అన్వేషించండి

Rythu Bheema: రైతులకు గుడ్ న్యూస్ - రైతు బీమా దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు, ఎప్పటి వరకంటే?

 Rythu Bheema: రైతు బీమా నమోదు గడువును ఈనెల 13వ తేదీ వరకు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారు పాసు పుస్తకాలు తీసుకొని వెళ్లి రైతుబీమా కోసం అప్లై చేస్కోవాల్సి ఉంటుంది.

Rythu Bheema: రైతు బీమా నమోదు గడువును పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని రైతులకు సూచించింది. రైతు బీమాకు అర్హులైన కొత్త రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ గడువు నిర్ణయించింది. కానీ తాజాగా ఈ గడువును 13వ తేదీ వరకు పొడిగించింది. రైతులకు ఆసరాగా ఉండేందుకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది తెలంగాణ సర్కారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. కరోనా మహమ్మారి తర్వాత బీమా పాలసీలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో రైతు బీమా ఒకటి. ఈ పథకంలో చేరిన రైతులకు వారికి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ప్రభుత్వం బీమా సదుపాయం ఉన్న రైతులకు ఎలాంటి లోటు లేకుండా ప్రతిసారి బడ్జెట్ ను కేటాయిస్తోంది.  

18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులు అర్హులు.. 
ఈ రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఇందులో దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు పదమూడవ తేదీ వరకు గడువును కూడా పొడిగించారు. అయితే రైతు బీమాకు అర్హులైన కొత్త రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ గడువును పొడగించింది. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులకు జీవిత బీమా కల్పించడానికి ప్రీమియం చెల్లించింది. గతేడాది (2021 ఆగస్టు 12 నుంచి 2022 ఆగస్టు 13) ప్రీమియం కింద 35.64 లక్షల మంది రైతుల తరఫున రూ. 1,465 కోట్లను భారతీయ జీవిత బీమా సంస్ఖ అయిన ఎల్ఐసీకి చెల్లించింది. 

పాసుబుక్కు జిరాక్సుతో పాటు మరిన్ని... 
గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ 22 వరకూ కొత్తగా భూములు కొని పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారిలో 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వారు తమ భూమి ఉన్న గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)కి దరఖాస్తు ఇవ్వాలి. పట్టాదారు పాసు పుస్తకాలతో పాటు ఆధార్, బ్యాంకు అకౌంట్ పాసు పుస్తకం జిరాక్సులను కూడా అందజేయాలి. తద్వారా వారికి 2022 ఆగస్టు 14 నుంచి ఏడాది పాటు జీవిత బీమా ఉంటుంది. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షలు జీవిత బీమా పరిహారం కింద ఎల్ఐసీ అందజేయాలనేది ఈ పథకం నిబంధన. 

అన్నదాతలకు అండగా.. 

రైతు బీమా వల్ల అన్నదాతలు చాలా లాభపడతారని అధికారులు చెబుతున్నారు. ఏ కారణం వల్లనైనా రైతు మృతి చెందినట్లయితే.. ఆ రైతు కుటుంబానికి 5 లక్షల సాయాన్ని అందించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులకు తెలంగాణ సర్కార్ అండగా నిలవాలని రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలను అమలు చేస్తోంది. రైతు బీమా స్కీమ్ ద్వారా వారి కుటుంబానికి భరోసా ఇస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Advertisement

వీడియోలు

విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Bigg Boss Telugu Day 70 Promo : భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
Viral Video: మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్
మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్
Indian Rupee vs World Currencies : ఇండియన్ రూపాయి బలంగా ఉన్న దేశాలు ఇవే.. అక్కడ లక్షరూపాయలు మూడు కోట్లంత విలువ
ఇండియన్ రూపాయి బలంగా ఉన్న దేశాలు ఇవే.. అక్కడ లక్షరూపాయలు మూడు కోట్లంత విలువ
Hyundai Venue లేక Kia Syros, ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ? కొనే ముందు ఇవి తెలుసుకోండి
Hyundai Venue లేక Kia Syros, ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ? కొనే ముందు ఇవి తెలుసుకోండి
Embed widget