Revanth Reddy New Year Wishes: కొత్త ఏడాది ‘రైతు - మహిళ - యువత నామ సంవత్సరం’ గా సంకల్పం: రేవంత్ రెడ్డి
New Year Wishes In Telugu: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది రైతు - మహిళ - యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని చెప్పారు.

Revanth Reddy New Year 2024 Wishes: హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) నూతన సంవత్సర శుభాకాంక్షలు (New Year 2024 Wishes) తెలిపారు. ఈ నూతన సంవత్సరం ‘రైతు - మహిళ - యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించి, పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామన్నారు రేవంత్. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నామని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. ఆరింటిలో రెండు గ్యారెంటీలు (Congress Guarantees) అమలు చేశామని చెప్పారు. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉండాలని పేర్కొన్నారు.
ఇది రైతు - మహిళ - యువత నామ సంవత్సరం..
ఈ నూతన సంవత్సరం ‘రైతు - మహిళ - యువత నామ సంవత్సరం’ గా తెలంగాణ ప్రభుత్వం సంకల్పం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలనలో స్తంభించినపోయిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సంకల్పించాం అన్నారు. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందన్నారు. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
యువత భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన..
‘యువత భవిత మాకు ప్రాధాన్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి... వారి భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. తర్వలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతి పై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టామని’ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు
‘పదేళ్లుగా ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు ఎదురు చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయి. అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళం అవసరం లేదు. ఇది గత పాలన కాదు... జన పాలన. ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయని’ రేవంత్ రెడ్డి వివరించారు.
అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని.. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం.. జర్నలిస్టుల సంక్షేమం పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. త్వరలో వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణగా... కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా... అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తూ... రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర ఆకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షించారు.
Before You Go
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
ట్రెండింగ్ వార్తలు






















