అన్వేషించండి

Karimnagar News: ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ - గంటల తరబడి ఎదురుచూపులు, కరీంనగర్‌లో ప్రయాణికుల ఇబ్బందులు

Telangana News: దీపావళి పండుగ తర్వాత స్వస్థలాలకు వెళ్లే వారితో కరీంనగర్ బస్టాండ్ రద్దీగా మారింది. అయితే, రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

RTC Buses Full Rush In Karimnagar: దీపావళి పండుగ ముగించుకుని స్వస్థలాలకు తిరుగు ప్రయాణమవుతున్న ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజాంబాద్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల  నుంచి వచ్చే ప్రయాణికులంతా కరీంనగర్ (Karimnagar) మీదుగా వెళ్లాల్సిందే. అయితే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పుణ్యమా అంటూ ఆర్టీసీ బస్సుల్లో మునపటి కంటే ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో బస్సుల్లో సీట్లు దొరక్క మహిళా ప్రయాణికులు సహా సాధారణ ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఆక్యుపెన్సీతో ఆర్టీసీ సంస్థ లాభాల్లో ఉన్నా సరిపడా సర్వీసులు లేక అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతి పెద్ద బస్టాండ్ కరీంనగర్ బస్టాండ్. దీపావళి తర్వాత స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ బస్టాండ్‌లో ఆదివారం తీవ్ర రద్దీ నెలకొంది.

వసతుల లేమి

కరీంనగర్ నుంచి వరంగల్ (Warangal), హైదరాబాద్ (Hyderabad) ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీపావళి సెలవులు ముగియడంతో తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్‌లో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. అయితే, బస్ స్టేషన్‌లో కనీస వసతులు లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూర్చోడానికి సరిపడా కుర్చీలు కూడా లేకపోవడం, ఫ్యాన్లు ఉన్నా పని చేయకపోవడం, ఉన్న చోట దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్టీసీ సిబ్బంది దురుసు ప్రవర్తన..

వరంగల్, హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులు గంటల తరబడి ఆర్టీసీ బస్సుల కోసం ఎదురుచూస్తుండగా.. ఎప్పుడో ఒక బస్సు వస్తే అందులో కాలు కూడా పెట్టని విధంగా రద్దీ నెలకొంటోంది. ఈ క్రమంలో మరో బస్సు ఎప్పుడు వస్తుందని ఆర్టీసీ సిబ్బందిని అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఓ మహిళతో ఆర్టీసీ సిబ్బంది 'ఎప్పుడో అప్పుడు వస్తుంది పో' అని సమాధానం ఇవ్వడంతో తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది సదరు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

పరిమితికి మించి...

సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో 50 మందికి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది కానీ ప్రస్తుతం బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒక్కో బస్సులో 70 నుంచి 80 మంది వరకు ప్రయాణం సాగిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. అటు, మహిళలకు ఉచిత ప్రయాణంతో సీట్ల కోసం ఘర్షణ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పండుగ, రద్దీ సమయాల్లో బస్సు సర్వీసులు పెంచాలని కోరుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం దృష్ట్యా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

Also Read: Nagarkurnool News: తెలంగాణలో తీవ్ర విషాదం - గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
Breaking News: ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Mancherial Latest News:
"అప్పుల ఊబిలో చిక్కుకొని అనాథలా సింగరేణి" భరోసా యాత్రలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget