అన్వేషించండి

Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ

Telangana CM Revanth Reddy | సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమవుతాయి.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే 45 రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

గత కొంతకాలంగా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఆర్థిక ఇబ్బందులు లేకుండా రైతులు తమ పంటలను సాగు చేసుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. మొత్తం 775 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

3,600 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ‘సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది. ఇప్పుడు రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం చుట్టాం. తొలి విడతగా 70 లక్షల మంది రైతులకు రూ.3600 కోట్లు ప్రయోజనం చేకూరనుంది. రేపటిలోగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయి. మిగిలిన 5400 కోట్ల రూపాయల్లో 20 రోజుల్లో 2700 కోట్లు, ఇంకో 20 రోజుల్లో 2700 కోట్లు రైతుల ఖాతాలో ఎకరానికి రూ.6000 చొప్పున మొత్తం 9000 కోట్లు రైతు భరోసా నగదు జమ చేస్తాం. మొత్తం 45 రోజుల్లోగా ప్రక్రియ పూర్తవుతుందని’ అన్నారు.

తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి (DBT) చేరుస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రూ. 9,000 కోట్ల విడుదల ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మేలు చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న లోపాలను సవరించి, అర్హులైన ప్రతి రైతుకు ఈ సాయం అందేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధుల జమ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

‘బీఆర్ఎస్ హయాంలో 114 నెలలు సీఎం కేసీఆర్ రైతులకు సరాసరి ఖర్చు 2533 కోట్లు. నేడు మన ప్రభుత్వం 28 నెలలైతే ప్రతినెల సరాసరి రూ.5500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్, సన్నవడ్లకు బోనస్, రుణమాఫీ, రైతు భీమా, రైతు భరోసా లాంటి వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుకు వేయకుండా ఖర్చు చేస్తున్నాం. ఇప్పటివరకూ రైతులకు లక్షా 30 వేల కోట్లకు పైగా రైతు సంక్షేమం కోసం ఖర్చుపెట్టాం.

వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది 2.58 కోట్ల మెట్రిక్ టన్నులతో నెంబర్ వన్‌గా నిలిచాం. మెదక్, నిజామాబాద్ రైతులకు ఓ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో నిజాం ఫ్యాక్టరీ నడిచింది. పసుపు, మొక్కజొన్నలు, చెరుకు లాంటివి గతంలో బాగా పండించారు. ఇప్పుడు పామాయిల్ పంట 3 లక్షల ఎకరాలకు చేరింది. 10 లక్షల ఎకరాలకు పండించినా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

పంట మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది..

ఖమ్మం, వరంగల్ జిల్లాలో పత్తి, మిర్చి బాగా పండుతుంది. నల్గొండలో వడ్లతో పాటు కొన్ని రకాల కందులు పండుతాయి. మహబూబ్ నగర్‌లో పచ్చ జొన్నలు, సజ్జలు, కందులు, దోసకాయ పంటలు వస్తాయి. రంగారెడ్డిలో భారతదేశానికే కందిపప్పు పండిస్తున్నారు. పాలకూర, కొతిమిర, మెంతి కూర, ద్రాక్ష తోటలు ఉండేవి. ఆర్టీసీలో పాలక్యాన్లు, కూరగాయలు, ఆకుకూరలతో వచ్చేవారు. పండ్ల తోటలు రియల్ ఎస్టేట్ లే అవుట్లు అయ్యాయి. పాలు, కోడిగుడ్లు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటన్నాం. రైతులలో పంట మార్పిడి గురించి అవగాహనా పెంచాలని తుమ్మల నాగేశ్వరరావుకు సూచిస్తున్నాం. కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నుల వరకే కొంటామని చెప్పింది. కానీ ఈ ఏడాది మనం ఇప్పటికే 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రాష్ట్రం కొనుగోలు చేసింది.  ఎగుమతి చేయాలన్నా గిట్టుబాటు ధర లేదు. కనుక రైతులు పంట మార్పిడి చేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. - రేవంత్ రెడ్డి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget