అన్వేషించండి

Telangana Municipal Elections: కేసీఆర్ అరెస్టుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్.. చర్యలు తీసుకునేది రాష్ట్రమా, కేంద్రమా ?

Telangana Municipal Elections 2026: కేంద్రం అరెస్ట్ చేయకుండా కేసీఆర్‌ను కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సీఎం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Telangana Political War: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అంశం మున్సిపల్ ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చేతిలో అధికారం ఉండి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బాల్ రేవంత్ రెడ్డి కోర్టులోకి నెట్టారు.

కిషన్ రెడ్డి డిమాండ్లు, ప్రశ్నలు: మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డిని ఎవరు అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి చేతగాక, తన బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై, తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఏ రోజైనా రాహుల్ గాంధీ ఆదేశించారా అని ఆయన నిలదీశారు. సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడ్డుకోవడానికి లోపాయికారీగా ఏకమయ్యాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. కిషన్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి 'ఫెవికాల్ బంధం' వ్యాఖ్యలు

ఇటీవల నిజామాబాద్ జిల్లా బర్దిపూర్‌లో నిర్వహించిన 'ప్రజా పాలన-ప్రగతి బాట' బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అని ఆయన అభివర్ణించారు. కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్టు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డిని ఉద్దేశించి కల్వకుంట్ల కిషన్ రావు అంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ, ఆ కేసులో సీబీఐ విచారణను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల ముంగిట మాటల తూటాలు

రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు వేయడం అంటే ఆ ఓటును మూసీ నదిలో వేసినట్లేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు చేసినట్లు తేలితే కనుక కేసీఆర్, కేటీఆర్‌ల అరెస్ట్ తప్పదన్నారు. అయితే కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా.. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, ఆ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేంద్రం విచారణ చేపట్టి కేసీఆర్ అవినీతిని బయటపెట్టి అరెస్ట్ చేస్తుందనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించినట్లు రేవంత్ పేర్కొన్నారు.

అటు కిషన్ రెడ్డి సైతం స్పందిస్తూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికే రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మొత్తానికి, కేసీఆర్ అరెస్టు అంశం కేంద్ర బిందువుగా మారి తెలంగాణ రాజకీయాల్లో ముక్కోణపు పోటీని రక్తికట్టిస్తోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ వ్యక్తిగత విమర్శలు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Gaddar Awards 2025 : ది బెస్ట్ డాక్యుమెంటరీ 'యూనిటి' - కొండా లక్ష్మణ్ బాపూజీ కథకు ఫిదా
ది బెస్ట్ డాక్యుమెంటరీ 'యూనిటి' - తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ కథకు ఫిదా
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget