అన్వేషించండి

Bandi Sanjay On BRS Govt : ధరణి పోర్టల్ ప్రజల పాలిట గుదిబండ, అర్ధరాత్రి ఓపెన్ చేసి భూములు కొట్టేస్తున్నారు- బండి సంజయ్

Bandi Sanjay On BRS Govt : రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ధరణి, రుణమాఫీ సమస్యలు వినిపిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. ధరణి పోర్టల్ రాత్రి 1 గంటకు మాత్రమే తెరుచుకుంటుందన్నారు.

Bandi Sanjay On BRS Govt : రాష్ట్ర ప్రజలకు ధరణి పోర్టల్ గుదిబండలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు కొందరు అధికారుల అండదండతో అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను ఓపెన్ చేయించుకుని ప్రభుత్వ, పేదల భూములను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి వచ్చిన బండి సంజయ్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావుతో కలిసి ఇటీవల మాతృ వియోగంతో బాధపడుతున్న పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు గౌతమ్ రావును పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందుకు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలను నిరసిస్తూ సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేయబోతున్నట్లు తెలిపారు. నేను ఏ జిల్లాకు వెళ్లినా పేదలు ఇండ్లు అడుగుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేసినా కేసీఆర్ సర్కార్ మాత్రం ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం లేఖ  రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. 

గృహ ప్రవేశానికి ముందే కూలిపోయే ప్రమాదంలో  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు 

 "సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డుబల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మంది లబ్దిదారులకు ఇళ్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లు మంజూరు చేసింది? అనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడా కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల గృహ ప్రవేశం చేయకముందే కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఎక్కడ చూసినా పగుళ్లు కన్పిస్తున్నాయి. పేదలకు ఒక్క ఇల్లు ఇయ్యని కేసీఆర్ తాను మాత్రం 100 రూములతో ప్రగతి భవన్ కట్టుకున్నారు. రుణమాఫీ అమలు కాక రైతులు అల్లాడుతున్నారు. రైతుల ఉసురు పోసుకుంటున్నారు.  సూర్యపేట జిల్లాలో ఐకేపీ సెంటర్లలో పెద్ద కుంభ కోణం జరుగుతున్నా చర్యల్లేవు. రూ.20 కోట్ల కుంభ కోణం బయటపడింది.  పండించిన ప్రతి గింజ మేమే కొంటామని చెప్పిన కేసీఆర్ ఫ్రభుత్వం ... మాట తప్పింది. పండించిన ప్రతి గింజకు పైసలిస్తోంది కేంద్రమే.  జిల్లాలో అతిపెద్ద సమస్య ధరణి. అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను ఓపెన్ చేసి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పేదల భూముల వారి పేర్లపై ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. రుణాలు రావడం లేదు. ధరణి తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది." - బండి సంజయ్  

  ఫోర్జరీ సంతకాలు పెట్టిన చరిత్ర కేసీఆర్ ది 

 దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి ఒక్క తెలంగాణలోనే అని బండి సంజయ్ ఆరోపించారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నల్లా ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిస్తున్నారని విమర్శించారు.  సిగ్గు లేకుండా గ్యాస్ ధరల పెంపుపై ధర్నాలు చేస్తున్నారన్నారు. మద్యం ధరలను కూడా భారీగా పెంచి ఏటా రూ.40 వేల కోట్లు దోచుకుంటున్నారన్నారు. కేసీఆర్ బిడ్డ కుల వృత్తుల మాదిరిగా లిక్కర్ దందా చేస్తోందన్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే కొత్త కుట్రలకు తెరదీస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం లిక్కర్ దందాలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది. నాణ్యతలేని డబల్ బెఆడ్ రూమ్ ఇళ్లు ప్రారంభానికి ముందే కూలిపోతున్నాయని ఆరోపించారు.  రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు మొండి చేయి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. రైతు, పేదల ద్రోహి కేసీఆర్ అని ఆక్షేపించారు.  రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా 3 సుమస్యలు ..డబుల్ బెడ్ రూమ్, ధరణి, రుణ మాఫీ సమస్యలు వినబడుతున్నాయన్నారు. రాత్రి 1 గంట తర్వాత  ధరణి పోర్టల్ తెరుచుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్యం అమ్మకాల పైనే ఆధారపడిందని విమర్శించారు.  కేసీఆర్ కుమార్తె కూడా మద్యం వ్యాపారంపైనే ఆధారపడ్డారు. లిక్కర్ స్కామ్ నుంచి తన కుమార్తెను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.  లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్ లో కవిత పేరు నాలుగు సార్లు వచ్చిందన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు కూడా ఫోర్జరీ సంతకాలు పెట్టిన చరిత్ర కేసీఆర్ ది అని బండి సంజయ్ ఆరోపించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Embed widget