అన్వేషించండి

Revant Reddy : ప్రభుత్వంలో "బీహార్ ముఠా" పాలన - తెలంగాణ ఐఏఎస్‌లు స్పందించాలని రేవంత్ పిలుపు !

బీహార్ అధికారుల పాలనతో తెలంగాణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని రేవంత్ విమర్శించారు. తెలంగాణ సివిల్ సర్వీస్ అధికారులు సమర్థులు కారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

 

తెలంగాణలో బీహార్ ఉన్నతాధికారుల ముఠా రాజ్యమేలుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కూడా తమ పూర్వీకులు బీహార్ నుంచి వలస వచ్చారని 2008లో ప్రకటించుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వందలాది బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నా  ఎనిమిదేళ్లలో తెలంగాణ పౌరులకు పరిపాలనలో అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.  సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ అంజనీ కుమార్ తో బీహార్ ఐఏఎస్ లకు ఒక్కొక్కరి వద్ద ఆరు శాఖలు ఉన్నాయని.. బీహార్ ఐఏఎస్ లను ఒక రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 


మీ పూర్వికులు బీహార్ కావొచ్చు కానీ  పరిపాలన మొత్తం బీహార్ బ్యాచ్ కే ఇస్తారా అని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 152 మంది ఐఏఎస్ లలో కేవలం బీహార్ ఐఏఎస్ లే ప్రతిభావంతులా అని ప్రశ్నించారు.  సీఎస్ సోమేశ్ కుమార్ ఐఏఎస్ సర్వీస్ లో ఏడేళ్లు పని చేయలేదని సోమేశ్ కుమార్ సీనియారిటీ ప్రకారం  ప్రిన్సిపల్ సెక్రటరీ కే పరిమితమవ్వాలి .. కానీ సీఎస్ గా బాధ్యతలు ఇచ్చారన్నారు.  విభజన సందర్భంగా ఏపీ క్యాడర్ కు సోమేశ్ కుమార్ ను కేటాయించారని ఈ అంశంపై డీవోపీటీలో కేసు ఉంటే బెంచ్ మీదకు రాకుండా మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.  జయేష్ రంజన్ , అరంవింద్ కుమార్ , సందీప్ కుమార్ సుల్తానియా , రజత్ కుమార్ వీరందరూ బీహార్ కు చెందిన ఐఏఎస్ లు ఒక ముఠాగా ఏర్పడ్డారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 30 లక్షల ఓట్లను సోమేశ్ కుమార్ తొలగించారు... నజరానా గా సీఎస్ పోస్ట్.. రజత్ కుమార్.. జనరల్ ఎన్నికల్లో అవక తవకలకు సహకరించినందుకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రకరీ ఇచ్చారని ఆరోపించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కూడా బీహార్ బ్యాచ్.. బీహార్ ఐఏఎస్ లపై నిఘా పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. 
 

అరవింద్ కుమార్ చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. ఈయనకు ఆరు శాఖలు ఇచ్చారు. ఐపీఎస్ అంజనీ కుమార్ కూడా బీహార్ బ్యాచ్.. డీజీపీ మహేందర్ రెడ్డి ని ఉన్న ఫలంగా పంపించి.. బీహార్ బ్యాచ్  అంజనీ కుమార్ ను తీసుకొచ్చారన్నారు.  రాష్ట్రం మొత్తం  బీహారీల చేతిలో బందీ చేశారు. పరిపాలనలో బీహారీల తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతూ వచ్చారని ఇప్పుడు ఈ పోర్టర్ కారణంగానే భూతగాదాలతో హత్యలకు దిగుతున్నారని ఆరోపించారు.  ఇబ్రహీంపట్నం లో ఇద్దరు మర్డర్లు  ధరణి లోపాల వల్లే జరిగాయన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ తీరుతో ధరణి లోపభూయిష్టంగా మారిందని రేవంత్ మండిపడ్డారు.ధరణి పోర్టల్ ను అడ్డంపెట్టుకుని అవుటర్ రింగ్ చుట్టూ లక్షలాది ఎకరాలు గోల్ మాల్ అయ్యిందని ..బీహార్ ఐఏఎస్ ముఠా  కారణంగా తెలంగాణ సమాజం ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రతిపక్ష నేతగా తాను విమర్శలు చేస్తూంటే  వివరణ ఇవ్వాల్సింది పోయి.. మళ్లీ బీహార్ వ్యక్తులు రంగంలో కి దిగారని మండిపడ్డారు. బీహార్ మంత్రి సంజయ్ కుమార్ ఝా అనే మంత్రి.. కేసీఆర్ సమర్థిస్తూ తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాట్లాడాలని.. చైతన్య వంతమైన తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
Embed widget