అన్వేషించండి

Revant Reddy : వనదేవతల స్ఫూర్తిగా కేసీఆర్ పై పోరాటం - పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి !

వన దేవతల స్ఫూర్తిగా కేసీఆర్ పై పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.


Revant Reddy :    ప్రకృతి దేవతలు అయిన సమ్మక్క-సరక్క స్పూర్తితో పోరాటం చేస్తున్నామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.  నాడు తమ హక్కుల కోసం వనదేవతలు పోరాటం చేస్తే నేడు పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.  భార‌త్ జోడో యాత్ర‌కి కొన‌సాగింపుగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాద‌యాత్ర‌ని ములుగు నుంచి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.  9 ఏండ్లలో KCR ప్రభుత్వం 25 లక్షల కోట్ల బడ్జెడ్ పెడితే 119 నియోజకవర్గలలో ఎంత ఖర్చు చేశారు ఎంత దొంగల పరం అయిందో చెప్పాలని డిమాండ్ . కేసీఆర్  డబ్బులను నమ్ముకున్నాడని, తాము ప్రజలను నమ్ముకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.  ప్రజా ఆలోచనలకు అనుగులంగా కాంగ్రెస్ ఉంది,పార్టీ నేతలందరిని కలుపుకొని యాత్ర కొనసాగిస్తామన్నారు.  

మేడారం వన దేవతల్ని దర్శించుకుని పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి 
 
హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాద‌యాత్ర‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ములుగు నుంచి శ్రీకారం చుట్టారు .. పాదయాత్ర కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్న రేవంత్ రెడ్డికి కూతురు నైమిష హారతి ఇచ్చారు. అనంత‌రం ఆయ‌న కాన్వ‌య్ తో ములుగు చేరుకున్నారు… గ‌జ‌మాల‌తో కార్య‌క‌ర్త‌లు రేవంత్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అంతకు ముందు సమ్మక్క సారలమ్మ మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తున్న రేవంత్ రెడ్డి జనగామ జిల్లా నెల్లుట్ల బ్రిడ్జి వద్ద 400 మంది కార్యకర్తలతో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు .  హాత్ సే హాత్ అభియాన్ జోడయాత్ర కు తెలంగాణలో సంపూర్ణ మద్దతు లభిస్తుందని అన్నారు .ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు . 

రెండు నెలల పాటు కొనసాగనున్న పాదయాత్ర 

అనంత‌రం ఆయ‌న‌ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె వద్దకు రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు..అక్క‌డ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించారు.. పాద‌యాత్ర‌ కొత్తూరు, నార్లాపూర్‌ మీదుగా ప్రాజెక్ట్‌నగర్‌కు చేరుకుంది.  మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది రోజులపాటు సాగే యాత్రలో తాను పాల్గొంటున్నారు. జోడో యాత్ర.. ఈ నెల 22 వరకు కొనసాగుతుంది.  24 నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఏఐసీసీ ప్లీనరీ జరగనుంది. అందులో పాల్గొనడానికి  యాత్రకు విరామం ఇస్తారు. తర్వాత  మళ్లీ కొనసాగుతుంది.  మొత్తం రెండు నెలల పాటు ఈ యాత్రలు కొనసాగుతాయని కాంగ్రెస్ వర్గాలు  చెబుతున్నాయి. 

సీనియర్ నేతలు కూడా పాదయాత్ర ! 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తదితర ముఖ్యనేతలు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఈ పాదయాత్రను చేస్తారు.  రాహుల్‌ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చేందుకే ఏఐసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిందని, పార్టీ నాయకులంతా దీన్ని సమన్వయంతో అమలు పరచాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ థాక్రే పిలుపునిచ్చారు.  పాదయాత్ర విషయంలో సీనియర్ నేతలకూ థాక్రే స్వేచ్చ ఇచ్చారు.  యాభై, అరవై నియోజకవర్గాల్లో రేవంత్ పాదయాత్ర చేస్తారు. మిగిలిన నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు చేస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
IPL 2025 RR vs RCB: జైస్వాల్ హాఫ్ సెంచరీ, రాణించిన జురెల్- ఆర్సీబీకి మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్
జైస్వాల్ హాఫ్ సెంచరీ, రాణించిన జురెల్- ఆర్సీబీకి మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
SS Rajamouli: ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Travis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP DesamAbhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
IPL 2025 RR vs RCB: జైస్వాల్ హాఫ్ సెంచరీ, రాణించిన జురెల్- ఆర్సీబీకి మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్
జైస్వాల్ హాఫ్ సెంచరీ, రాణించిన జురెల్- ఆర్సీబీకి మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
SS Rajamouli: ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
Bhu Bharati Act: భూభార‌తి చట్టం, పోర్ట‌ల్ 14న‌ జాతికి అంకితం, ధ‌ర‌ణి భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌: పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
Bhu Bharati Act: భూభార‌తి చట్టం, పోర్ట‌ల్ 14న‌ జాతికి అంకితం, ధ‌ర‌ణి భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌: పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
Anakapalli News: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ఎనిమిది మంది మృతి- అనకాపల్లి జిల్లాలో ఘటన
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ఎనిమిది మంది మృతి- అనకాపల్లి జిల్లాలో ఘటన
Manchu Lakshmi: మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పండి- మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పండి- మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Embed widget