అన్వేషించండి

Singareni Elections 2023: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Singareni Elections 2023:

Singareni Elections 2023 Polling: సింగరేణి(Singareni) గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కీలకమైన మరో సమరంలో కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్‌(BRS) హోరాహోరీగా తలపడుతున్నాయి. అదే స్థాయిలో హామీలు కూడా ఇచ్చాయి. ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో జెండా పాతాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తోపాటు వామపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆ దిశగానే మొన్నటి వరకు ప్రచారం చేశాయి. 

6 జిల్లాలు- 84 పోలింగ్ కేంద్రాలు

ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్‌లో 84 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అర్థరాత్రికి ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. 

మూడు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు

మొత్తం 39వేల 809 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి ఎవరి షిప్టుల్లో వాళ్లు వచ్చి ఓట్లు వేస్తున్నారు. బెల్లంపల్లిలో ఐదు, శ్రీరాంపూర్‌లో 15 మందమర్రిలో 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్‌లో 9వేల 124 మంది ఓటర్లు ఉన్నారు. మందమర్రిలో 4వేల 876 మంది ఉన్నారు బెల్లంపల్లి 985 మంది ఓటర్లు ఉన్నారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హోరాహోరీ  

సాధారణ ఎన్నికలకు మించిన రాజకీయం ఈ బొగ్గుగనుల్లో జరుగుతోంది. రాష్ట్రంలో అధికారమార్పిడీ జరిగినందున ఇక్కడ కూడా పట్టు కోల్పోకూడదని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. పట్టిన పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచించింది. ఈ ఎన్నికల బరి నుంచి టీజీబీకేఎస్‌ తప్పుకుంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏఐటీయూసీకి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ రెండు సంఘాలు ప్రకటించాయి. కాంగ్రెస్ అనుబంధ సంస్త ఐఎన్‌టీయూసీ పోటీలో నిలిచింది. 

1998 నుంచి ఎన్నికలు 

తెలంగాణలోని సింగరేణి గనుల్లో తరచూ జరిగే సమ్మెలను నివారించేందుకు 1998 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదట్లో రెండేళ్ల కాలపరిమితి ఉండేది. తర్వాత అదే నాలుగేళ్లకు పెంచారు. మళ్లీ 2017 నుంచి కేంద్రం ఆదేశాల మేరకు గుర్తింపు సంఘాల కాలపరిమితిని రెండేళ్లకే పరిమితం చేశారు. అయితే దీనిపై గెలిచిన గుర్తింపు సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఆ కేసు విచారణలో ఉన్నందున 2021లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. 

నాలుగేళ్లా? రెండేళ్లా?

కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నోటిఫికేషన్ మాత్రం రెండేళ్ల కాలపరిమితితోనే విడుదలైంది. దీనిపై భవిష్యత్‌లో గుర్తింపు సంఘాలు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది మాత్రం తేలాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ

వీడియోలు

BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget