అన్వేషించండి

Telangana: ఆర్టీసీ కార్మికల సమ్మె వాయిదా - ప్రభుత్వంతో చర్చలు సఫలం - ఉద్యోగులతో చర్చలకు కమిటీ

Telangana Employees: ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించుకున్నారు. ఇతర ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.

RTC employees call off strike :  తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించారు. ప్రభుత్వ ప్రతినిధులతో జరిపిన చర్చలతో వారు సంతృప్తి చెందారు. సమ్మె యోచన విరమించుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇతర ఉద్యోగులు కూడా ప్ర్భుత్వంపై సమరమేనని ప్రకటించడంతో వారితో చర్చలు జరిపేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని నిమించారు.

ఆర్టీసీ ఉద్యోగులు ఏడో తేదీ నుంచి అంటే బుధవారం నుచి సమ్మెకు వెళ్లాలన అనుకున్నారు. తేదీ దగ్గర పడటంతో ప్రభుత్వం వారి డిమాండ్లకు ఏ మాత్రం సానుకూలంగా వ్యవహరించకపోగా కఠినంగా వ్యవహరించింది. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోని సమ్మెకు వెళ్తే సంస్థ మనుగడుకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అదే సమయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు లేఖ రాసింది. ఆర్టీసీఉద్యోగుల సంక్షేమం విషయంలో  ఏ మాత్రం రాజీపడబోదని హామీ ఇచ్చింది. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు ఉంటాయని  యాజమాన్యంలేఖను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికులను ఆలోచింప చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చే అవకాశం లేదని క్లారిటీ రావడంతో వారు సమ్మె ప్రతిపాదన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.  మరో వైపు ఇతర ఉద్యోగులు కూడా పోరు బాట పట్టాలని డిసైడయ్యారు. దీంతో వారితో చర్చల కోసం ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు. నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ లు ఈ కమిటీలో ఉంటారు. వీరు ఉద్యోగ సంఘం నేతలతో చర్చలు జరుపుతారు. వారి డిమాండ్లు ఏమిటో తెలుసుకుని ప్రభుత్వం ముందు ఉంచుతారు.   

రేవంత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గుతున్న  ఉద్యోగులు ? 

డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామంటున్న ఉద్యోగా సంఘాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలు ఇక సమరమే అంటున్నారని..  ఇదేదో మనోళ్లేనా, ఇంకెవరైనా అన్నారా అని అనుకున్నానని అన్నారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఉద్యోగ సంఘాల నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై సమరం చేస్తామని  ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారని..  . ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు మూడున్నర లక్షల మంది.. మీరు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా అని ప్రశ్నించారు. జీతాలు రానప్పుడు కనీసం నోరు విప్పారా?.. ఇప్పుడు జీతాలు రావడం లేదని ఉద్యోగులు అడగకుండానే వేశాం కదా అని ప్రశ్నించారు. 

గతంలో బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండేందుకు రిటైర్‌మెంట్‌ ఏజ్ పెంచారు.. మీరు దాచుకున్న సొమ్ము, బెనిఫిట్స్ రూ.9 వేల కోట్లు పెండింగ్ పెట్టారు.. ప్రజలు కష్టాల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలు సమరం అంటున్నాయి.. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలు ఇచ్చారు.. సమస్య ఉంటే చర్చకు రండి, చర్చిద్దాం.. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్లు ఎవరూ బాగుపడలేదు.. ప్రజల మీద యుద్ధం చేస్తారా?.. రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారకండి, ప్రజల గుండెల్లో చురకత్తులు పొడవకండి అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
Amaravati High Speed Rail: అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే
అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే
Revanth Reddy Letter To Kishan Reddy: హైదరాబాద్ మెట్రో పై ఢిల్లీ వేదికగా తేల్చుకుందాం - కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రో పై ఢిల్లీ వేదికగా తేల్చుకుందాం - కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
Chennai Love Story Jigithara Song : జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్
జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్
CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
PM Modi on Yoga Day: దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది: కోల్‌కతాలో ప్రధాని మోదీ
దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది: కోల్‌కతాలో ప్రధాని మోదీ
Happy Fathers Day : హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
Amaravati High Speed Rail: అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే
అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే
Embed widget