అన్వేషించండి

Raja Singh: బీజేపీకి రాజా సింగ్ రాజీనామా - పార్టీ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో అసంతృప్తి

Telangana BJP: బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా రాజాసింగ్ ప్రకటించారు. అధ్యక్ష పదవిని ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Raja Singh announces resignation from BJP: తెలంగాణ బీజేపీకి రాజాసింగ్ రాజీనామా ప్రకటించారు. అధ్యక్ష పదవి కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. పట్టించుకోకపోవడంతో రాజీనామాకు సిద్ధమయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును హైకమాండ్ ప్రకటించింది. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజాసింగ్ తెలిపారు. రాజీనామా లేఖలను కిషన్ రెడ్డికి ఇచ్చానన్నారు. పార్టీ సింబల్ పై గెలిచినందున రాజీనామా లేఖ కిషన్ రెడ్డికి ఇచ్చానని ఆయన స్పీకర్ పంపాలన్నారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అని రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం సర్వం త్యాగం చేశానని.. టెర్రరిస్టులకు టార్గెట్ అయ్యానన్నారు. బీజేపీకి రాజీనామా చేసినా హిందూత్వం కోసం పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడుతున్నామన్నారు.  బీజేపీ అధికారంలోకి రావొద్దనేవారు పార్టీలో ఎక్కువగా ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు నామినే,న్ వేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని రాజాసింగ్ ఆరోపించారు. అధికారికంగా రామచంద్రరావు పేరు ప్రకటించక ముందు కూడా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే బీజేపీకే తీవ్ర నష్టం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి. అయితే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. కానీ పార్టీ పట్టించుకోకపోడంతో రాజీనామా చేశారు. 

హిందత్వ వాదంలో ఘాటైన వాదన వినిపించే రాజాసింగ్ పాతబస్తీలో మజ్లిస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. గోషామహల్ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టింది. మైనార్టీలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలు చేపట్టారని ఆయనపై  కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో బీజేపీ కూడా సస్పెండ్ చేసింది.జైలు నుంచి విడుదలైన తర్వాత..ఎన్నికల అభ్యర్థిగా ఖరారు చేసే ముందే.. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేశారు. 

ఇటీవలి కాలంలో రాజాసింగ్ తెలంగాణ బీజేపీ నాయకత్వంపై, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వంటి సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని, పార్టీని "అమ్ముకుంటున్నారని" ఆయన ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో పారదర్శకత లేదని, కొందరు నాయకులు తమ గ్రూప్‌లను ఏర్పాటు చేసుకుని పార్టీకి నష్టం కలిగిస్తున్నారని  ఆరోపిస్తున్నారు.                                          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget