అన్వేషించండి

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో రైతు భరోసా డబ్బు కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం నుంచి కీలక వచ్చే అవకాశం ఉంది.

Telangana Rythu Bharosa Funds: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం.. ఆ పార్టీ ప్రకటించిన ఆరు  గ్యారంటీలు. వీటిలో అతిముఖ్యమైంది రైతు భరోసా పథకం. ఈ పథకం ద్వారా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 15వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పింది కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రైతుభరోసా (Rythu Bharosa) పథకం ఎప్పుడు అమలు చేస్తారని రైతులు  ఎదురుచూస్తున్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తారని బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

తెలంగాణలో దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలకు రైతుబంధు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు సరికదా... అప్పులు చేసే పరిస్థితీ లేదు.  బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా అప్పులు చేసిందని... కనుక కొత్తగా అప్పు చెయ్యడానికి అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకపోవడం...  కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు ఎలా సమకూరుస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.  అయితే త్వరలోనే రైతుబంధు అమలు చేస్తామని మంత్రులు చెప్తున్నారు. అయితే.. ఈ పథకంలో కొన్ని మార్పులు చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎన్ని ఎకరాలు భూమి ఉన్నా... ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున సాయం అందించింది. రెండు విడతల్లో 5వేల రూపాయల చొప్పున  చెల్లించింది. అంటే ఎకరం భూమి ఉన్నవారికి ఏడాదికి రూ.10 వేలు వస్తే.... 10 ఎకరాలు ఉన్నవారికి రూ.లక్ష రూపాయలు అందేవి. దీంతో రైతుబంధు భూస్వాములకు  ఇవ్వొద్దని విమర్శలు వచ్చాయి. కానీ కేసీఆర్‌ సర్కార్‌ వాటిని పట్టించుకోలేదు.. అందరికీ రైతు బంధు డబ్బు జమ చేస్తూ పోయింది. ఈ విధానాన్ని ఎన్నికల ముందే  తప్పుబట్టింది కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక... రైతుబంధు పథకంలో మార్పులు చేయొచ్చని భావిస్తున్నారు.

ఇక.. నిధుల కొరతతో.. ఆర్థికపరమైన ఇబ్బందులు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు గ్యారెంటీలను అయితే ప్రకటించారు... కానీ.. వాటిని అమలు చేసేందుకు సరిపడా డబ్బు ప్రభుత్వ ఖజానాలో లేదని సమాచారం. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు  చేయాలంటే... ఏడాదికి 60వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. వీటిలో రైతు భరోసా ఒక దఫా నిధులు ఇచ్చేందుకే 11వేల కోట్లు  కావాలని అంటున్నారు. కానీ ఖజానాలో కనీసం 5వేల కోట్లు కూడా లేవని వార్తలు వస్తున్నాయి. దీంతో రైతుభరోసా నిధులు ఎక్కడి నుంచి తేవాలన్న ఆలోచనలో పడిందట  రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. నిధులు సేకరించి... రైతుల అకౌంట్లలో జమ చేసేసరికి జనవరి లేదా ఫిబ్రవరి కావొచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పరిస్థితిని  ఎలా ఎదుర్కొంటుంది... ప్రతిపక్షాలు సంధించే ప్రశ్రలకు ఎలా సమాధానాలు చెప్తుందో చూడాలి. మరోవైపు.. రైతుబంధు నిధులకు సంబంధించి ఇవాళ ప్రకటన వచ్చే ఛాన్స్‌  ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం ఏం ప్రకటన చేస్తుంది... రైతబంధు నిధులు ఎప్పుడు పడతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget