అన్వేషించండి

Sharmila In Delhi : ఢిల్లీలో షర్మిల - ఖర్గే, రాహుల్‌తో విలీనంపై చర్చలు జరిపే చాన్స్ !

కాంగ్రెస్‌తో విలీన చర్చల కోసం షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గే , రాహుల్ తో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.


Sharmila In Delhi :   వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ చేరుకున్నారు.  కాంగ్రెస్‌లో  తన పార్టీని విలీనం చేసే అంశంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ అంశంపై చర్చలు పూర్తి చేశారు. హైకమాండ్‌తో తుది చర్చల కోసం షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా షర్మిల కలిసే అవకాశాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఆమె ట్వీట్లు పెడుతున్నారు.

విలీనంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదా ? 

వైఎస్ఆర్ తెంలగాణ పార్టీని ప్రారంభించిన  షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే అనుకున్నంతగా ఊపు రాకపోవడం.. తెలంగాణలో నేతలెవరూ పార్టీలో చేరకపోవడంతో ఆమె పార్టీని నడిపించడంలో ఇబ్బంది పడుతున్నారు. షర్మిల తప్ప ఆ పార్టీలో మరో నేత కనిపించడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. తనకు పాలేరు టిక్కెట్ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తాననే ప్రతిపాతన పెట్టారంటున్నారు. అయితే పాలేరు  కాదు కానీ సికింద్రాబాద్ నుంచి  పోటీ చేయమని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  అయితే ఈ విషయంలో ఇంకా ఎటూ చర్చలు తేలలేదంటున్నారు. 

ఏపీ రాజకీయాల్లో అయితే కీలక పాత్ర పోషించే అవకాశం 

ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే మాత్రం ఆ ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఉంటుందని భావిస్తున్నారు.  రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచే సీఎం అయ్యారు. కానీ ఆయన ఓటు బ్యాంకును ఇటు ఏపీలో కానీ.. అటు తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయింది. రాజన్న తమ వాడు అని చెప్పుకోలేకపోయింది. ఆయన కొడుకు జగన్ పార్టీ పెట్టడంతో ఏపీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అందరూ జగన్ వైపు చూడగా.. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు అటు రాజశేఖర్‌రెడ్డిని తమ వాడు అని వాడుకోలేక నాయకత్వ లేమితో ఇబ్బందిపడ్డారు. రాజన్న బిడ్డగా షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. పోయిన ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకోవచ్చని హస్తం అధిష్టానం ఆలోచిస్తోంది. మరోవైపు జగన్‌పై పోరాటానికి షర్మిలనే అస్త్రంగా వాడుకోవాలని డిసైడైంది. 

షర్మిల అన్నింటికి సిద్ధపడితే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు                  

కాంగ్రెస్ లో చేరి అన్నను సైతం డీ కొట్టాలని నిర్ణయించుకుంటే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు  వస్తాయి. ఇప్పటివరకూ విజయమ్మ మద్దతు కూడా షర్మిలకే ఉండడం ఆమెకు కలిసొచ్చిన అంశమనే చెప్పాలి. కానీ తన బిడ్డలు చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారని అంటున్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడితే ఎవరికి మద్దతిస్తారో స్పష్టత లేదు. ఏపీలో కూడా విజయమ్మ కాంగ్రెస్ కే మద్దతు పలికితే జగన్ మోహన్ రెడ్డికి ఓ రకంగా షాకే. కానీ ఇటీవల సీఎం జగన్ .. విజయమ్మను మళ్లీ వైఎస్ఆర్‌సీపీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.   

టాప్ హెడ్ లైన్స్

SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget