అన్వేషించండి

Minister Indrakaran Reddy: బాసరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అమ్మవారికి ప్రత్యేక పూజలు

Minister Indrakaran Reddy: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీ సమేతంగా బాసర సరస్వతీ దేవిని దర్శించుకున్నారు. మూల నక్షత్రం పర్వదినం సదంర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

Minister Indrakaran Reddy: బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్ర పర్వదినం సందర్భంగా మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు సరస్వతీ దేవిగా నిజ రూప దర్శనమిస్తుండటంతో బాసరలో భక్తుల తాకిడి పెరుగుతోంది. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారిని దర్శించుకుని, చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, గోదావరి తీరం భక్తులతో కిక్కిరిసిపోయింది. రద్దీకి సరిపడా వసతులు లేకపోవడంతో భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. 

దేవస్థానం వసతి గృహాలు, కాటేజీలతో పాటు ప్రైవేటు సత్రాలు కూడా నిండి పోయాయి. తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సరస్వతీ, లక్ష్మీ, మహంకాళి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఎర్పాట్లను ఆలయ కమిటీ నిర్వహించినప్పటికీ.. మూల నక్షత్ర పర్వదినం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. దీంతో బాసర భక్తులతో రద్దీగా మారింది. 

నిన్న జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి..

తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి . మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం రోజు జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆశీస్సులు, ప్రసాదాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. దసరా నవరాత్రుల సందర్భంగా మహా శక్తి పీఠాలలో 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు . కృష్ణా పుష్కరాలను సొంత రాష్ట్రంలోని జోగులాంబ సన్నిధిలో ఘనంగా నిర్వహించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడే పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు.

మొన్న బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న మంత్రి..

దసరా శరన్నవరాత్రి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారిని రాష్ట్ర దేవయ్య మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. అంతకు ముందు మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నవరాత్రుల ఐదవ రోజు సందర్భంగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించారు. అదే రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతుకు ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని గణేష్ ఆలయాన్ని సందర్శించి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.