అన్వేషించండి

Road Accident: మిర్యాలగూడలో నెత్తురోడిన రోడ్డు... ఆగివున్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు... ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని చింతపల్లి హైవే వద్ద ఆగి  ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ బస్సు ఏపీలోని ఒంగోలు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు. 

Also Read: HCU Student Suicide: హెచ్‌సీయూలో విద్యార్థిని ఆత్మహత్య.. ఐయామ్‌ సో బ్యాడ్‌ డాటర్‌.. సూసైడ్ నోట్ లభ్యం!

15 మందికి గాయాలు

నల్గొండ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ హైవేపై ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. తెల్లవారుజాము 2 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యారు. మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను పోలీసులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. లారీని బస్సు బలంగా ఢీకొట్టడంతో సీట్ల మధ్యలో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీయగలిగారు. 

Also Read: Agri Gold Funds: నేడు అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపు... 7 లక్షల మంది ఖాతాల్లో రూ.666.84 కోట్లు జమచేస్తామని ప్రభుత్వం ప్రకటన

దాచేపల్లి వద్ద తృటిలో తప్పిన ప్రమాదం

ఈ ప్రమాదంలో మృతులను  మల్లికార్జున్, నాగేశ్వరరావు, జయరావుగా పోలీసులు గుర్తించారు. శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే లారీని ఢీకొట్టినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి ముందు దాచేపల్లి వద్ద ఓ ఆటోను ఢీకొట్టబోయి తృటిలో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అంటున్నారు. ఈ బస్సులో మొత్తం 30 మంది ప్రయాణిస్తున్నారు. నిద్రమత్తుతో ఉన్న డ్రైవర్‌ను పదే పదే అప్రమత్తం చేసినా అతడు డ్రైవింగ్ కొనసాగించాడని ప్రయాణికులు అంటున్నారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై  పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read: De-Reservation Tickets: ఆ బోగీల్లో ప్రయాణానికి రిజర్వేషన్ అవసరంలేదు... దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. దశలవారీగా 74 రైళ్లలో అమలు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భైంసాలో విషాదం!2వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల పాప మృతి!
భైంసాలో విషాదం!2వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల పాప మృతి!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget