అన్వేషించండి

Paddy Procurement: ధాన్యం కొనకపోతే కొట్లాడుడే, కేంద్రంపై దండయాత్రకు కేసీఆర్ సిద్ధం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

Paddy Procurement Telangana: రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కొట్లాట తప్పదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Telangana Minister Puvvada Ajay Kumar) స్పష్టం చేశారు.

Paddy Procurement Telangana: మేకులు దించారు, తూటాలు పేల్చారు, భాష్ప వాయువు సైతం కేంద్ర ప్రభుత్వం రైతులపై ప్రయోగించిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తుచేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కొట్లాట తప్పదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Telangana Minister Puvvada Ajay Kumar) స్పష్టం చేశారు. అన్నదాతల జీవన్మరణ సమస్యగా మారిన ధాన్యం కొనుగోలుకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో ఉద్యమానికి పూనుకున్నారని తెలిపారు. సోమవారం ఖమ్మం నియోజకవర్గంలోని మంచుకొండ గ్రామంలో జరిగిన రైతు నిరసన దీక్షలో మంత్రి పాల్గొన్నారు.

ఢిల్లీపై దండయాత్రకు కేసీఆర్ రెఢీ  
తెలంగాణ రైతుల ప్రయోజనం కోసం ఢిల్లీపై సీఎం కేసిఆర్ దండయాత్ర (KCR will fight againt Central Govt) చేసేందుకు సిద్ధమయ్యారని.. నాడు తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమనేతగా సమైక్య రాష్ట్రంలో కర్షకుల ఆత్మహత్యలను కండ్లారా చూసి కేసీఆర్ చలించిపోయారన్నారు. నేడు ఆ దుస్థితి నుంచి బయట పడేసేందుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడమే కాదు, రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత నాణ్యమైన కరెంట్‌ ఎన్నో పథకాలతో ఏడేళ్ల కాలంలోనే తెలంగాణను దేశానికే అన్నం పెట్టే స్థితికి తీసుకొచ్చారని కేసీఆర్‌ను ప్రశంసించారు.

కేంద్రం కక్ష సాధింపు ధోరణి 
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ నాయకులు తలా తోకా లేకుండా మాట్లాడుతుండగా, కేంద్రం రోజుకో కొర్రీ పెడుతూ ప్రస్తుత యాసంగి వడ్ల కొనుగోలుపై దాటవేస్తూ వివక్ష చూపుతున్నదన్నారు. దీనిపై తాడోపేడో తేల్చకపోతే అన్నదాతలు మరింత నష్టపోయే ప్రమాదమున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న పోరుబాటకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు సీఎం వెంట ఉంటారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మొత్తం బియ్యాన్ని కొంటామని మొదట్లో చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆపై రాష్ట్రం నుంచి వచ్చే దిగుమతిని చూసి మాట మార్చిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 

కేంద్రం వరి కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ శ్రేణుల పోరుబాట
Telangana Farmers and TRS Leaders Protest:  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో మండల కేంద్రాల్లో రైతులు, టీఆర్ఎస్ నేతలు నిరసన దీక్షలు చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలో ఢిల్లీలో తమ గళాన్ని వినిపిస్తున్నారు. కేంద్రం దిగొచ్చి.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Drugs in Hyderabad Pub: పబ్‌లో డ్రగ్స్ - ఇప్పుడే సినిమాల్లో ఎదుగుతున్నాం, బద్నాం చేయవద్దు: జూనియర్ ఆర్టిస్ట్ ఆవేదన

Also Read: Bhadrachalam: భద్రాద్రి రాముడి చుట్టూ రాజకీయ గలాటా, అమిత్‌షా వస్తారా? కేసీఆర్‌ అవి తెస్తారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Puthalapattu Assembly Constituency: పూతలపట్టులో ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ.. పట్టు సాధించేదెవరు..?
పూతలపట్టులో ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ.. పట్టు సాధించేదెవరు..?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Rohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Puthalapattu Assembly Constituency: పూతలపట్టులో ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ.. పట్టు సాధించేదెవరు..?
పూతలపట్టులో ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ.. పట్టు సాధించేదెవరు..?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Hardik Pandya Fitness: పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
My Dear Donga Movie Review - మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
Embed widget