అన్వేషించండి

Enquiry on Kaleshwaram Project: ఎమ్మెల్సీ కవిత సూచనతో కాళేశ్వరంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

Kaleshwaram Lift Irrigation Project: తెలంగాణలో లక్ష కోట్లతో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Revanth Reddy About Kaleshwaram Project:  హైదరాబాద్: తెలంగాణలో లక్ష కోట్లతో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు సిట్టింగ్ జడ్జితో విచారణతో జరిపించి, ఇందుకు బాధ్యులు అందరిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 
శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా ప్రాజెక్టు కనిపిస్తుందన్నారు. ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ భూమిపై ఎక్కడ ఉందో అర్థం కావడం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గతంలో కాంగ్రెస్ నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులు కట్టాము. దశాబ్దాలుగా అన్ని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని మా పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఆ ప్రాజెక్టులు నిలిచాయన్నారు.

కట్టిన మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయిందన్నారు. సభా సమావేశాలు పూర్తయ్యాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బస్సులలో కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు తీసుకెళ్తామన్నారు. ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది, దాని వైఫల్యాలు, తరువాత చేయాల్సిన దానిపై సభ్యుల అభిప్రాయాలను తీసుకుంటామని రేవంత్ చెబుతుండగా.. విచారణ చేయించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచనను స్వాగతిస్తూ.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామన్నారు. 

Enquiry on Kaleshwaram Project: ఎమ్మెల్సీ కవిత సూచనతో కాళేశ్వరంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత అసహనం..
సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారంలో ఘోరం జరిగిందని చెప్పడం సబబు కాదన్నారు. వారు ప్రభుత్వంలో ఉన్నారు. టెక్నికల్ టీమ్ ను తీసుకెళ్లి ప్రాజెక్టు మీద విచారణ చేపట్టేందుకు తమకు ఏ అభ్యంతరం లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్దకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లి చూపించేందుకు అది టూరిస్ట్ స్పాట్ కాదన్నారు. బీఆర్ఎస్ చేసిన ప్రగతిని చూపెట్టేందుకు కచ్చితంగా తీసుకెళ్లాం. ఈరోజు తప్పు జరిగింది అంటే. నిపుణులతో పర్యవేక్షణ చేయించి పూర్తి నివేదికలు తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు. సభలో అన్ని పార్టీల సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. కానీ ప్రజా ప్రయోజనకరమైన ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, వైఫల్యాలపై మాత్రం కచ్చితంగా విచారణ జరగాలన్నారు. 

నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం.. 
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేవనెత్తిన అంశం. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి గత ప్రభుత్వం అమలు చేయలేదు. తన పాదయాత్ర సమయంలోనూ ఈ సమస్య దృష్టికి వచ్చిందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అధికారులు, మంత్రులతో కమిటీలు ఏర్పాటు చేసి వచ్చిన నివేదిక ఆధారంగా చక్కెర ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరిస్తామని శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంఐఎం సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం అన్నారు. కొందరు మిమ్మల్ని కౌగిలించుకుని నకిలీ చెక్కులు అందించి మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండాలన్నారు. మైనారిటీ శాఖకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు ఓ అధికారిని నియమిస్తామని చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
IPL 2024: రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB Won Against CSK Entered into Playoffs | చెన్నైని కొట్టి ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ | ABP DesamVizag Police About Sensational Attack | వైజాగ్‌లో కుటుంబంపై జరిగిన దాడి గురించి స్పందించిన పోలీసులు | ABP DesamPavitra Bandham Chandu Wife Sirisha Comments | సీరియల్ నటుడు చందు మృతిపై భార్య శిరీష సంచలన నిజాలు | ABP DesamWhat if RCB Vs CSK Match Cancelled | ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
IPL 2024: రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Rains: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Embed widget