అన్వేషించండి

Telangana News: సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలు అందేలా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Congress Govt in Telangana: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదురైన పరిస్థితి రాకుండా ఉండేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్: గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి తమ ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలు అందలేదని ఫలితంగా పేదలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదురైన పరిస్థితి రాకుండా ఉండేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ధరణిని తీసుకొచ్చి భూములు కొల్లగొట్టిన బీఆర్ఎస్!
భూముల డిజిటలైజేషన్‌ పేరుతో ధరణిని తీసుకొచ్చి పేదలు, ప్రభుత్వ భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ధరణిపై ఒక కమిటీని నియమించామని, ఆ కమిటీ తమ నివేదికను త్వరలో అందిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పుడు ఆ దిశగా మరో అడుగు ముందుకు వేశాము. గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి గ్రామ రెవెన్యూ సహాయకులను నియమించాలన్న ఆలోచన చేస్తున్నామని ఇందుకు సంబంధించి ఒక కమిటీని నియమించామని తెలిపారు. ఈ కమిటీలో ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, రెవెన్యూ, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ఫైనాన్స్‌, సెక్రటరీ, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సర్వీసెస్‌), డిస్టిక్‌ కలెక్టర్‌, రంగారెడ్డి, సెక్రటరీ, సీసీఎల్‌ఎ, నెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారని ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశామని తెలిపారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా తమ నివేదికను అందిస్తుందన్నారు. 
ధరణి పేరుతో తమ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. రెవెన్యూ సేవలను ప్రజలకు ఉపయోగపడేలా సంస్కరణలను తీసుకొస్తున్నామని.. సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలను అందించడానికి తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు.

వీఆర్ఏల అంశంపై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీ..
వీఆర్ఏలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ఆయన నియమించిన అధికారి, జీఏడీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా.. సీసీఎన్ఏ కార్యదర్శి కమిటీ కన్వీనర్ గా ఉంటారు. వీఆర్ఎల అంశంపై వీలైనంత త్వరగా సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వీఆర్ఎ వ్యవస్థ పునరుద్ధరణ, ఇతర విభాగాల్లో సర్వీసుల పునరుద్ధరణ, చట్ట పరిమితి, న్యాయ వివాదాలు తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget