అన్వేషించండి

Telangana Election 2023: 50 కేంద్రాల్లో కౌంటింగ్‌-ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 50 కేంద్రాల్లో కౌంటింగ్‌ జరగనుంది. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణలో ఈనెల 30న ఎన్నికల పోలింగ్‌, వచ్చే నెల 3న కౌంటింగ్‌ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో కౌంటింగ్‌  కేంద్రాలను గుర్తిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. 119 నియోజకవర్గాలకు సంబంధించి 50 ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి... ఆ జాబితాను సెంట్రల్ ఎలక్షన్  కమిషన్‌కు పంపారు. ఆ జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. దీంతో 50 కేంద్రాల్లో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే పోలింగ్  తర్వాతే ఒక్కో నియోజవర్గానికి ఎన్ని టేబుల్స్ వేయాలనే విషయాన్ని నిర్ణయించనున్నారు. లెక్కింపు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్వరలోనే పరిశీలకులను కూడా  నియమించనున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు.

కౌంటింగ్‌ సమయంలో... ఏ రౌండ్‌లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది పరిశీలకుడు పర్మిషన్‌ ఇచ్చిన తర్వాతే ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో పరిశీలకుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. అంతేకాదు.. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ దగ్గర మైక్రో అబ్జర్వర్‌ను కూడా నియమించబోతున్నారు. పోలింగ్‌ తర్వాత ఒక్కో నియోజకవర్గానికి ఎన్నో టేబుళ్లు వేయాలన్నది నిర్ణయిస్తారు. ఆ తర్వాత... మైక్రో అబ్జర్వర్లు ఎంత కావాలన్నది తేలుతుంది. దాన్ని బట్టి మైక్రో అబ్జర్వర్ల నియామకం జరుగుతుంది. 

ఇక.. ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే... అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత ర్యాండమ్‌గా ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్లలోని ఓట్లను లెక్కిస్తారు. ఆ ఐదు పోలింగ్‌ కేంద్రాల్లోని  ఓట్లు, వీవీప్యాట్లలోని ఓట్లు సరిగ్గా ఉంటే... ఫలితాన్ని ప్రకటించేందుకు పరిశీలకుడు అనుమతి ఇస్తారు. రౌండ్‌ల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలను ఆయా కేంద్రాల బయట  ఉన్న వారికి వెల్లడించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 

కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భద్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్ర దగ్గర మూడు అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. తొలి అంచెలో సాయుధ  కేంద్ర బలగాలు, ఆ తర్వాత రెండు దశల్లో రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని వినియోగించబోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప... భద్రతా బలగాలను కౌంటింగ్‌ కేంద్రాల లోపలికి అనుమతించరు. పోలింగ్‌ అయిపోయిన వెంటనే.. ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్స్‌కు తరలించేందుకు రూట్‌ మ్యాప్స్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. స్ట్రాంగ్‌ రూమ్స్‌ దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. సాయుధ బలగాలు, సీసీటీవీ కెమెరాల నిఘా ఉండనుంది.   

మరోవైపు... రాష్ట్రానికి 166 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. 39 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పోలీసు పరిశీలకులుగా, 67 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను సాధారణ పరిశీలకులుగా, 60 మంది సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పరిశీలకులు వాటికి కేటాయియించిన ప్రాంతాలకు చేరుకుంటారు. 

ఇక తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ వరకు గడువు ఉంది. దీంతో నామినేషన్ల దాఖలుకు మంచి ముహూర్తాలు వెతుకుంటున్నారు అభ్యర్థులు.

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget