అన్వేషించండి

Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు

Caste Census survey In Telangana | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో కమ్మరి, కంసాలి, వడ్ల, కంచరి, శిల్పిలను విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Telangana High court gives over Vishwa Brahmin or Vishwakarma in Caste Census survey | హైదరాబాద్: విశ్వబ్రాహ్మణులకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వేలో తమ కుల ప్రస్తావన లేదని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు శనివారం విచారణ చేపట్టింది. కంచరి, కమ్మరి, కంసాలి, వడ్ల, శిల్పిలను విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 

ఆ ఐదు కుల వృత్తుల వారి కులంపై హైకోర్టు తీర్పు

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో విశ్వబ్రాహ్మణ కులం కాకుండా వృత్తి పరంగా వేర్వేరు కులాలను చేర్చి సర్వే చేస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టు శనివారం స్పష్టత నిచ్చింది.  బీసీ కులాల (BC Caste)ను వర్గీకరించిన జీ.ఓ.లో పేర్కొన్న వృత్తులైన కమ్మరి, కంసాలి, వడ్ల, కంచరి, శిల్పిలను విశ్వబ్రాహ్మణ కులంగా ఉన్నాయని కోర్టు స్పష్టత ఇచ్చింది. సమగ్ర కుటుంబ సర్వేలోని ఫారాలలో వీరిని వృత్తుల ప్రకారం వేరే కులాలుగా నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలలో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, విశ్వ బ్రాహ్మణ సంఘాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, బీసీ కమీషన్ కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి పలు విజ్ఞప్తులు అందచేశాయి. అయినా ఫారాలలో సరి చేయకుండా సమగ్ర కుటుంబ సర్వే కొనసాగించడాన్ని విశ్వ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోషియేషన్ కు చెందిన సీనియర్ అడ్వకేట్ పెందోట శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్లారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వృత్తి పరంగా కాకుండా కమ్మరి,  కంసాలి, వడ్ల, కంచరి, శిల్పిలను విశ్వ బ్రాహ్మణులుగా ఒకే కోడ్ గా పరిగణించాలని కోరారు. హైకోర్ట్ ( 11 కోర్టు ) జస్టిస్ సూరేపల్లి నందా పరిగణనలోకి తీసుకొని, ఆ వృత్తుల వారిని వేరే కులాలుగా కాకుండా విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలని శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విశ్వబ్రాహ్మణ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే 20 జిల్లాల్లో పూర్తయిందని ఇటీవల తెలిపింది. మిగిలిన జిల్లాల్లో సైతం 93 శాతం మేర సమగ్ర కుల గణన సర్వే ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. అన్ని కులాలు, సామాజిక వర్గాల వారికి విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు సర్వే చేపట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సందర్భాలలో తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా కుల గణన సర్వే పూర్తి చేస్తుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులపాటు ఒంటి పూట బడులు పెట్టి.. టీచర్లతో సమగ్ర సర్వే చేపించారు. మధ్యాహ్నం వరకు స్కూళ్లలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు, మధ్యాహ్నం భోజనం అనంతరం ఇంటింటికి వెళ్లి ఫారాలలోని ప్రశ్నలు అడిగి సర్వే చేశారు.

Also Read: Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget