అన్వేషించండి

Paddy Procurement: ధాన్యం కొనకపోతే కొట్లాడుడే, కేంద్రంపై దండయాత్రకు కేసీఆర్ సిద్ధం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

Paddy Procurement Telangana: రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కొట్లాట తప్పదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Telangana Minister Puvvada Ajay Kumar) స్పష్టం చేశారు.

Paddy Procurement Telangana: మేకులు దించారు, తూటాలు పేల్చారు, భాష్ప వాయువు సైతం కేంద్ర ప్రభుత్వం రైతులపై ప్రయోగించిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తుచేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కొట్లాట తప్పదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Telangana Minister Puvvada Ajay Kumar) స్పష్టం చేశారు. అన్నదాతల జీవన్మరణ సమస్యగా మారిన ధాన్యం కొనుగోలుకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో ఉద్యమానికి పూనుకున్నారని తెలిపారు. సోమవారం ఖమ్మం నియోజకవర్గంలోని మంచుకొండ గ్రామంలో జరిగిన రైతు నిరసన దీక్షలో మంత్రి పాల్గొన్నారు.

ఢిల్లీపై దండయాత్రకు కేసీఆర్ రెఢీ  
తెలంగాణ రైతుల ప్రయోజనం కోసం ఢిల్లీపై సీఎం కేసిఆర్ దండయాత్ర (KCR will fight againt Central Govt) చేసేందుకు సిద్ధమయ్యారని.. నాడు తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమనేతగా సమైక్య రాష్ట్రంలో కర్షకుల ఆత్మహత్యలను కండ్లారా చూసి కేసీఆర్ చలించిపోయారన్నారు. నేడు ఆ దుస్థితి నుంచి బయట పడేసేందుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడమే కాదు, రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత నాణ్యమైన కరెంట్‌ ఎన్నో పథకాలతో ఏడేళ్ల కాలంలోనే తెలంగాణను దేశానికే అన్నం పెట్టే స్థితికి తీసుకొచ్చారని కేసీఆర్‌ను ప్రశంసించారు.

కేంద్రం కక్ష సాధింపు ధోరణి 
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ నాయకులు తలా తోకా లేకుండా మాట్లాడుతుండగా, కేంద్రం రోజుకో కొర్రీ పెడుతూ ప్రస్తుత యాసంగి వడ్ల కొనుగోలుపై దాటవేస్తూ వివక్ష చూపుతున్నదన్నారు. దీనిపై తాడోపేడో తేల్చకపోతే అన్నదాతలు మరింత నష్టపోయే ప్రమాదమున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న పోరుబాటకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు సీఎం వెంట ఉంటారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మొత్తం బియ్యాన్ని కొంటామని మొదట్లో చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆపై రాష్ట్రం నుంచి వచ్చే దిగుమతిని చూసి మాట మార్చిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 

కేంద్రం వరి కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ శ్రేణుల పోరుబాట
Telangana Farmers and TRS Leaders Protest:  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో మండల కేంద్రాల్లో రైతులు, టీఆర్ఎస్ నేతలు నిరసన దీక్షలు చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలో ఢిల్లీలో తమ గళాన్ని వినిపిస్తున్నారు. కేంద్రం దిగొచ్చి.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Drugs in Hyderabad Pub: పబ్‌లో డ్రగ్స్ - ఇప్పుడే సినిమాల్లో ఎదుగుతున్నాం, బద్నాం చేయవద్దు: జూనియర్ ఆర్టిస్ట్ ఆవేదన

Also Read: Bhadrachalam: భద్రాద్రి రాముడి చుట్టూ రాజకీయ గలాటా, అమిత్‌షా వస్తారా? కేసీఆర్‌ అవి తెస్తారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget