అన్వేషించండి

Nizamabad News: నిజాం షుగర్స్‌ కార్మికులకు పూటగడవని దుస్థితి, ఫ్యాక్టరీ భూముల ఆక్రమించుకొని జీవనోపాధి

నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2015 లే ఆఫ్. ఏడేళ్లుగా జీతాలు, ఎక్స్ గ్రేషియా లేక రోడ్డున పడిన కార్మికులు. బకాయిలు ఇంకా ఇవ్వని యాజమాన్యం. దిక్కుతోచక ఫ్యాక్టరీ భూముల కబ్జాకు దిగుతున్నారు కార్మికులు.

నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు వెలుగు వెలిగింది. కార్మికుల పాలిట కల్పవృక్షంలా ఉండేది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయటం అంటే అనాడు ఓ వరంలా భావించేవారు. కార్మికులు, ఉద్యోగులకు సకల వసతులు ఉండేవి. కానీ ఫ్యాక్టరీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. 2015లో ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించటంతో కార్మికులు రోడ్డున పడ్డారు.

నిజాం రాజు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. 1938లో తొలిసారి షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. ఫ్యాక్టరీ ఎంతో లాభాల బాటలో పయనించింది. స్వాతంత్రం తర్వాత 1950లో ఫ్యాక్టరీని ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఫ్యాక్టరీలో వచ్చిన లాభాలతో 13 యూనిట్లను ఏర్పాటు చేశారు. షుగర్ ప్యాక్టరీ నడిపేందుకు 14 వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. సుమారుగా 6 వేల మంది కార్మికులు అప్పట్లో ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు.

మెదక్, బోధన్, మెట‌్‌పల్లిలోని ఫ్యాక్టరీలను 2002లో జాయింట్ వెంఛర్ పేరిట తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 2002 వరకు 1400 మంది పనిచేస్తుండగా బలవంతంగా 1200 మందికి వీఆర‌్ఎస్, సీఆర్ఎస్ ఇచ్చింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. కేవలం 200 మంది కార్మికులతో షుగర్ ఫ్యాక్టరీ టెకోవర్ చేసుకున్నారు. గోకరాజు గంగరాజు 51 శాతం, ప్రభుత్వం 49 శాతం జాయింట్ వెంచర్‌లో ఫ్యాక్టరీని నడిపించారు. ప్రైవేట్ యాజమాన్యం వచ్చాక ఫ్యాక్టరీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫ్యాక్టరీని టేకోవర్ చేసుకుంటామని జీవో విడుదల చేసింది. 2015లో గోకరాజు ఉన్నఫలంగా కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండునే లే ఆఫ్ ప్రకటించారు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు.

ఏడేళ్ల నుంచి ఫ్యాక్టరీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. 40 మంది కార్మికులు గుండెపోటు, అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో చనిపోయారు. ఉన్నఫలంగా ఫ్యాక్టరీకి లేఆఫ్ ప్రకటించటంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కార్మికులు న్యాయపోరాటానికి దిగారు. కేసును ప్రభుత్వం లేబర్ కోర్టుకు రిఫర్ చేసింది. గోకరాజు గంగరాజు ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మేందుకు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం అంగీకరించలేదని కార్మికులు చెబుతున్నారు. అయితే గోకరాజు నేషనల్ ఇండస్ట్రీ లా ట్రిబ్యూనల్ కు ( NCLT) అప్రోచ్ అయ్యారు. రాజకృష్ణ గుప్తను లిక్విడేటర్ గా అపాయింట్ చేసింది ఎన్ సీ ఎల్టీ. కార్మికులు చేసిన క్లైంసిని లిక్విడేటర్ రాజకృష్ణ గుప్త అంగీకరించలేదు. ఎన్సీఎల్టీలో కేసు నడుస్తున్న సమయంలో 2019లో మార్చిలో ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి చెల్లింపులు జరపాలని చూసింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తులు అమ్మొద్దని అప్పీల్ చేసింది. దీంతో దీంతో ఎన్సీఎల్టీ జడ్జిమెంట్ ఇవ్వకుండానే కేసును డిస్ మిస్ చేసింది.

ఫ్యాక్టరీ భవితవ్యాన్ని ఎటూ తేల్చకపోవటంతో కార్మికులు 7 ఏళ్ల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు రావాల్సిన జీతాలు, బెనిఫిట్స్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎందరి చుట్టు తిరిగినా ప్రయోజనం లేదని కార్మికులు వాపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఫ్యాక్టరీపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటున్నారు కార్మికులు.

200 మంది కార్మికులు 40 మంది కార్మికులు వివిధ కారణాలతో చనిపోయారు. ప్రస్తుతం దాదాపు 100 మంది కార్మికులు మిగిలారు. వారిలో కొంత మంది వయసు కుడా మీద పడింది. ఏ దిక్కు లేక కార్మికులు చిన్న చిన్న కిరాణ కొట్టులు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇంట్లో ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేక అవస్థలు పడుతున్నాంటున్నారు. కనీసం తినటానికి తిండికూడా లేదని వాపోతున్నారు. ఎంత మంది నాయకుల వద్ద తిరిగినా ప్రయోజనం లేదని భావించిన కార్మికులు చివరకు ఫ్యాక్టరీ భూములను కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో షెడ్ లాంటివి ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతామని కార్మికులు చెబుతున్నారు. ఏడేళ్లుగా తమకు రావాల్సిన ఎక్స్ గ్రేషియా. జీతాలు ఇంకా ఇవ్వలేదని అంటున్నారు. చేసేది లేకే ఫ్యాక్టరీ భూముల కబ్జాకు దిగామని చెబుతున్నారు ఫ్యాక్టరీ కార్మికులు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Bajaj Platina 100 : ఫుల్ ట్యాంక్‌లో 800 కి.మీ ప్రయాణం! కొత్త సంవత్సరంలో తక్కువ ధరకే బజాబ్‌ ప్లాటినా 100!
ఫుల్ ట్యాంక్‌లో 800 కి.మీ ప్రయాణం! కొత్త సంవత్సరంలో తక్కువ ధరకే బజాబ్‌ ప్లాటినా 100!
Japan Earthquake News: నూతన సంవత్సర వేడుకలకు ముందు జపాన్‌లో తీవ్ర భూకంపం !
నూతన సంవత్సర వేడుకలకు ముందు జపాన్‌లో తీవ్ర భూకంపం !
Tatamel Bike: ఇప్పుడు పార్కింగ్ టెన్షన్‌కు గుడ్ బై! కుర్చీలా మడతెట్టే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్! రేంజ్, ధర తెలుసుకోండి
ఇప్పుడు పార్కింగ్ టెన్షన్‌కు గుడ్ బై! కుర్చీలా మడతెట్టే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్! రేంజ్, ధర తెలుసుకోండి
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Embed widget