అన్వేషించండి

Siricilla News: ఏజెంట్ మోసాలకు బలైన సిరిసిల్ల యువకులు, దుబాయ్ విమానాశ్రయంలో తిప్పలు!

Siricilla News: ఏజెంట్ల చేతిలో మోసపోయిన సిరిసిల్ల యువకులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకొని అష్టకష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి, తాగేందుకు నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Siricilla News: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకొని అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన గుగ్లోత్ అరవింద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పెద్దొళ్ల స్వామి, అదే జిల్లాకు చెందిన గొల్లపెళ్లి రాములు, అనిల్ అలాగే  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన నరేందర్ లు మూడ్రోజుల నుంచి దుబాయ్ విమానాశ్రయంలో నరకం అనుభవిస్తున్నారు. 

ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకుంటేనే..

దుబాయ్ లోని ఓ కంపెనీ.. సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్ జిల్లా ఏజెంట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగం ఇచ్చారు. అయితే ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన ఐదుగురు యువకులకు కంపెనీ షాక్ ఇచ్చింది. ఏజెంట్లు చెప్పిన పని, జీతం వేరడవంతో కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మేం ఈ పని చేయలేమంటూ గొడవ పడ్డారు. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులను పిలిపించి.. తాగొచ్చి గొడవ చేస్తున్నారని కేసు బుక్ చేయించారు. ఈ క్రమంలోనే కంపెనీ నిర్వాహకులు.. ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకుంటే ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. దీంతో బాధితులు ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకున్నారు.  

పాస్ పోర్టులు చెక్ చేసి కేసులున్నాయని వెనక్కి..

బాధితుల పాస్ పోర్టులు ఇచ్చేసి వాళ్లను ఎయిర్ పోర్టు వద్ద వదిలేశారు. అయితే శనివారం రోజు రాత్రి వాళ్లు ఇండియాకు రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఐదుగురు యువకులు పాస్ పోర్టులు, టికెట్లు తీసుకొని ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లారు. ఐదుగురికి విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ పూర్తయింది. కానీ అక్కడి పోలీసులు వాళ్ల పాస్ పోర్టులు చెక్ చేసి.. మీ పైన కేసులు ఉన్నాయి, మీరు ఇండియాకి వెళ్లరాదని చెప్పి ఎయిర్ పోర్ట్ నుండి బయటకు పంపించారు. ఏం చేయాలో పాలుపోని యువకు ఇటు ఏజెంట్లు అటు కంపెనీ నిర్వాహకులకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో ఎయిర్ పోర్టు వద్దనే  కూర్చొని యువకులు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు వారికి ఏమవుతుందో ఏమోనని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరిని ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.

"అన్నా మేం ఓ కంపెనీలోకి వచ్చి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. అందరం కలిసి ఎయిర్ పోర్టు ముందుటున్నం అన్నా. మేం. తినడానికి కూడా పైసల్ లేవు. నీళ్లకు కూడా లేవు. మూడ్రోజులు అయితుందన్న అన్నం తినక, నీళ్లు తాగక. ఇక్కడనే ఎయిర్ పోర్టు ముందుటున్నమన్న. ఈరోజు ఇంటి నుంచి పైసల్ ఏపిచ్చుకోని టికెట్ బుక్ చేస్కొని ఇక్కడికి వస్తే ఎయిర్ పోర్టు బోర్డింగ్ అయిన తర్వాత టికెట్ చింపేశి బయటకు పంపిచ్చిర్రు. అన్నా కేటీఆర్ అన్న నువ్వే దయతోటి మమ్మల్ని ఇండియాకి రప్పిచ్చేటట్టు చెయ్యన్న."

స్పందించిన మంత్రి కేటీఆర్..

ఇదే విషయాన్ని వీడియోలో వివరిస్తూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి కేసీఆర్.. యువకులు సమస్యను వీలయినంత త్వరగా పరిష్కరించాలని కోరుతూ.. దుబాయ్ లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ కు రీట్వీట్ చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Embed widget