అన్వేషించండి

Adilabad News: తెల్లవారుజామున ఇళ్లల్లో తనిఖీలు - అటవీ అధికారులపై స్థానికుల రాళ్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత

Telangana News: ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవీ సిబ్బందిపై స్థానికులు రాళ్లు రువ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కార్డన్ సెర్చ్ అంటూ అధికారులు తమ ఇళ్లల్లోకి చొరబడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Stone Pelting On Forest Personnels In Adilabad: ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఇచ్చోడ మండలం కేశవపట్నంలో (Keshavapatnam) ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున అటవీ అధికారులు కార్డన్ సెర్చ్‌ నిర్వహించగా.. పలు ఇళ్లల్లో కలప దుంగలు, ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ ఇళ్లల్లోకి చొరబడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో వారిపై రాళ్లు రువ్వడంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో ఓ బీట్ ఆఫీసర్‌కు స్వల్ప గాయాలు కాగా.. అటవీ శాఖకు చెందిన ఓ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులను నిలువరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. అయితే, దాడి విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

20 మందిపై కేసు

ఈ ఘటనకు సంబంధించి 20 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో సోదాలు చేయగా.. పలు ఇళ్లల్లో భారీగా కలప స్వాధీనం చేసుకున్నామని.. దీంతో గ్రామస్థులు రాళ్ల దాడికి తెగబడ్డారని అటవీ అధికారులు తెలిపారు. రాళ్ల వర్షం కురుస్తుంటే బతికి బయటకు వస్తామో రామో అని అనుమానం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఐదుగురు సిబ్బంది స్వల్పంగా గాయపడగా, రెండు వాహనాలు ధ్వంసం అయినట్లు తెలిపారు. గాయపడిన వారిలో భూమన్న FSO, నౌశిలాల్ FBO, అనిల్ FBO, పాండురంగ్ వాచర్, ముకుంద్ డ్రైవర్ ఉన్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో సుమారుగా రూ.3.50 లక్షల విలువైన కలప పట్టుకున్నామని వెల్లడించారు. స్మగ్లింగ్ అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని.. వనాలను సంరక్షించాలని, వనాలు ఉంటేనే అందరూ సంరక్షంగా ఉంటారని అధికారులు స్పష్టం చేశారు. అటు, పోలీసులు త్వరలోనే దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు. 

Also Read: Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget