అన్వేషించండి

Kumuram Bheem Jayanti: నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గోండు వీరుడు కొమురం భీం! 'జల్, జంగల్, జమీన్' స్ఫూర్తి!

Kumuram Bheem History: కొమురం భీం అంటే ఓ నిప్పు కణిక. 'జల్, జంగల్, జమీన్' అనే పొలికేక. నిజాం గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గోండు వీరుడు. తెలంగాణ చరిత్రలో ఈ ఆదివాసీ బిడ్డ పోరాట గాథ ఓ మైలురాయి.

Kumuram Bheem Asifabad | కొమురం భీం అంటే ఓ నిప్పు కణిక. 'జల్, జంగల్, జమీన్' అనే పొలికేక. నిజాం గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గోండు వీరుడు. తెలంగాణ చరిత్రలో ఈ ఆదివాసీ బిడ్డ పోరాట గాథ ఓ మైలురాయి. కొమురం భీం వీరమరణం ఎందరో వీరులకు స్ఫూర్తి. అలాంటి ధైర్యవంతుడైన ఆదివాసీ నాయకుడి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

అడవిలో పుట్టిన ఎర్రని సూరీడు కొమురం భీం

కొమురం భీం గోండు తెగకు చెందిన ఆదివాసీ నాయకుడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పిడికిలి ఎత్తి ఆయన చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి. కొమురం భీం ప్రస్తుత కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (నాటి ఆదిలాబాద్)లోని సంకెపల్లి అనే మారుమూల గిరిజన ప్రాంతంలో 1901, అక్టోబర్ 22వ తేదీన జన్మించారు. తండ్రి చిన్నూ, తల్లి సోంబారు. దట్టమైన అడవులు, కొండలు, సెలయేటి పరవళ్లతో కూడిన ప్రాంతంలో గోండు గిరిజన ఆచారాలు, సంప్రదాయాల మధ్య కొమురం భీం బాల్యం గడిచింది.

బాల్యంలోనే నిజాం పాలకులపై ఆగ్రహం

కొమురం భీంకు 15 ఏళ్ల వయసులోనే తీవ్ర విషాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అటవీ సిబ్బంది గిరిజనుల మీద దాడి చేయడంతో కొమురం భీం తండ్రి చిన్నూ మరణించారు. ఈ ఘటన చిన్నవాడైన కొమురం భీంను కలిచివేసింది. నిజాం పాలకుల అణిచివేతపై ఆనాడే ఆయన మనసులో వ్యతిరేక భావం పురుడుపోసుకుంది. ఈ విషాదం తర్వాత కొమురం భీం సర్థాపూర్ అనే గ్రామానికి వలస వెళ్లారు.

కొమురం భీం పోరాటానికి మూలం మూడు కారణాలు

కొమురం భీం చిన్నతనంలో నిజాం పాలనలో అటవీ శాఖ అధికారుల దాడిలో తన తండ్రిని కోల్పోయారు. అయితే అంతటితో నిజాం పాలకుల అణిచివేత ఆగలేదు. సర్థాపూర్ అనే గ్రామానికి వలస వెళ్లినా అక్కడ కూడా ఇదే అణిచివేత పరిస్థితులను కొమురం భీం కుటుంబం ఎదుర్కొంది.

1. భూ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం - ఆ గ్రామంలో భీం కుటుంబం సాగు చేసుకుంటున్న పోడు భూమిని సిద్దిఖీ అనే జాగీర్దార్ ఆక్రమించుకోడానికి ప్రయత్నించాడు. దీంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో భీం ఆ జాగీర్దార్ సిద్ధిఖీని అడవి గొడ్డలితో హతమార్చాడు. ఈ సంఘటన నిజాం పాలనపై గిరిజనులు చేసిన తొలి సాయుధ పోరాటంగా చరిత్రలో నిలిచింది. దీంతో నిజాం పోలీసులు భీం కోసం వెతకడం ప్రారంభించడంతో ఆయన అక్కడి నుండి అస్సాంకు పారిపోయాడు. ఐదేళ్ల పాటు అక్కడే ఉండి ఆయుధ శిక్షణ తీసుకున్నాడు, రాజకీయ చైతన్యాన్ని సముపార్జించుకుని తిరిగి ఆదివాసీల హక్కుల కోసం పోరాడేందుకు సర్థాపూర్, కెరిమెరి ప్రాంతానికి తిరిగి వచ్చారు.

2. నిజాం పాలనలో 'పట్టి' (పన్నులు) దోపిడీ - ఆనాడు నిజాం ప్రభుత్వం గిరిజనులకు జీవనోపాధి ఇచ్చే ప్రతీ దానిపై పన్నులు ('పట్టి') విధించేది. పశువుల కాపరులపైన, అటవీ ఉత్పత్తులపైన, పోడు వ్యవసాయంపై భారీగా పన్నులు వసూలు చేసేవారు. పన్నులు కట్టకపోతే వారిని క్రూరంగా హింసించడం, దౌర్జన్యానికి దిగడం సర్వసాధారణం. అటవీ అధికారులు పన్నులు కట్టని వారి పిల్లల చేతిని కోయడం వంటి క్రూరత్వం భీంకు కోపాన్ని తెప్పించింది.

