అన్వేషించండి

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇండ్ల పథకం దరఖాస్తుదారుల వివరాలను సరిగ్గా నమోదు చేయాలని, పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

Telangana News | నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో దరఖాస్తుదారుల వివరాలను పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. హైదరాబాద్ లోని సచివాలయం నుండి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, టి.జి.పి.ఎస్.సి. చైర్మన్ బుర్ర వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, గ్రూప్-2, డైట్ చార్జీల పెంపు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఇందిరమ్మ ఇండ్ల యాప్ ప్రారంభం

ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 లక్షల దరఖాస్తులు అందాయని, ఈ దరఖాస్తులకు సంబంధించి సర్వే నిర్వహించి, ఇందులో దరఖాస్తుదారుల పూర్తి వివరాలను యాప్ లో నమోదు చేసి అర్హత గల వారికి ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి 500 ఇండ్లకు ఒక సర్వేయర్ ను కేటాయించడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలిసి ప్రతి రోజు కనీసం 25 ఇండ్ల చొప్పున 20 రోజుల లోగా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని, సర్వే నిర్వహించే ప్రాంతాలలో ఒక రోజు ముందుగా ప్రజలందరికీ తెలిసేలా టాం-టాం నిర్వహించాలని తెలిపారు. యాప్ వినియోగంపై సర్వేయర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.


Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

సర్వే నిర్వహణపై దరఖాస్తుదారులకు అనుమానాల నివృత్తి కొరకు టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. యాప్ లో దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేసేలా శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు ఈ నెల 14వ తేదీ నుండి 40 శాతం పెంచిన డైట్ చార్జీలు అమలు చేయడం జరుగుతుందని, కార్యక్రమం ప్రారంభోత్సవం రోజున విద్యార్థుల తల్లిదండ్రులను కార్యక్రమానికి ఆహ్వానించాలని, ముఖ్యంగా తల్లులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాణ్యమైన ఆహారం అందించేలా సిబ్బందికి అవగాహన కల్పించాలని తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతుందని, ఇప్పటి వరకు 99.9 శాతం పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 2 రోజులలో పూర్తి చేయాలని, సర్వే వివరాలు అందని ప్రముఖులను గుర్తించి వివరాలు సేకరించాలని, సర్వేకు సంబంధించి వివరాలు అందించని వారి దరఖాస్తులను ప్రజాపాలన సేవా కేంద్రాలలో స్వీకరించి పరిశీలించాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగం సేవలు అభినందనీయమని అన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు

ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని టి.జి.పి.ఎస్.సి. చైర్మన్ బుర్ర వెంకటేశం అన్నారు. ఈ క్రమంలో ఈ నెల 15, 16 తేదీలలో జరుగనున్న గ్రూప్-2 పరీక్ష కొరకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,51,943 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఈసారి పరీక్షలలో ప్రతి అభ్యర్థికి వారి వివరాలతో ఓ.ఎం.ఆర్. షీట్ అందించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాలలో అభ్యర్థుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడంతో పాటు రవాణా, వైద్య సేవలు, నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీరు ఇతర వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రంలోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ 3 కిలోమీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు.

గ్రూప్-2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఇతర అధికారులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్-2 పరీక్ష కొరకు జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడం జరిగిందని, పోలీసు బందోబస్తు, రవాణా ఇతర వసతులపై ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష నిర్వహణ కొరకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 14 మండలాలు, 2 మున్సిపాలిటీల నుండి 1,51,712 ప్రజా పాలన దరఖాస్తులు రాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: KTR Letter To Rahul Gandhi: బీఆర్ఎస్ తలుచుకుంటే ఇందిరా, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉండేవా? రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget