అన్వేషించండి

Nizamabad News: నిజాం షుగర్స్‌ కార్మికులకు పూటగడవని దుస్థితి, ఫ్యాక్టరీ భూముల ఆక్రమించుకొని జీవనోపాధి

నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2015 లే ఆఫ్. ఏడేళ్లుగా జీతాలు, ఎక్స్ గ్రేషియా లేక రోడ్డున పడిన కార్మికులు. బకాయిలు ఇంకా ఇవ్వని యాజమాన్యం. దిక్కుతోచక ఫ్యాక్టరీ భూముల కబ్జాకు దిగుతున్నారు కార్మికులు.

నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు వెలుగు వెలిగింది. కార్మికుల పాలిట కల్పవృక్షంలా ఉండేది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయటం అంటే అనాడు ఓ వరంలా భావించేవారు. కార్మికులు, ఉద్యోగులకు సకల వసతులు ఉండేవి. కానీ ఫ్యాక్టరీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. 2015లో ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించటంతో కార్మికులు రోడ్డున పడ్డారు.

నిజాం రాజు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. 1938లో తొలిసారి షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. ఫ్యాక్టరీ ఎంతో లాభాల బాటలో పయనించింది. స్వాతంత్రం తర్వాత 1950లో ఫ్యాక్టరీని ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఫ్యాక్టరీలో వచ్చిన లాభాలతో 13 యూనిట్లను ఏర్పాటు చేశారు. షుగర్ ప్యాక్టరీ నడిపేందుకు 14 వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. సుమారుగా 6 వేల మంది కార్మికులు అప్పట్లో ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు.

మెదక్, బోధన్, మెట‌్‌పల్లిలోని ఫ్యాక్టరీలను 2002లో జాయింట్ వెంఛర్ పేరిట తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 2002 వరకు 1400 మంది పనిచేస్తుండగా బలవంతంగా 1200 మందికి వీఆర‌్ఎస్, సీఆర్ఎస్ ఇచ్చింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. కేవలం 200 మంది కార్మికులతో షుగర్ ఫ్యాక్టరీ టెకోవర్ చేసుకున్నారు. గోకరాజు గంగరాజు 51 శాతం, ప్రభుత్వం 49 శాతం జాయింట్ వెంచర్‌లో ఫ్యాక్టరీని నడిపించారు. ప్రైవేట్ యాజమాన్యం వచ్చాక ఫ్యాక్టరీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫ్యాక్టరీని టేకోవర్ చేసుకుంటామని జీవో విడుదల చేసింది. 2015లో గోకరాజు ఉన్నఫలంగా కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండునే లే ఆఫ్ ప్రకటించారు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు.

ఏడేళ్ల నుంచి ఫ్యాక్టరీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. 40 మంది కార్మికులు గుండెపోటు, అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో చనిపోయారు. ఉన్నఫలంగా ఫ్యాక్టరీకి లేఆఫ్ ప్రకటించటంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కార్మికులు న్యాయపోరాటానికి దిగారు. కేసును ప్రభుత్వం లేబర్ కోర్టుకు రిఫర్ చేసింది. గోకరాజు గంగరాజు ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మేందుకు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం అంగీకరించలేదని కార్మికులు చెబుతున్నారు. అయితే గోకరాజు నేషనల్ ఇండస్ట్రీ లా ట్రిబ్యూనల్ కు ( NCLT) అప్రోచ్ అయ్యారు. రాజకృష్ణ గుప్తను లిక్విడేటర్ గా అపాయింట్ చేసింది ఎన్ సీ ఎల్టీ. కార్మికులు చేసిన క్లైంసిని లిక్విడేటర్ రాజకృష్ణ గుప్త అంగీకరించలేదు. ఎన్సీఎల్టీలో కేసు నడుస్తున్న సమయంలో 2019లో మార్చిలో ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి చెల్లింపులు జరపాలని చూసింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తులు అమ్మొద్దని అప్పీల్ చేసింది. దీంతో దీంతో ఎన్సీఎల్టీ జడ్జిమెంట్ ఇవ్వకుండానే కేసును డిస్ మిస్ చేసింది.

ఫ్యాక్టరీ భవితవ్యాన్ని ఎటూ తేల్చకపోవటంతో కార్మికులు 7 ఏళ్ల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు రావాల్సిన జీతాలు, బెనిఫిట్స్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎందరి చుట్టు తిరిగినా ప్రయోజనం లేదని కార్మికులు వాపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఫ్యాక్టరీపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటున్నారు కార్మికులు.

200 మంది కార్మికులు 40 మంది కార్మికులు వివిధ కారణాలతో చనిపోయారు. ప్రస్తుతం దాదాపు 100 మంది కార్మికులు మిగిలారు. వారిలో కొంత మంది వయసు కుడా మీద పడింది. ఏ దిక్కు లేక కార్మికులు చిన్న చిన్న కిరాణ కొట్టులు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇంట్లో ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేక అవస్థలు పడుతున్నాంటున్నారు. కనీసం తినటానికి తిండికూడా లేదని వాపోతున్నారు. ఎంత మంది నాయకుల వద్ద తిరిగినా ప్రయోజనం లేదని భావించిన కార్మికులు చివరకు ఫ్యాక్టరీ భూములను కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో షెడ్ లాంటివి ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతామని కార్మికులు చెబుతున్నారు. ఏడేళ్లుగా తమకు రావాల్సిన ఎక్స్ గ్రేషియా. జీతాలు ఇంకా ఇవ్వలేదని అంటున్నారు. చేసేది లేకే ఫ్యాక్టరీ భూముల కబ్జాకు దిగామని చెబుతున్నారు ఫ్యాక్టరీ కార్మికులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Embed widget