అన్వేషించండి

YS Sharmila: బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు, మేల్కొండి దొర అంటూ కేసీఆర్ పై షర్మిల ఫైర్

Students Suicide at Basara IIIT : ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. బంధిపోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila About Students Suicide at Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. బంధిపోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో కేవలం 3, 4 నెలల వ్యవధిలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయినా సీఎం కేసీఆర్ ఏ పట్టింపు లేదన్నారు. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్యలపై దర్యాప్తు కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ట్రిపుల్ ఐటీలో సీటు కోసం విద్యార్థులు పోటీ పడ్డారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్ల పేద బిడ్డలకు ఉన్నత విద్య అందకపోగా ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అందుకే ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో సీటు కోసం విద్యార్థులు అప్లై చేసుకోవడం కూడా మానేశారని చెప్పారు. ఉన్నత విద్యకు నిలయాలైన ట్రిపుల్ ఐటీలను.. ఆత్మహత్యలకు నిలయంగా మార్చిన ఘనత కేసీఆర్ సొంతమన్నారు.

గొప్ప ఆశయాలతో వచ్చిన పేద విద్యార్థులకు పురుగుల అన్నం, మురుగు నీరు పెట్టి ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సిబ్బంది నియమాలను మరిచారు.. క్యాంపస్ ల నిర్వహణను గాలికొదిలేశారని, నిధుల కేటాయింపులను గంగలో కలిపేశారంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. సర్కారు నియమించిన డైరెక్టర్లు కేసీఆర్ లాగే డుమ్మాలు కొడుతున్నారని, ఇన్ చార్జి అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పబ్బం గడుపుతున్నారని చెప్పారు. . 

తండ్రీకొడుకుల ఊదరగొట్టే మాటలు..
తండ్రీకొడుకులు కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆరు నెలల కింద ఊదరగొట్టే మాటలు మాట్లాడారని, మరునాడే పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఫొటోలకు ఫోజులిచ్చిన మంత్రులు.. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేద బిడ్డలకు ఉన్నత విద్య అందించాలని వైయస్ఆర్ ట్రిపుల్ ఐటీలను స్థాపిస్తే.. కేసీఆర్ మాత్రం ట్రిపుల్ ఐటీలపై నమ్మకమే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. మరో విద్యార్థి ప్రాణం పోకముందే తెలంగాణ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్యలపై దర్యాప్తు కమిటీ నియమించాలని కోరారు.

బాసర ట్రిపుల్ ఐటీలో ఉరేసుకున్న మరో విద్యార్థి, ఆగని వరుస మరణాలు!
ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో మొన్న జరిగిన విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే మంగళవారం పీయూసీ - 1 విద్యార్థి జాదవ్ బబ్లూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. వెంటనే సిబ్బంది భైంసాలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే చనిపోయాడని వైద్యులు తేల్చారు. ఇక అక్కడి నుండి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీలో పీయూసీ చదువుతున్న విద్యార్థిని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన బబ్లూ అని గుర్తించారు. నిర్మల్ ఆసుపత్రికి తరలించాక స్థానిక రాజకీయ నేతలను, ఇతర నాయకులను ఎవరినీ లోనికి రానీయకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
Bihar Youth: ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
Bihar Youth: ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
Allu Arjun vs Siddharth: హీరో సిద్ధార్థ్‌కి మళ్లీ చుక్కలే.. ఇప్పుడప్పుడే అల్లు అర్జున్ వదిలేలా లేడుగా!
హీరో సిద్ధార్థ్‌కి మళ్లీ చుక్కలే.. ఇప్పుడప్పుడే అల్లు అర్జున్ వదిలేలా లేడుగా!
CMR College Bathroom Videos Issue: సొంగ కార్చుకుంటూ చూడాలంటూ ప్రీతి రెడ్డి  బూతులు- బాత్రూమ్ లో వీడియోలపై విచారణ: ఏబీపీతో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి
సొంగ కార్చుకుంటూ చూడాలంటూ ప్రీతి రెడ్డి బూతులు- బాత్రూమ్ లో వీడియోలపై విచారణ: ఏబీపీతో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
Go Goa Gone: టూరిస్టులు లేక బోసిపోతున్న గోవా - బోర్ కొట్టేసిందా ? కొట్టి చంపుతూంటే ఎవరైనా వెళ్తారా?
టూరిస్టులు లేక బోసిపోతున్న గోవా - బోర్ కొట్టేసిందా ? కొట్టి చంపుతూంటే ఎవరైనా వెళ్తారా?
Embed widget