నిజాం ప్రభుత్వం గిరిజనుల జీవనాధారమైన ప్రతి అంశంపై అధిక పన్నులు ('పట్టి') విధించేది. పశువుల కాపర్లపై, అటవీ ఉత్పత్తులపై, చివరికి పోడు వ్యవసాయంపై కూడా భారీగా సుంకాలు వసూలు చేసేవారు. పన్నులు కట్టలేని వారిపై దౌర్జన్యాలు చేయడం, అటవీ అధికారులు పిల్లల చేతివేళ్లు కోసేయడం వంటి క్రూరత్వం భీంకు కోపాన్ని తెప్పించాయి.

3. 'జల్-జంగల్-జమీన్' - అస్తిత్వ పోరాటం అయితే ఈ పరిస్థితి మారాలంటే భూ ఆక్రమణలు, పన్నులకు వ్యతిరేకంగా పోరాటం మాత్రమే సరిపోదని కొమురం భీం అర్థం చేసుకున్నారు. దాంతో 'జల్ - జంగల్ - జమీన్' అనే నినాదం ఎత్తుకున్నారు. అస్తిత్వం, స్వయం పాలన కోసమే పోరాటం చేపట్టాలని నిర్ణయించారు. 'జల్' - అంటే మా నీరు, 'జంగల్' - మా అడవి, 'జమీన్' - మా భూమి. దీనిపై నిజాం పాలకులకు ఎలాంటి అధికారం లేదని, మా గూడెంలో - మా పాలన అంటూ పోరు బాట పట్టారు. జోడేఘాట్ కేంద్రంగా సుమారు 12 గూడేలలో కొమురం భీం స్వయం పాలన ప్రారంభించడం జరిగింది.

కుట్రకు బలై వీరమరణం పొందిన కొమురం భీం

స్వయం పాలన కోసం పిడికిలి ఎత్తిన కొమురం భీం గిరిజనులతో కలిసి పోరాడారు. తిరుగుబాటు ఉధృతమవుతుండటంతో నిజాం పాలకులు హైదరాబాద్ నుండి సాయుధ దళాలను పంపారు. వారిపై తనదైన గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో భీం పోరాటం జరిపారు. అయితే నమ్మకస్తుడైన కుర్దు పటేల్ అనే స్వంత అనుచరుడు నిజాం సైన్యానికి భీం స్థావరాన్ని చెప్పడంతో సైన్యం చుట్టుముట్టింది. 1940, అక్టోబర్ 27వ తేదీన ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి తిథి రోజున నిజాం సైన్యం జోడేఘాట్ అడవుల్లోని భీం స్థావరాన్ని అర్ధరాత్రి చుట్టుముట్టింది. ఈ పోరాటంలో నిజాం సైన్యం తుపాకీ కాల్పుల్లో భీం, ఆయన అనుచరులు తీవ్రంగా పోరాడి వీరమరణం పొందారు. అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం మరణించినా ఆయన నినాదం 'జల్ - జంగల్ - జమీన్' నేటికీ మారుమోగుతోంది. ఆదివాసీ హక్కులకు, అస్తిత్వ పోరాటాలకే కాదు, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, రైతు ఉద్యమాల్లోనూ, చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ ఈ నినాదం చోటు చేసుకుంది. ఇది మరచిపోని వీరుడి చరిత్రకు నిదర్శనం.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Maoist Surrender Rehabilitation 2025: లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
Andhra Pradesh Deputy CM Pawan Kalyan : మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
Advertisement

వీడియోలు

India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ
India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ
Womens World Cup 2025 | England vs South Africa | ప్రపంచకప్ ఫైనల్‌కు సఫారీలు
Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Maoist Surrender Rehabilitation 2025: లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
Andhra Pradesh Deputy CM Pawan Kalyan : మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
Baahubali The Epic Review : 'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
TTD Adulterated Ghee Case: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌ను వదలని వానలు- 11 జిల్లాలకు రెడ్ అలర్ట్‌- తుపాను నష్ట అంచనాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ను వదలని వానలు- 11 జిల్లాలకు రెడ్ అలర్ట్‌- తుపాను నష్ట అంచనాలు ప్రారంభం
SSMB29 Update : SSMB29... మహేష్ బాబు న్యూ లుక్ - రాజమౌళి సార్... ఆ రోజు కోసం వెయిటింగ్
SSMB29... మహేష్ బాబు న్యూ లుక్ - రాజమౌళి సార్... ఆ రోజు కోసం వెయిటింగ్
Embed widget