అన్వేషించండి

Ramoji Rao: 'రామోజీరావుకు పద్మవిభూషణ్ మాకు గర్వకారణం' - మీడియా దిగ్గజానికి ప్రత్యేక వ్యాసంతో ప్రధాని మోదీ నివాళి

PM Modi: మీడియా మొఘల్ రామోజీరావుకు.. ప్రదాని మోదీ ప్రత్యేక వ్యాసంతో నివాళి అర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. రామోజీరావు గొప్పతనాన్ని అభివర్ణించారు.

PM Modi Special Essay On Media Moghal Ramoji Rao: మీడియా దిగ్గజం రామోజీరావు (RamojiRao) అస్తమయం అంతటా తీవ్ర విషాదం నింపింది. ఆయన మరణం పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఫిలింసిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. రామోజీరావు మరణం పట్ల ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు నివాళి అర్పిస్తూ ఓ ప్రత్యేక వ్యాసం రాశారు. 

మోదీ ఏమన్నారంటే.?

'గడిచిన కొద్దివారాలు రాజకీయ నేతలకు, మీడియాకు తీరికలేకుండా గడిచాయి. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో మేం నిమగ్నమై ఉన్న వేళ నాకు ఓ విషాద వార్త.. రామోజీరావు ఇక లేరని తెలిసింది. మా మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వ్యక్తిగతంగా ఇది నాకు తీవ్ర నష్టం. రామోజీరావు గురించి ఆలోచించగానే నా మనసులో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి మెదిలారు. ఆయనకు ఆయనే సాటి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన భిన్న రంగాల్లో అద్భుతంగా రాణించారు. సినిమాలు, వినోదం, మీడియా, వ్యవసాయం, విద్య, పాలనపై తనదైన ముద్ర వేశారు. అయినా జీవితపర్యంతం ఆయనలో వినమ్రత సడలలేదు. అలాగే మూలాలను ఎన్నడూ విస్మరించలేదు. ఈ గొప్ప లక్షణాలే ఆయనను అనేక మందికి ఆత్మీయుడిని చేశాయి.' అని మోదీ తన వ్యాసంలో పేర్కొన్నారు.

'విప్లవాత్మక మార్పులు'

'మీడియా రంగంలో రామోజీరావు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నిబద్ధత, నవ్యత, అసమాన పనితీరు వంటి అంశాల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. పత్రికలే ప్రధాన వార్తా వనరుగా ఉన్న కాలంలో ‘ఈనాడు’ దినపత్రికను స్థాపించారు. 1990లలో భారత్‌లో టీవీల సందడి ప్రారంభం కాగానే ఈటీవీతో ఆయన తనదైన ముద్రవేశారు. తెలుగుతోపాటు ఇతర భాషా ఛానళ్లనూ ప్రారంభించడం ద్వారా ‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. విద్య, వ్యాపార, సామాజిక అంశాలపైనా ప్రభావం చూపాయి. ప్రజాస్వామ్య సూత్రాల పట్ల ఆయనకు అచంచల విశ్వాసం ఉంది. 1980లలో.. మహా నాయకుడు ఎన్టీఆర్‌ను కాంగ్రెస్‌ వేధించి, ఆయన ప్రభుత్వాన్ని అన్యాయంగా కూలదోసినప్పుడు రామోజీరావు అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. ఆ సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నాయి. అయినా రామోజీరావు వెనకడుగు వేయలేదు. అప్రజాస్వామిక పోకడలను దృఢంగా ఎదుర్కొన్నారు.' అని మోదీ ప్రశంసించారు.

'నెరవేరిన మహాత్ముని కల' 

'రామోజీరావుతో ముచ్చటించి, ఆయనకున్న అపార జ్ఞానంతో ప్రయోజనం పొందే అవకాశాలు నాకు అనేకసార్లు వచ్చాయి. వివిధ అంశాలపై ఆయనకున్న అభిప్రాయాలకు నేను ఎనలేని విలువనిచ్చా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన వద్ద విలువైన సలహాలు తీసుకునేవాడిని. ముఖ్యంగా వ్యవసాయం, విద్యపై ఎక్కువ దృష్టిపెట్టేవారు. ఆయన నుంచి ఎప్పుడూ తిరుగులేని ప్రోత్సాహం, మద్దతు లభించేది. ఎప్పుడూ నా యోగక్షేమాల గురించి ఆరా తీసేవారు. మేం ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు గట్టి మద్దతుదారుగా నిలిచారు. వ్యక్తిగతంగాను, తన మీడియా నెట్‌వర్క్‌ ద్వారానూ ఆయన తోడ్పాటు అందించారు. రామోజీరావు వంటి దిగ్గజాల సాయం వల్లే.. మహాత్మా గాంధీ కలను రికార్డు సమయంలో నెరవేర్చగలిగాం.' అని మోదీ వ్యాసంలో వివరించారు.  

'రామోజీరావుకు పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందించింది మా ప్రభుత్వమే కావడం మాకు గర్వకారణం. ఆయనలోని ధైర్యసాహసాలు, ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం, అంకితభావం వంటి గొప్ప లక్షణాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. అవరోధాలను అవకాశాలుగా, సవాళ్లను విజయాలుగా, వైఫల్యాలను గెలుపునకు  పునాదులుగా ఎలా మలచుకోవాలో ఆయన జీవితం నుంచి యువతరం నేర్చుకోవచ్చు. కొన్నిరోజులుగా రామోజీరావు అస్వస్థులుగా ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీసేవాడిని. ఇటు కేంద్రంలో, అటు ఏపీలో నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పడటం చూసి ఆయన సంతోషించి ఉండేవారు. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. రామోజీరావు ఎప్పటికీ ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతారు.' అని ప్రధాని మోదీ తన వ్యాసంలో రామోజీరావు గొప్పతనాన్ని వర్ణించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
BRS vs Congress: రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget