అన్వేషించండి

Adilabad News: తెల్లవారుజామున ఇళ్లల్లో తనిఖీలు - అటవీ అధికారులపై స్థానికుల రాళ్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత

Telangana News: ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవీ సిబ్బందిపై స్థానికులు రాళ్లు రువ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కార్డన్ సెర్చ్ అంటూ అధికారులు తమ ఇళ్లల్లోకి చొరబడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Stone Pelting On Forest Personnels In Adilabad: ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఇచ్చోడ మండలం కేశవపట్నంలో (Keshavapatnam) ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున అటవీ అధికారులు కార్డన్ సెర్చ్‌ నిర్వహించగా.. పలు ఇళ్లల్లో కలప దుంగలు, ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ ఇళ్లల్లోకి చొరబడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో వారిపై రాళ్లు రువ్వడంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో ఓ బీట్ ఆఫీసర్‌కు స్వల్ప గాయాలు కాగా.. అటవీ శాఖకు చెందిన ఓ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులను నిలువరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. అయితే, దాడి విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

20 మందిపై కేసు

ఈ ఘటనకు సంబంధించి 20 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో సోదాలు చేయగా.. పలు ఇళ్లల్లో భారీగా కలప స్వాధీనం చేసుకున్నామని.. దీంతో గ్రామస్థులు రాళ్ల దాడికి తెగబడ్డారని అటవీ అధికారులు తెలిపారు. రాళ్ల వర్షం కురుస్తుంటే బతికి బయటకు వస్తామో రామో అని అనుమానం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఐదుగురు సిబ్బంది స్వల్పంగా గాయపడగా, రెండు వాహనాలు ధ్వంసం అయినట్లు తెలిపారు. గాయపడిన వారిలో భూమన్న FSO, నౌశిలాల్ FBO, అనిల్ FBO, పాండురంగ్ వాచర్, ముకుంద్ డ్రైవర్ ఉన్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో సుమారుగా రూ.3.50 లక్షల విలువైన కలప పట్టుకున్నామని వెల్లడించారు. స్మగ్లింగ్ అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని.. వనాలను సంరక్షించాలని, వనాలు ఉంటేనే అందరూ సంరక్షంగా ఉంటారని అధికారులు స్పష్టం చేశారు. అటు, పోలీసులు త్వరలోనే దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు. 

Also Read: Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Ugadi Gifts: ఉగాది కానుకలుగా మట్టి వంట పాత్రల కిట్ గిఫ్ట్ - మంత్రి పొన్నం వినూత్న ఆలోచన వైరల్
ఉగాది కానుకలుగా మట్టి వంట పాత్రల కిట్ గిఫ్ట్ - మంత్రి పొన్నం వినూత్న ఆలోచన వైరల్
Revanth Chit Chat: అందుకే పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ - ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
అందుకే పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ - ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Drug Racket: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget