అన్వేషించండి

Rising Summit: తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ప్రచారానికి తగ్గ ఫలితాలు సాధించిందా? అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎక్కడ?

Telangana: తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఫలితాలపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. కానీ ప్రజల్లో మాత్రం భిన్న చర్చ జరుగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Telangana Rising Summit Sucess :  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగిసింది. భారీ విజయాలు నమోదు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఐదు లక్షల కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు వచ్చినట్లుగా చెప్పింది. అయితే పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు చేసుకున్న సంస్థలు అత్యధికం దేశీయ పరిశ్రమలే. ట్రంప్ కంపెనీ తప్ప అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదన్న భావన ఎక్ుకవగా వినిపిస్తోంది. సీఎం రేవంత్  రెండు నెలల నుంచి రోజూ ఈ సమ్మిట్ గురించే మాట్లాడుతూ వచ్చారు.  దాంవోస్ లాంటిది, ప్రపంచం మొత్తం చూస్తుందని చెబుతూ వచ్చారు. కానీ ఈ సమ్మిట్ కు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలైన   గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా, సామ్‌సంగ్ వంటి వాటి నుంచి  ఎవరూ రాలేదు.   

సమ్మిట్ లో  పాల్గొనేలా అంతర్జాతీయ సంస్థలను ఒప్పించలేకపోయిన ప్రభుత్వం      

సమ్మిట్ లక్ష్యం 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొంటారని ప్రకటించినప్పటికీ, వాస్తవానికి అంతర్జాతీయ పాల్గొనేవారు కనిపించలేదు. వేదికలు ఖాళీగా కనిపించాయి, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా, మెటా, సామ్‌సంగ్, ఫాక్స్‌కాన్, షెల్, GE, సిమెన్స్ వంటి టాప్ MNCs లేవు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్,  సావరిన్ హెల్త్ ఫండ్స్ కు చెందిన సంస్థలు  దూరంగా ఉన్నాయి.   అనంద్ మహీంద్రా, చిరంజీవి, దిల్ రాజు, అల్లు అరవింద్, దువ్వూరి సుబ్బారావు  వంటి వారు వచ్చి వెళ్లారు.  కిషన్ రెడ్డి తప్ప కేంద్ర మంత్రులు కూడా రాలేదు.   గ్రీన్ ఎనర్జీ, సోలార్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు వచ్చాయి.  డేటా సెంటర్లకు రూ.85 వేల కోట్లు, ఫార్మాకు రూ.3,500 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.2 వేల కోట్ల ఎంవోయూలు జరిగాయి. వీటిలో చాలా వరకూ కొత్తవి కావు. ఉన్న వాటికి అదనపు పెట్టుబడులే.          

పెట్టుబడుల ఒప్పందాలు గ్రౌండ్ చేయించడం కీలకం              
 
సమ్మిట్‌లో ప్రధానంగా శక్తి, ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లపై దృష్టి సారించారు. మొత్తం ఒప్పందాల్లో  పవర్ సెక్టార్ మాత్రమే రూ. 3.24 లక్షల కోట్లు (సుమారు 56%) పొందింది. ఇతర సెక్టార్లు కూడా ఉద్యోగాల సృష్టికి దోహదపడతాయి, కానీ అంతర్జాతీయ  దిగ్గజాలు పాల్గొనేకపోవడంతో  గ్లోబల్ ఇమేజ్ మెరుగుపడలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.  పవన్ సెక్టార్‌లో గ్రీన్ హైడ్రోజన్, సోలార్, బ్యాటరీ స్టోరేజ్ వంటి ప్రాజెక్టులు ఆకర్షణీయం, కానీ ఇవి స్థానిక కంపెనీలు మాత్రమే. ఐటీ, ఫార్మాలో అంతర్జాతీయ దిగ్గజాలు లేకపోవడంతో, తెలంగాణ గ్లోబల్ హబ్‌గా మార్చే ప్రయత్నాలు ముందుకు పడలేదని అనుకోవచ్చు.

గ్లోబల్ ఇమేజ్ కోసం మరింతగా కష్టపడాల్సిందే !            

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షత వహించినప్పటికీ, అంతర్జాతీయ ఆకర్షణ లేకపోవడంతో ప్రభుత్వం మీద విమర్శలు పెరిగాయి. రాజకీయంగా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ డ్రైవ్‌గా ఉండాల్సి ఉంది.  భవిష్యత్తులో, ఈ ఒప్పందాల అమలు విఫలమైతే, రాష్ట్ర ఆర్థిక వృద్ధి (GSDP)పై ప్రభావం పడుతుంది.  TGS తెలంగాణ గ్లోబల్ ఇమేజ్‌ను మెరుగుపరచలేకపోయినా, ప్రకటించిన పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. ప్రభుత్వం ఇకపై అంతర్జాతీయ రోడ్‌షోలు, MNCలతో డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. అధికారులు, పరిశ్రమలు ఈ ఒప్పందాల అమలుపై మానిటరింగ్ చేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
Telangana Amarnath Yatra: తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రకు పోటెత్తిన భక్తులు! ఏడాదికి మూడు రోజులే అవకాశం , సలేశ్వరం సాహసయాత్ర రూట్ మ్యాప్!
తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రకు పోటెత్తిన భక్తులు! ఏడాదికి మూడు రోజులే అవకాశం , సలేశ్వరం సాహసయాత్ర రూట్ మ్యాప్!

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Bhumana Karunakar Reddy : భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
Ranabaali Leaks : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
West Bengal Latest News:పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
Petro Price Hike: ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదా? ముడి చమురు సెగ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదా? ముడి చమురు సెగ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
Embed widget