అన్వేషించండి

Telangana Elections 2023: 'తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం' - సీఎం కేసీఆర్ భూదందాలకు పాల్పడ్డారని ఈటల సంచలన వ్యాఖ్యలు

Telangana Elections 2023: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ భూదందాలకు పాల్పడ్డారని, బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలకే లబ్ధి జరిగిందని ఆరోపించారు.

Telangana Elections 2023: సీఎం కేసీఆర్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో సోమవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే 'బీసీ బంధు' దక్కిందని, కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులు ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. సీఎం భూ దందాలకు పాల్పడుతున్నారని, అసైన్డ్, ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారని, రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శిస్తున్నాని, అవి రెండూ ఒక్కటైతే తాను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను గద్దె దించడం ఒక్క బీజేపీకే సాధ్యమని, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీ అధికారంలోకి రావాలని ఈటల అన్నారు.

'సీఎం కేసీఆర్ విఫలం'

ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ సంపూర్ణంగా విఫలమయ్యారని ఈటల విమర్శించారు. కేసీఆర్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటారని, వాస్తవాలు, నిజాలు తెలుసుకోవడానికి ఇష్టపడరని అన్నారు. కాళ్ల కింద భూమి కదులుతోన్న విషయాన్ని సీఎం గ్రహించడం లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

'30 వేల మంది కేసీఆర్ బాధితులు'

హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందని, ఒక్క గజ్వేల్ లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులున్నారని ఈటల ఆరోపించారు. కేసీఆర్ అడుగులకు మడుగులు వత్తే వారికే బీసీ బంధు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో  కలిసి పని చేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఉందని, ఈ 2 పార్టీలు కలిసి బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను నిలువరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని, హుజూరాబాద్ ఫలితమే గజ్వేల్ లోనూ రిపీట్ అవుతుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు ఈటల తెలిపారు.

ప్రచారంలో 40 మంది నేతలు

మరోవైపు, తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆ పార్టీ ముఖ్య నేతలు రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తదితరులు ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది.

అటు, ఈ నెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మ గౌరవ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ సభకు తెలంగాణ ముఖ్య నేతలు సహా, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం హాజరు కానున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.  

Also Read: హైదరాబాద్‌ ఓటర్లకు క్యూలైన్‌ అప్‌డేట్స్‌-ఓటింగ్‌ పెంచేందుకు కొత్త విధానం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Smita Sabharwal: వివాదంలో స్మితా సభర్వాల్ - కారు అద్దె పేరుతో రూ.61 లక్షలు తీసుకున్నారని ఆరోపణల !
వివాదంలో స్మితా సభర్వాల్ - కారు అద్దె పేరుతో రూ.61 లక్షలు తీసుకున్నారని ఆరోపణల !
Telangana Roads: HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
Warangal Crime News: మైనర్లకు గంజాయి అలవాటు చేసి వ్యభిచారం  - వరంగల్‌లో కీచకుల ముఠా అరెస్ట్ - ఎన్ని దారుణాలంటే?
మైనర్లకు గంజాయి అలవాటు చేసి వ్యభిచారం - వరంగల్‌లో కీచకుల ముఠా అరెస్ట్ - ఎన్ని దారుణాలంటే?
Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Embed widget