అన్వేషించండి

Telangana News: తడిసిన ధాన్యాన్ని వేలంలో అమ్మేందుకు రంగం సిద్ధం - క్వింటారు రూ.2,300

Telangana News: తడిసిన ధాన్యాన్ని వేలం వేసేందుకు తెలంగాణ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. క్వింటాకు రూ.2,250 నుంచి రూ.2,300 వరకు ధర నిర్ణయించినట్లు సమాచారం. 

Telangana News: తడిసిన ధాన్యాన్ని వేలంలో అమ్మేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఏక మొత్తంలో కాకుండా విడతల వారీగా విక్రయించేలా అధికారుల కమిటీ ప్రణాళికలు రచిస్తోంది. తొలి విడతగా 15 నుంచి 20 లక్షల టన్నుకలకు బహిరంగ వేలం వేసేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. కోటి టన్నుల తడిసిన ధాన్యాన్ని విక్రయించబోతున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు. వేలంలో క్వింటాకు రూ.2,250 నుంచి రూ.2,300 వరకు ధర నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి సంవత్సరం, సంవత్సరానికి గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రైల్ మిల్లుల సామర్థ్యం అంతలా పెరగలేదు. దీని వల్ల తెలంగాణ ఉత్పత్తి అయ్యే ధాన్యానికి సీఎంఆర్కు మధ్య అంతరం, నిల్వ చేసేందుకు స్థలాభావంతో సమస్యలు వచ్చాయి. గతేడాది వానాకాలం, యాసంగి పంట కలిపి.. కోటి టన్నులకు పైగా ధాన్యాన్ని మిల్లింగ్ చేయాల్సి ఉంది. ఇందుకు సెప్టెంబర్ నెలాఖరు వరకే గడువు ఉంది. 

వర్షాకాలం మిల్లంగే ఇప్పటికీ పూర్తి కాలేదట

వర్షాకాలం పంట మిల్లింగే ఇప్పటికీ పూర్తి కాలేదని.. ప్రస్తుతం యాసంగిలో తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలంటూ తమపై ఒత్తిడి తీసుకు వచ్చారని పౌర సరఫరాల సంస్థకు రైస్ మిల్లర్ల సంఘం ఇప్పటికే తెలిపింది. అయితే తాము ఈ పంటకు కస్టోడియన్ గా మాత్రమే ఉంటామని వివరించారు. వచ్చే అక్టోబరులో వర్షా కాలం పంట దిగుబడి మరో కోటి టన్నులకు పైగా రాబోతుందని చెప్పారు. ఈక్రమంలోనే నిల్వ పంటను వేలం వేసేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని సమాచారం. ఇందులో యాసంగిలో వచ్చిన 66.02 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యాసంగి ధాన్యం మిల్లింగ్ లో నూక శాతం ఎక్కువగా ఉంటుందని... అకాల వర్షాలకు పంట పలుమార్లు తడిసిందని పౌర సరఫరాల సంస్థ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ పంటనే ముందుగా వేలం వేస్తామని వివరించారు. 

మిల్లర్లు మాత్రమే కాదు ఎవరైనా వేలంలో పాల్గొనవచ్చు!

ఈ తడిసిన ధాన్యం వేలంలో కేవలం మిల్లర్లు మాత్రమే కాకుండా ఎవరైనా పాల్గొనేలా గ్లోబల్ టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు గ్రేడ్ ఏ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040, చెల్లించి రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. అలాగే ఐకేపీ కేంద్రాలకు ఇచ్చిన కమీషన్ రైస్ మిల్లులకు చేర్చేందుకు రవాణా ఛార్జీలు, ధాన్యం కొనుగోలుకు బ్యాంకు నుంచి తీసుకున్న రుణంపై వడ్డీ, ఇతర ఖర్చుల్ని కూడా  పౌరసరఫరాల సంస్థ అధికారులు తాజాగా లెక్కలు వేశారు. మొత్తంగా క్వింటారు రూ.2,250 నుంచి రూ.2,300 వరకు ఱర్చు అయినట్లు తేల్చారు. బహిరంగ వేలంలో ఈ మొత్తాన్నే కనీస ధరగా నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లు ఐఏఎస్ అధికారుల కమిటీలోని ఓ అధికారి వెల్లడించారు. వేలం ధర తగ్గించి నష్టానికి అమ్మలేమని స్పష్టం చేశారు. చేసిన ఖర్చును రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.  

ప్రతి క్వింటాకు 10 కిలోల తరుగు ఇవ్వాలంటున్న మిల్లర్లు

యాసంగిలో అధికంగా వచ్చే నూకలకు క్వింటారు రూ.200, నుంచి రూ.300 వరకు నష్ట పరిహారం ఇవ్వాలని మిల్లర్లు అడుగుతున్నారని, వేలంతో అంశం ఉత్పన్నం కాదని చెప్పారు. మిల్లర్లు మాత్రం యాసంగి ధాన్యంలో నూకలు ఎక్కువ వస్తాయని, వానలకు పంట తడిసిందని.. వేలంలో ప్రతి క్వింటారు 10 కిలోల తరుగు ఇవ్వాలని పౌర సరఫరాల సంస్థను కోరారు. అయితే ధాన్యం వేలం వేసే విషయాన్ని పౌర సరపరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ భారత ఆహార సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. సీఎంఆర్ లో జాప్యం, నిల్వకు స్థలం లేకపోవడం, త్వరలో వానాకాలం పంట రానుండడం ఎఫ్సీఐ ప్రమాణాల మేరకు మిల్లర్లు బియ్యాన్ని ఇచ్చే పరిస్థితులు లేకపోవడాన్ని వివరించినట్లు తెలిసింది. దీంతో వేలానికి ఎఫ్సీఐ ఆమోదం తెలిపినట్లు సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
Harish Rao Milchy Milk Controversy: హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?
హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Embed widget