అన్వేషించండి

Modi On KCR : ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారా ? నిజామాబాద్ సభలో కీలక విషయాలు వెల్లడించిన మోదీ !

నిజామాబాద్ సభలో కేసీఆర్‌ గురించి ప్రధాని మోదీ కీలక విషయాలు వెల్లడించారు. కేసీఆర్ ఎన్డీఏలో చేరేందుకు వస్తే తాము చేర్చుకునేది లేదని చెప్పామన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు.


Modi On KCR :  భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నించారని కానీ తాము చేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్ బహిరంగసభలో ప్రకటించారు. గతంలో లేని విధంగా నిజామాబాద్ సభలో  ప్రధాని మోదీ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. అందులో కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

గ్రేటర్ మేయర్ పీఠం ఇస్తామని కేసీఆర్ ఫర్ 

 గ్రేటర్ ఎన్నికలు ముగిన తర్వాత రోజే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఎందుకు వెళ్లారో తెలియదు కానీ.. ఆ రోజున కేసఆర్ తనతో ఏం మాట్లాడారో మోదీ  చెప్పారు. ఎన్డీఏలో చేరుతామని..  గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం ఇస్తామని కేసీఆర్ ప్రతిపాదన పెట్టారని మోదీ చెప్పారు. అయితే ఎన్డీఏలో చేర్చుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పామని  మోదీ స్పష్టం చేశారు.  ప్రతిపక్షంలో అయినా కూర్చుకుంటాము కానీ బీఆర్ఎస్‌తో కలిసేది లేదని చెప్పి పంపిచామని మోదీ నిజామాబాద్ సభలో ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో 56 సీట్లతో బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది.  48 స్థానాల్లోబీజేపీ రెండో స్థానంలో నిలిచింది.  మేయర్ పీఠం కోసం అవసరమైన సీట్లు ఎవరికీ రాలేదు. 

కేటీఆర్‌ను సీఎం చేస్తానంటే మోదీ ఏమన్నారంటే ? 

ఆ తర్వాత  కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వచ్చి తాను చాలా చేసానని.. ఇక తన  కుమారుడు కేటీఆర్‌కు బాధ్యతలు  ఇస్తానని.. సహకరించాలని కోరారన్నారు. అయితే తాను మీరేమైనా రాజులా అని ప్రశ్నించాననని మోదీ తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పానన్నారు. అప్పుడే కేసీఆర్ అవినీతి  చిట్టా అంతా తాను చెప్పానన్నారు. అప్పట్నుంచి కేసీఆర్ తనను కలవడం మానేశారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు వరకూ తాను వస్తే.. స్వాగతం చెప్పేందుకు కేసీఆర్ వచ్చే వారని.. ఆ తర్వాత నుంచి మొహం చాటేస్తున్నారని మోదీ తెలిపారు. తన కళ్లలోకి చూడటానికి కేసీఆర్ భయపడుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. 

తెలంగాణను దోచుకున్న కేసీఆర్ ఫ్యామిలీ 

ఎంతో మంది బలిదానాలతో వచ్చిన  తెలంగాణను ఓ కుటంబం దోచుకుంటోందని మోదీ  మండపడ్డారు. తెలంగాణ తరహాలో డబ్బులు  వెదజల్లి గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్,  బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. కర్ణాటకలో  కాంగ్రెస్‌కు బీఆర్ఎస్సే డబ్బులు పంపిందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందని కుటుంబసభ్యులందరూ దోపిడీ చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. తనపై నమ్మకం ఉంచి.. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వారని.  కేసీఆర్ కుటుంబం దోచుకున్నదంతా కక్కిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ , ఆయన కమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనవంతులయ్యారని  మోదీ విమర్శించారు.  తెలంగాణ ప్రభుత్వం అలయాల సొమ్మునూ దోచుకుంటుందోని విమర్శించారు. 

కేసీఆర్ స్పందిస్తారా ? 

తెలంగాణ రాజకీయాల్లో  ప్రదాని మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోది చెప్పినట్లుగా  కేసీఆర్ .. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతి రోజే ప్రధానితో భేటీ అయ్యారు. ఆ తర్వాక కేటీఆర్‌ను సీఎం చేసేందుకు ముహుర్తం ఖరారు చేశారని చాలా సార్లు ప్రచారం జరిగింది. మోదీ.. కేసీఆర్ తనతో చర్చించిన విషయాలనే నిజామాబాద్ బహిరంగసభలో చెప్పారు. వీటిపై బీఆర్ఎస్ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.  నేరుగా కేసీఆర్ తో జరిగిన భేటీల సమాచారమే  మోదీ  బయట పెట్టినందున కేసీఆర్ స్పందిస్తారని రాజకీయవర్గాలు ఎదురు చూస్తున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget