అన్వేషించండి

Telangana MLC Elections : తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్ - కాంగ్రెస్‌కే దక్కుతాయా ?

MLC Elections : ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. రెండు స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించే అవకాశం ఉంది.

MLA quota MLC elections :  తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 18వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 29వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే  రోజు కౌంటింగ్ జరుగుతుంది. నిజానికి తెలంగాణలో ( Telangana  )  ఎమ్మెల్సీ ఖాళీలు లేవు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. వీరు అంతకు ముందే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే  ముందు ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. వారి స్థానాల్లోకి కొత్త అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 

రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలైతే పోలింగ్ ఉండదు. ఏకగ్రీవం అవుతుంది. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్కరికి 60 ఓట్లు వస్తే ఎమ్మెల్సీ అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఉన్నారు. బీఆర్ఎస్‌కు 39 మంది మాత్రమే ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం ఒకే అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలు ఉండవు. బలం తక్కువ అయినా రెండో స్థానం బీఆర్ఎస్ గెలుచుకోవచ్చు. కానీ .. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల్ని నిలబెడితే మాత్రం.. పోరు ఆసక్తికరంగా మారుతుంది. బీఆర్ఎస్ పోటీ నుంచి వైదొలిగితే కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం అవుతారు. బీఆర్ఎస్ పోటీ పెడితే.. మాత్రం ఎన్నిక రచ్చ అవుతుంది. కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించే అవకాశం ఉంది.
Telangana MLC Elections : తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్ - కాంగ్రెస్‌కే దక్కుతాయా ?
 
మరో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా  రాజేశ్వర్ రెడ్డి కూడా ఎమ్మెల్స పదవికి రాజీనామా చేశారు. ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచారు.  వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి   జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాస్త ఖాళీ అయ్యింది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా... ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడగా.. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టఫ్ ఫైట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా... చివరకు పల్లా విజేతగా నిలిచారు. ఆయన ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. కానీ తాజా ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.
 
ఈ నియోజకవర్గానికి చెందిన పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా ఆదేశించాలు ఇచ్చింది ఈసీ. ఓటరు నమోదు కోసం నిర్ణీత షెడ్యూల్‌ను వెల్లడించగా... ఓటర్ల నమోదు ప్రక్రియకు శనివారం పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 6కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని... 24వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడించాలని పేర్కొంది. ఏప్రిల్‌ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. గవర్నర్ కోటాలోనూ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Embed widget