అన్వేషించండి

Sankalp Satyagraha:రాహుల్ గాంధీపై అనర్హత అప్రజాస్వామికం, ఆయన కోసం ప్రాణాలిస్తాం - ఎంపీ కోమటిరెడ్డి

Sankalp Satyagraha: రాహుల్ గాంధీపై అనర్హత అప్రజాస్వామికం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆయన కోసం ప్రాణాలిచ్చేందుకైనా తాను సిద్ధమని అన్నారు.  

Sankalp Satyagraha: రాహుల్ గాంధీ అనర్హత అప్రజాస్వామికం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను నిరసిస్తూ... గాంధీ భవన్ లో చేపట్టిన సంకల్ప్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ప్రకటించారు. అదాని విషయాన్ని డైవర్ట్ చేసేందుకే రాహుల్ పై అనర్హత వేటు వేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అవసరం అయితే ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు పడిన పరిస్థితి కంటతడి పెట్టేలా ఉందని వివరించారు. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ వదులుకున్నారని గుర్తు చేశారు. అదానీ గురించి రాహుల్ ఎప్పుడు మాట్లాడారో అప్పటి నుంచి కుట్ర చేశారని తెలిపారు. ఆగమేఘాల మీద పరువు నష్టం కేసులో శిక్ష పడేలా చేశారన్నారు. అయితే ఇందిరా గాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఎంపీ కోమటి రెడ్డి అన్నారు.  

మరోవైపు ఇదే దీక్షలో బీజేపీపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుతున్నారని విమర్శించారు. తన మిత్రుల కోసం ప్రధాని మోదీ దేశాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 7న అదానీ కుంభకోణంపై లోక్ సభలో ప్రశ్నించారని దీంతో ప్రధాని ఉక్కిరి బిక్కిరై సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ అనే అదానీ-ప్రధాని ఎద్దేవా చేశారు. నేరుగా రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేకే కుట్రపూరితంగా ఆయనపై అనర్హత వేటు వేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. బీజేపీ ప్రభుత్వం హడావుడిగా రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఆదేశిస్తే రాజీనామాలు రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి అన్నారు.

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది. రాహుల్‌ గాంధీ గొంతును అణచివేసి కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ, మోదీ చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి కుట్రలను తిప్పి కొడతామన్నారు. రాహుల్‌గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక కుట్రపూరితంగా వేటు వేశారని రేవంత్‌ ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం రాహుల్‌ గాంధీ తాత నెహ్రూ జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ చేపట్టాల్సిన ఆందోళనపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా చేయాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోందన్నారు. ఈ విషయంలో ఏఐసీసీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. అధిష్ఠానం ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తామన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
Telangana Latest News : ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
TDP Latest News: టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
Telangana Latest News: దోషిగా నిలబడ్డ కోర్టులోనే లాయర్‌గా పని చేశా, ఇప్పటికీ చదువుతూనే ఉన్నా: ఎడ్యుకేషన్‌పై సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్‌  
దోషిగా నిలబడ్డ కోర్టులోనే లాయర్‌గా పని చేశా, ఇప్పటికీ చదువుతూనే ఉన్నా: ఎడ్యుకేషన్‌పై సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్‌  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
Telangana Latest News : ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
TDP Latest News: టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
Telangana Latest News: దోషిగా నిలబడ్డ కోర్టులోనే లాయర్‌గా పని చేశా, ఇప్పటికీ చదువుతూనే ఉన్నా: ఎడ్యుకేషన్‌పై సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్‌  
దోషిగా నిలబడ్డ కోర్టులోనే లాయర్‌గా పని చేశా, ఇప్పటికీ చదువుతూనే ఉన్నా: ఎడ్యుకేషన్‌పై సీతక్క పవర్‌ఫుల్ స్పీచ్‌  
Viral News: ఆన్ లైన్‌లో కన్యాత్వాన్ని అమ్మేసి 18 కోట్లు సంపాదించింది - ఆ విద్యార్థిని చేసిన పని మంచిదేనా ?
ఆన్ లైన్‌లో కన్యాత్వాన్ని అమ్మేసి 18 కోట్లు సంపాదించింది - ఆ విద్యార్థిని చేసిన పని మంచిదేనా ?
Vijayasai Reddy Comments : జగన్ కోటరీ వల్లే పార్టీకి గుడ్ బై - ఘర్ వాపసీ ఉండదు - విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
జగన్ కోటరీ వల్లే పార్టీకి గుడ్ బై - ఘర్ వాపసీ ఉండదు - విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Dil Raju On Gaddar Awards: ఏప్రిల్‌లో 'గద్దర్' అవార్డ్స్... పదేళ్లలో సినిమాలకు ఒకే వేదికపై - దిల్ రాజు కీలక ప్రెస్‌మీట్‌
ఏప్రిల్‌లో 'గద్దర్' అవార్డ్స్... పదేళ్లలో సినిమాలకు ఒకే వేదికపై - దిల్ రాజు కీలక ప్రెస్‌మీట్‌
AP IPS officers: ముగ్గురు ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్ పొడిగింపు - జెత్వానీ కేసే కారణం !
ముగ్గురు ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్ పొడిగింపు - జెత్వానీ కేసే కారణం !
Embed widget