈ నెల 16 నుంచి సగం మంది విద్యార్థులతో 11వ తరగతిపైబడిన విద్యాసంస్థలు తెరవనున్నారు. ఒడిశాలో జులై 26 నుంచి ఈ తరగతులనే ప్రారంభించనున్నారు. కేసులు అధికంగా ఉండే మహారాష్ట్రలోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈనెల 17 నుంచి తరగతులు నిర్వహించాలని ఉద్ధవ్ ప్రభుత్వం నిర్ణయించింది.
Hayath Nagar Crime : హయత్ నగర్ లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ అలజడి, గేటెడ్ కమ్యూనిటీలో చోరీ
Revant Reddy One Year : టీ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డికి ఏడాది ! కాంగ్రెస్ను రేసులోకి తేగలిగారా ?
Vikarabad News : ప్రియుడి ఇంట్లో యువతి ఆత్మహత్యాయత్నం, పెళ్లికి పది లక్షల కట్నం డిమాండ్ చేసిన యువకుడు!
Minister KTR : హైదరాబాద్ లో విమాన ఇంజిన్ల నిర్వహణ సెంటర్, రూ. 1200 కోట్ల పెట్టుబడులు- మంత్రి కేటీఆర్
Breaking News Live Telugu Updates: రాజేంద్రనగర్లో ఘోరం, మహిళను ఢీకొట్టిన కారు - రివర్స్ తీసుకొని మరీ
YSRCP Plenary 2022 : ప్లీనరీ సక్సెస్ చూసి చంద్రబాబు మళ్లీ బోరు ఏడుస్తారు - ఎంపీ విజయసాయి రెడ్డి
IND-W vs SL-W, 3rd ODI: హర్మన్ ప్రీత్ డిస్ట్రక్షన్! లంకను కుప్పకూల్చిన రాజేశ్వరీ, మేఘనా
Multibagger stock: ఏడాదిలో లక్షకు రూ.13 లక్షల ప్రాఫిట్! 800% ర్యాలీ చేసిన మల్టీబ్యాగర్
Auto Insurance new Rules: వాహన బీమా రూల్స్ ఛేంజ్! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!