అన్వేషించండి

Enquiry on Kaleshwaram Project: ఎమ్మెల్సీ కవిత సూచనతో కాళేశ్వరంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

Kaleshwaram Lift Irrigation Project: తెలంగాణలో లక్ష కోట్లతో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Revanth Reddy About Kaleshwaram Project:  హైదరాబాద్: తెలంగాణలో లక్ష కోట్లతో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు సిట్టింగ్ జడ్జితో విచారణతో జరిపించి, ఇందుకు బాధ్యులు అందరిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 
శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా ప్రాజెక్టు కనిపిస్తుందన్నారు. ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ భూమిపై ఎక్కడ ఉందో అర్థం కావడం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గతంలో కాంగ్రెస్ నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులు కట్టాము. దశాబ్దాలుగా అన్ని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని మా పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఆ ప్రాజెక్టులు నిలిచాయన్నారు.

కట్టిన మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయిందన్నారు. సభా సమావేశాలు పూర్తయ్యాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బస్సులలో కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు తీసుకెళ్తామన్నారు. ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది, దాని వైఫల్యాలు, తరువాత చేయాల్సిన దానిపై సభ్యుల అభిప్రాయాలను తీసుకుంటామని రేవంత్ చెబుతుండగా.. విచారణ చేయించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచనను స్వాగతిస్తూ.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామన్నారు. 

Enquiry on Kaleshwaram Project: ఎమ్మెల్సీ కవిత సూచనతో కాళేశ్వరంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత అసహనం..
సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారంలో ఘోరం జరిగిందని చెప్పడం సబబు కాదన్నారు. వారు ప్రభుత్వంలో ఉన్నారు. టెక్నికల్ టీమ్ ను తీసుకెళ్లి ప్రాజెక్టు మీద విచారణ చేపట్టేందుకు తమకు ఏ అభ్యంతరం లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్దకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లి చూపించేందుకు అది టూరిస్ట్ స్పాట్ కాదన్నారు. బీఆర్ఎస్ చేసిన ప్రగతిని చూపెట్టేందుకు కచ్చితంగా తీసుకెళ్లాం. ఈరోజు తప్పు జరిగింది అంటే. నిపుణులతో పర్యవేక్షణ చేయించి పూర్తి నివేదికలు తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు. సభలో అన్ని పార్టీల సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. కానీ ప్రజా ప్రయోజనకరమైన ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, వైఫల్యాలపై మాత్రం కచ్చితంగా విచారణ జరగాలన్నారు. 

నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం.. 
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేవనెత్తిన అంశం. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి గత ప్రభుత్వం అమలు చేయలేదు. తన పాదయాత్ర సమయంలోనూ ఈ సమస్య దృష్టికి వచ్చిందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అధికారులు, మంత్రులతో కమిటీలు ఏర్పాటు చేసి వచ్చిన నివేదిక ఆధారంగా చక్కెర ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరిస్తామని శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంఐఎం సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం అన్నారు. కొందరు మిమ్మల్ని కౌగిలించుకుని నకిలీ చెక్కులు అందించి మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండాలన్నారు. మైనారిటీ శాఖకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు ఓ అధికారిని నియమిస్తామని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

వీడియోలు

Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
Embed widget