అన్వేషించండి

Rythu Bandhu: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్... రేపట్నుంచి ఖాతాల్లో రైతు బంధు నగదు జమ

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగి రైతు బంధు నగదును రేపట్నుంచి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపట్నుంచి యాసంగికి సంబంధించి రైతుబంధు నిధులు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలో జమచేశామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమచేసినట్లు అవుతుందన్నారు. డిసెంబర్ 10 నాటికి ధరణి పోర్టల్ నమోదు చేసుకున్న పట్టాదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అర్హులని తెలిపారు. ఈ సీజన్ లో 66.61 లక్షల మంది రైతులకు 152.91 లక్షల ఎకరాలకు రూ.7645.66  కోట్లు జమచేయనున్నామని మంత్రి తెలిపారు. దీనిలో 94 వేల మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులని పేర్కొన్నారు. ఎకరా నుంచి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా ఆరోహణ క్రమంలో నిధులు జమచేస్తామన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలో అత్యుత్తమ 20 పథకాలలో ఒకటిగా... 2018 నవంబరులో రోమ్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్ఏవో గుర్తించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 

Also Read: ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి హరీశ్ రావు అభినందనలు 

వారం పదిరోజుల్లో అందరీ ఖాతాల్లో నగదు

రైతులకు ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున సాయం చేసే రైతు బంధు పథకాన్ని డిసెంబర్ 28 నుంచి ప్రారంభించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి  రైతు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేస్తారు.  ప్రారంభించిన  వారం పదిరోజుల్లో గతం లో మాదిరి వరుస క్రమంలో అందరి ఖాతాల్లో జమ అవుతాయని  సీఎం కేసీఆర్ ప్రకటించారు. పథకాల అమలుపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం సమీక్షించారు. రైతు బంధు పథకం కోసం రైతులు ఎదురు చూస్తున్నందున వారికి వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. 

Also Read: ఫస్ట్ కేరళ... తర్వాత తమిళనాడు, తెలంగాణ- ! 2019-20 హెల్త్ ఇండెక్స్ ర్యాంకులు ప్రకటించిన నీతిఆయోగ్ !

ప్రతీ రైతుకూ సాయం

రైతన్నకు ఆసరాగా నిలిచే రైతు బంధు చెల్లింపులు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 61 లక్షల 49 వేల మంది రైతులకు యాసంగి పంట సీజన్‌ కు సంబంధించి ఎకరాకు 5 వేల చొప్పున మొత్తం రూ.7,600 కోట్లు నేరుగా ఖాతాల్లో జమచేయనున్నారు. కోటి 52 లక్షల ఎకరాలకు డబ్బులు జమచేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రతి గుంట భూమికీ సాయమందాలని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా భూములను కొన్న రైతులు ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ ఖాతా వివరాలను రైతుబంధు పోర్టల్‌లో ఏఈవోలు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత జూన్‌ నుంచి ఈ నెల 10 వరకూ కొత్తగా 20 వేల మంది భూములు కొన్నట్లు రెవిన్యూ రికార్డుల్లో తేలాయి. ఏఈవోలు ఈ వివరాలు నమోదు చేస్తేనే రైతుబంధు నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అధికారులు వెల్లడించారు. సాగు చేసే రైతన్నకు సాయంగా నిలబడాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. 

Also Read: వరంగల్ లో మరోసారి ఒమిక్రాన్ కలకలం... స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: కాళేశ్వరంపై అసెంబ్లీ జాయింట్ సెషన్‌కు సీఎం రేవంత్ సవాల్ - డేట్,టైం చాయిస్‌ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కే !
కాళేశ్వరంపై అసెంబ్లీ జాయింట్ సెషన్‌కు సీఎం రేవంత్ సవాల్ - డేట్,టైం చాయిస్‌ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కే !
Konda Surekha Letter CM Revanth : దేవాదాయశాఖలో కడియం శ్రీహరి జోక్యం - కొండా సురేఖ ఆగ్రహం - సీఎంకు ఘాటు లేఖ
దేవాదాయశాఖలో కడియం శ్రీహరి జోక్యం - కొండా సురేఖ ఆగ్రహం - సీఎంకు ఘాటు లేఖ
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget