అన్వేషించండి

YS Sharmila : మేఘా - కేసీఆర్‌లు కలిసే దోచుకుంటున్నారు - దర్యాప్తు ఎందుకు చేయరని షర్మిల ప్రశ్న !

కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు విచారణ చేయవని ప్రశ్నించారు.


YS Sharmila :  దేశంలోనే అతి పెద్ద స్కాం కాళేశ్వరం అని  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఢిల్లీలో కాగ్‌కు ఫిర్యాదు చేసి వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో దాదాపు రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ను రూ.38 వేల కోట్లతో చేపడితే..  ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని షర్మిల విమర్శించారు.  ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి తోడు దొంగలైతే.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి జీతగాళ్లని షర్మిల కామెంట్ చేశారు. ప్రాజెక్ట్లో జరిగిన అవినీతిపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. 

మేఘా కృష్ణారెడ్డితో అందరూ కుమ్మక్కయ్యారన్న షర్మిల

మేఘా కృష్ణారెడ్డి అనే వ్యక్తి కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, మీడియా సహా అందరినీ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపణలు చేసే బీజేపీ.. కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగినా వైఎస్సార్టీపీ తప్ప ఇంకే పార్టీ ఆ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల డబ్బును కేసీఆర్ బందిపోటులా దోచుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్రం ఎంక్వైరీ కమిషన్ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. విభజన హామీలు నెరవేర్చని బీజేపీ మునుగోడులో సిగ్గులేకుండా ఓట్లు అడుగుతోందని షర్మిల ఫైర్ అయ్యారు.

గతంలో సీబీఐ, తెలంగాణ గవర్నర్‌కూ ఫిర్యాదు 

గతంలో సీబీఐ డైరక్టర్‌ను కలిసి షర్మిల ఫిర్యాదు చేసారు.  కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు జరుపుతామని సీబీఐ, కాగ్ హామీ ఇచ్చాయని షర్మిల చెప్పారు. కాళేశ్వరంలో అవినీతిపై షర్మిల చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. గత ఆగస్టులో గవర్నర్ తమిళిశైను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అన్నీ ఆధారాలు గవర్నర్‌కు ఇచ్చానని చెప్పారు. అప్పట్నుంచి వివిధ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. స్వయంగా వెళ్లి ఆధారాలు కూడా ఇస్తున్నట్లుగా వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో దాదాపుగా అన్ని పార్టీలు కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే అన్ని పార్టీలూ ఆరోపణలకే పరిమితం కాగా.. షర్మిల మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. తక్షణం విచారణ జరపాలని కోరుతున్నారు. 

ఏపీలోనూ పలు కీలక ప్రాజెక్టులు చేపట్టిన మేఘా 

మేఘా కృష్ణారెడ్డికి చెందిన సంస్థలకే తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులూ దక్కుతున్నాయని తెలంగాణ ప్రజల సంపద..  మేఘా పరం అవుతోందని..  షర్మిల ఆరోపిస్తున్నారు. ఆమె ఈ విషయంలో ఇతర సమస్యల కన్నా ఎక్కువగా పోరాటం చేయడం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. మేఘా కృష్ణారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటారు. ఏపీలోనూ రివర్స్ టెండర్ల ద్వారా అత్యధిక కాంట్రాక్టులు మేఘా సంస్థకే దక్కాయి. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Rythu Bharosa Funds Release 2026:తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్- రైతు భరోసా నిధులు విడుదల- స్టాటస్‌ ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్- రైతు భరోసా నిధులు విడుదల- స్టాటస్‌ ఇలా చెక్ చేసుకోండి!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Akhil Raj Delivery Boy: తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ
తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget