అన్వేషించండి

Singareni Elections 2023: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Singareni Elections 2023:

Singareni Elections 2023 Polling: సింగరేణి(Singareni) గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కీలకమైన మరో సమరంలో కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్‌(BRS) హోరాహోరీగా తలపడుతున్నాయి. అదే స్థాయిలో హామీలు కూడా ఇచ్చాయి. ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో జెండా పాతాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తోపాటు వామపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆ దిశగానే మొన్నటి వరకు ప్రచారం చేశాయి. 

6 జిల్లాలు- 84 పోలింగ్ కేంద్రాలు

ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్‌లో 84 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అర్థరాత్రికి ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. 

మూడు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు

మొత్తం 39వేల 809 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి ఎవరి షిప్టుల్లో వాళ్లు వచ్చి ఓట్లు వేస్తున్నారు. బెల్లంపల్లిలో ఐదు, శ్రీరాంపూర్‌లో 15 మందమర్రిలో 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్‌లో 9వేల 124 మంది ఓటర్లు ఉన్నారు. మందమర్రిలో 4వేల 876 మంది ఉన్నారు బెల్లంపల్లి 985 మంది ఓటర్లు ఉన్నారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హోరాహోరీ  

సాధారణ ఎన్నికలకు మించిన రాజకీయం ఈ బొగ్గుగనుల్లో జరుగుతోంది. రాష్ట్రంలో అధికారమార్పిడీ జరిగినందున ఇక్కడ కూడా పట్టు కోల్పోకూడదని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. పట్టిన పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచించింది. ఈ ఎన్నికల బరి నుంచి టీజీబీకేఎస్‌ తప్పుకుంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏఐటీయూసీకి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ రెండు సంఘాలు ప్రకటించాయి. కాంగ్రెస్ అనుబంధ సంస్త ఐఎన్‌టీయూసీ పోటీలో నిలిచింది. 

1998 నుంచి ఎన్నికలు 

తెలంగాణలోని సింగరేణి గనుల్లో తరచూ జరిగే సమ్మెలను నివారించేందుకు 1998 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదట్లో రెండేళ్ల కాలపరిమితి ఉండేది. తర్వాత అదే నాలుగేళ్లకు పెంచారు. మళ్లీ 2017 నుంచి కేంద్రం ఆదేశాల మేరకు గుర్తింపు సంఘాల కాలపరిమితిని రెండేళ్లకే పరిమితం చేశారు. అయితే దీనిపై గెలిచిన గుర్తింపు సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఆ కేసు విచారణలో ఉన్నందున 2021లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. 

నాలుగేళ్లా? రెండేళ్లా?

కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నోటిఫికేషన్ మాత్రం రెండేళ్ల కాలపరిమితితోనే విడుదలైంది. దీనిపై భవిష్యత్‌లో గుర్తింపు సంఘాలు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది మాత్రం తేలాల్సి ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు
మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget