అన్వేషించండి

Gazette Notification: ప్రైవేటు వ్యక్తులకు విద్యుత్ పంపిణీ రంగం, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లు - అమలు ఇలా

Gazette Notification: విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నగరం లేదా మూడు జిల్లాల చొప్పున ఒక్కో సంస్థకి కేటాయించనున్నారు. 

Union Government Gazette Notification: విద్యుత్ పంపిణీ (Power Distribution) రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం (సెప్టెంబరు 21) ఏకంగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు వద్దని తెలంగామ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తుండగా... బిల్లుతో సంబంధం లేకుండా అందులో ఉన్న అంశాలనే దాదాపు అమల్లోకి తెస్తూ.. తాజా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. విద్యుత్తు పంపిణీ చేసి బిల్లులు వసూలు చేసుకోవడానికి ప్రాంతాల వారీగా కంపెనీలకు జారీ చేసే లైసెన్సుల విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఒక సంస్థ లేదా వ్యక్తి విద్యుత్ పంపిణీ బాధ్యతలు చేపట్టేందుకు ప్రాంతాల పరిధిని నిర్ణయిస్తూ... విద్యుత్తు చట్ట నియమావళికి సవరణ చేస్తూ.. గెజిట్ జారీ చేయడంతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 

జారీ అయిన రోజు నుంచి అమల్లోకి...

విద్యుత్తు పంపిణీని ఏదైనా సంస్థ లేగా వ్యక్తులకైనా అప్పగించే లైసెన్సుల జారీకి ఎంత ప్రాంతాన్ని కేటాయించాలో కేంద్ర విద్యుత్తు శాఖ నోటిఫికేషన్ లో వివరించింది. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ -176లో అదనంగా రెండు నిబంధనలు చేరుస్తూ... నియమావళిని సవరించినట్లు తెలిపింది. ఇది జారీ అయిన రోజు నుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు అన్ని వర్గాల ప్రజలకు కరెంటు పంపిణీ చేస్తున్నాయి. ఈ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం కింద ఉండటం వల్ల విద్యుత్తు పంపిణీలో భారీగా నష్టాలు వస్తున్నాయని, ప్రాంతాల వారీగా పంపిణీని విభజించి ప్రైవేటు కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. లైసెన్సు కేటాయించే ప్రాంతం ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండాలి. లేదా పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాలలను కేటాయించాలని ఈ నోటిఫికేషన్ లో కొత్త నిబంధనను చేర్చింది. 

బుధవారమే మరో గెజిట్ నోటిఫికేషన్..

రాష్ట్ర ప్రభుత్వ యోచన మేరకు ఇంతకన్నా తక్కువ ప్రాంతం అయిన కేటాయించవచ్చని వెసులుబాటు కల్పించింది. అంటే కొత్తగా లైసెన్స్ తీసుకునే సంస్థ లేదా వ్యక్తికి ఎంత ప్రాంతంలో విద్యుత్తు పంపిణీ అధికారం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయించకపోతే పక్క పక్కనే ఉన్న మూడు జిల్లాలు లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా లేదా అందులో కొంత ప్రాంతం కేటాయించాలి. డిస్కంల పనితీరును మెరుగుపరిచేందుకు విద్యుత్తు నియంత్రణ మండళ్ల జాతీయ వేదికకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఈ మేరకు మరో గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర విద్యుత్తు శాఖ బుధవారం జారీ చేసింది. దీని ప్రకారం మూడు నెలలకు ఒకసారి విద్యుత్తు కొనుగోలు, పంపిమీ వివరాలు, ఆధాయ వ్యయాలు, ప్రభుత్వాల నుంచి అందాల్సిన రాయితీల గణాంకాల నివేదికలను ప్రతి డిస్కం రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి ఇవ్వాలి.

 నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి..

రాష్ట్ర ప్రబుత్వం ఏ వర్గాలకైనా ఉచితంగా లేదా రాయితీపై కరెంట్ సరపలా చేస్తే ఆ మేరకు నిధులను డిస్కంలకు విడుదల చేశారా లేదా అనేది పక్కాగా టెక్కలివ్వాలి. ఈ లెక్కలను డిస్కంలు సక్రమంగా ఇస్తున్నాయా లేదా అనే వివరాలను ఈఆర్సీల వేదిక ప్రతి త్రైమాసికం తర్వాత నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలి. విద్యుత్ చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు కరెంటు ఛఆర్జీల సవరణ ఉత్తర్వులను ప్రతి ఈఆర్సీ జారీ చేయాలి. ఈ ఉత్తర్వులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా జారీ చేస్తున్నారా లేదా, డిస్కంల ఆదాయ వ్యయాల లెక్కలన్నీ ఈ ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించారా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీల నిధుల సక్రమంగా వచ్చినట్లు ఇందులో తెలిపారా అనేది ఈఆర్సీలు పక్కాగా గమనించాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Embed widget