అన్వేషించండి

Gazette Notification: ప్రైవేటు వ్యక్తులకు విద్యుత్ పంపిణీ రంగం, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లు - అమలు ఇలా

Gazette Notification: విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నగరం లేదా మూడు జిల్లాల చొప్పున ఒక్కో సంస్థకి కేటాయించనున్నారు. 

Union Government Gazette Notification: విద్యుత్ పంపిణీ (Power Distribution) రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం (సెప్టెంబరు 21) ఏకంగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు వద్దని తెలంగామ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తుండగా... బిల్లుతో సంబంధం లేకుండా అందులో ఉన్న అంశాలనే దాదాపు అమల్లోకి తెస్తూ.. తాజా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. విద్యుత్తు పంపిణీ చేసి బిల్లులు వసూలు చేసుకోవడానికి ప్రాంతాల వారీగా కంపెనీలకు జారీ చేసే లైసెన్సుల విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఒక సంస్థ లేదా వ్యక్తి విద్యుత్ పంపిణీ బాధ్యతలు చేపట్టేందుకు ప్రాంతాల పరిధిని నిర్ణయిస్తూ... విద్యుత్తు చట్ట నియమావళికి సవరణ చేస్తూ.. గెజిట్ జారీ చేయడంతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 

జారీ అయిన రోజు నుంచి అమల్లోకి...

విద్యుత్తు పంపిణీని ఏదైనా సంస్థ లేగా వ్యక్తులకైనా అప్పగించే లైసెన్సుల జారీకి ఎంత ప్రాంతాన్ని కేటాయించాలో కేంద్ర విద్యుత్తు శాఖ నోటిఫికేషన్ లో వివరించింది. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ -176లో అదనంగా రెండు నిబంధనలు చేరుస్తూ... నియమావళిని సవరించినట్లు తెలిపింది. ఇది జారీ అయిన రోజు నుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు అన్ని వర్గాల ప్రజలకు కరెంటు పంపిణీ చేస్తున్నాయి. ఈ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం కింద ఉండటం వల్ల విద్యుత్తు పంపిణీలో భారీగా నష్టాలు వస్తున్నాయని, ప్రాంతాల వారీగా పంపిణీని విభజించి ప్రైవేటు కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. లైసెన్సు కేటాయించే ప్రాంతం ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండాలి. లేదా పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాలలను కేటాయించాలని ఈ నోటిఫికేషన్ లో కొత్త నిబంధనను చేర్చింది. 

బుధవారమే మరో గెజిట్ నోటిఫికేషన్..

రాష్ట్ర ప్రభుత్వ యోచన మేరకు ఇంతకన్నా తక్కువ ప్రాంతం అయిన కేటాయించవచ్చని వెసులుబాటు కల్పించింది. అంటే కొత్తగా లైసెన్స్ తీసుకునే సంస్థ లేదా వ్యక్తికి ఎంత ప్రాంతంలో విద్యుత్తు పంపిణీ అధికారం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయించకపోతే పక్క పక్కనే ఉన్న మూడు జిల్లాలు లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా లేదా అందులో కొంత ప్రాంతం కేటాయించాలి. డిస్కంల పనితీరును మెరుగుపరిచేందుకు విద్యుత్తు నియంత్రణ మండళ్ల జాతీయ వేదికకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఈ మేరకు మరో గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర విద్యుత్తు శాఖ బుధవారం జారీ చేసింది. దీని ప్రకారం మూడు నెలలకు ఒకసారి విద్యుత్తు కొనుగోలు, పంపిమీ వివరాలు, ఆధాయ వ్యయాలు, ప్రభుత్వాల నుంచి అందాల్సిన రాయితీల గణాంకాల నివేదికలను ప్రతి డిస్కం రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి ఇవ్వాలి.

 నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి..

రాష్ట్ర ప్రబుత్వం ఏ వర్గాలకైనా ఉచితంగా లేదా రాయితీపై కరెంట్ సరపలా చేస్తే ఆ మేరకు నిధులను డిస్కంలకు విడుదల చేశారా లేదా అనేది పక్కాగా టెక్కలివ్వాలి. ఈ లెక్కలను డిస్కంలు సక్రమంగా ఇస్తున్నాయా లేదా అనే వివరాలను ఈఆర్సీల వేదిక ప్రతి త్రైమాసికం తర్వాత నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలి. విద్యుత్ చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు కరెంటు ఛఆర్జీల సవరణ ఉత్తర్వులను ప్రతి ఈఆర్సీ జారీ చేయాలి. ఈ ఉత్తర్వులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా జారీ చేస్తున్నారా లేదా, డిస్కంల ఆదాయ వ్యయాల లెక్కలన్నీ ఈ ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించారా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీల నిధుల సక్రమంగా వచ్చినట్లు ఇందులో తెలిపారా అనేది ఈఆర్సీలు పక్కాగా గమనించాలి. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget