అన్వేషించండి

Gazette Notification: ప్రైవేటు వ్యక్తులకు విద్యుత్ పంపిణీ రంగం, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లు - అమలు ఇలా

Gazette Notification: విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నగరం లేదా మూడు జిల్లాల చొప్పున ఒక్కో సంస్థకి కేటాయించనున్నారు. 

Union Government Gazette Notification: విద్యుత్ పంపిణీ (Power Distribution) రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం (సెప్టెంబరు 21) ఏకంగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు వద్దని తెలంగామ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తుండగా... బిల్లుతో సంబంధం లేకుండా అందులో ఉన్న అంశాలనే దాదాపు అమల్లోకి తెస్తూ.. తాజా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. విద్యుత్తు పంపిణీ చేసి బిల్లులు వసూలు చేసుకోవడానికి ప్రాంతాల వారీగా కంపెనీలకు జారీ చేసే లైసెన్సుల విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఒక సంస్థ లేదా వ్యక్తి విద్యుత్ పంపిణీ బాధ్యతలు చేపట్టేందుకు ప్రాంతాల పరిధిని నిర్ణయిస్తూ... విద్యుత్తు చట్ట నియమావళికి సవరణ చేస్తూ.. గెజిట్ జారీ చేయడంతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 

జారీ అయిన రోజు నుంచి అమల్లోకి...

విద్యుత్తు పంపిణీని ఏదైనా సంస్థ లేగా వ్యక్తులకైనా అప్పగించే లైసెన్సుల జారీకి ఎంత ప్రాంతాన్ని కేటాయించాలో కేంద్ర విద్యుత్తు శాఖ నోటిఫికేషన్ లో వివరించింది. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ -176లో అదనంగా రెండు నిబంధనలు చేరుస్తూ... నియమావళిని సవరించినట్లు తెలిపింది. ఇది జారీ అయిన రోజు నుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు అన్ని వర్గాల ప్రజలకు కరెంటు పంపిణీ చేస్తున్నాయి. ఈ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం కింద ఉండటం వల్ల విద్యుత్తు పంపిణీలో భారీగా నష్టాలు వస్తున్నాయని, ప్రాంతాల వారీగా పంపిణీని విభజించి ప్రైవేటు కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. లైసెన్సు కేటాయించే ప్రాంతం ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండాలి. లేదా పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాలలను కేటాయించాలని ఈ నోటిఫికేషన్ లో కొత్త నిబంధనను చేర్చింది. 

బుధవారమే మరో గెజిట్ నోటిఫికేషన్..

రాష్ట్ర ప్రభుత్వ యోచన మేరకు ఇంతకన్నా తక్కువ ప్రాంతం అయిన కేటాయించవచ్చని వెసులుబాటు కల్పించింది. అంటే కొత్తగా లైసెన్స్ తీసుకునే సంస్థ లేదా వ్యక్తికి ఎంత ప్రాంతంలో విద్యుత్తు పంపిణీ అధికారం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయించకపోతే పక్క పక్కనే ఉన్న మూడు జిల్లాలు లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా లేదా అందులో కొంత ప్రాంతం కేటాయించాలి. డిస్కంల పనితీరును మెరుగుపరిచేందుకు విద్యుత్తు నియంత్రణ మండళ్ల జాతీయ వేదికకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఈ మేరకు మరో గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర విద్యుత్తు శాఖ బుధవారం జారీ చేసింది. దీని ప్రకారం మూడు నెలలకు ఒకసారి విద్యుత్తు కొనుగోలు, పంపిమీ వివరాలు, ఆధాయ వ్యయాలు, ప్రభుత్వాల నుంచి అందాల్సిన రాయితీల గణాంకాల నివేదికలను ప్రతి డిస్కం రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి ఇవ్వాలి.

 నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి..

రాష్ట్ర ప్రబుత్వం ఏ వర్గాలకైనా ఉచితంగా లేదా రాయితీపై కరెంట్ సరపలా చేస్తే ఆ మేరకు నిధులను డిస్కంలకు విడుదల చేశారా లేదా అనేది పక్కాగా టెక్కలివ్వాలి. ఈ లెక్కలను డిస్కంలు సక్రమంగా ఇస్తున్నాయా లేదా అనే వివరాలను ఈఆర్సీల వేదిక ప్రతి త్రైమాసికం తర్వాత నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలి. విద్యుత్ చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు కరెంటు ఛఆర్జీల సవరణ ఉత్తర్వులను ప్రతి ఈఆర్సీ జారీ చేయాలి. ఈ ఉత్తర్వులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా జారీ చేస్తున్నారా లేదా, డిస్కంల ఆదాయ వ్యయాల లెక్కలన్నీ ఈ ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించారా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీల నిధుల సక్రమంగా వచ్చినట్లు ఇందులో తెలిపారా అనేది ఈఆర్సీలు పక్కాగా గమనించాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం

వీడియోలు

Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
BMC Election Results 2026: బీఎంసీలో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
BMC లో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
Chanaka Korata Pump House: ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
Kalamkaval OTT: మమ్ముట్టి 'కలంకావల్' స్ట్రీమింగ్... ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసా?
మమ్ముట్టి 'కలంకావల్' స్ట్రీమింగ్... ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసా?
Radhika Apte: బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
Embed widget