అన్వేషించండి

Highcourt On G.Os : జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం !

జీవోలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 24 గంటల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి వచ్చిన ఇబ్బందేమిటని తెలంగాణ ప్రభుత్వాన్ని  హైకోర్టు ప్రశ్నించింది. 24 గంటల్లోగా ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ఈ నెల నాలుగో తేదీన దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా గ్రామంలో ఉన్న 76  కుటుంబాలకు పథకం వర్తిస్తుందని ప్రకటించారు.  తర్వాతి రోజు అంటే ఆగస్టు 5వ తేదీన నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయకుండానే ప్రజాధనం చెల్లిస్తున్నారని వాచ్‌ వాయిస్‌ ఆఫ్ పీపుల్ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణలో పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దళిత బంధు పథకానికి అవసరమైన నిబంధనలు ఖరారు చేశామని రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికీ అమలు చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిబంధనలు ఖరారు చేసిన విషయానని పిటిషన్‌లో ఎందురు పేర్కొనలేదని పిటిషనర్ అయిన వాచ్‌ వాయిస్‌ ఆఫ్ పీపుల్ సంస్థ లాయర్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. నిబంధనలు ఖరారు చేసినట్లుగా ఎలాంటి ఆదేశాలు అధికారికంగా ఇవ్వలేదని... జీవోలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏమిటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఇరవై నాలుగు గంటల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారని ఆదేశించింది.  తెలంగాణ అడ్వకేట్ జనరల్ వివరణను నమోదు చేసుకుని పిటిషన్‌పై విచారణ ముగించింది. తెలంగాణ సర్కార్ మరో రోజులో దళిత బంధుకు సంబంధించిన విధి విధానాల జీవోను వెబ్‌సైట్‌లో పెట్టే అవకాశం ఉంది. 

తెలంగాణ ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీ చేస్తోందని గతంలో కూడా పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. చాలా రోజుల పాటు ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోల్లో దాదాపుగా 40శాతం దాచి పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఏపీలోనూ చర్చనీయాంశం అయ్యే అవకాసం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం రెండు రోజుల కింట అసలు ఏ ఒక్క జీవోనూ ప్రజలకు అందుబాటులో ఉంచకూడదని నిర్ణయం తీసుకుంది. జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టడం నిలిపివేసింది. జీవోల కోసం రిజిస్టర్లను నిర్వహించాలని అన్ని శాఖలకూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగానే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు అక్కడ కూడా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
Embed widget