అన్వేషించండి

Nizamabad News: నిజాం షుగర్స్‌ కార్మికులకు పూటగడవని దుస్థితి, ఫ్యాక్టరీ భూముల ఆక్రమించుకొని జీవనోపాధి

నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2015 లే ఆఫ్. ఏడేళ్లుగా జీతాలు, ఎక్స్ గ్రేషియా లేక రోడ్డున పడిన కార్మికులు. బకాయిలు ఇంకా ఇవ్వని యాజమాన్యం. దిక్కుతోచక ఫ్యాక్టరీ భూముల కబ్జాకు దిగుతున్నారు కార్మికులు.

నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు వెలుగు వెలిగింది. కార్మికుల పాలిట కల్పవృక్షంలా ఉండేది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయటం అంటే అనాడు ఓ వరంలా భావించేవారు. కార్మికులు, ఉద్యోగులకు సకల వసతులు ఉండేవి. కానీ ఫ్యాక్టరీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. 2015లో ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించటంతో కార్మికులు రోడ్డున పడ్డారు.

నిజాం రాజు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. 1938లో తొలిసారి షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. ఫ్యాక్టరీ ఎంతో లాభాల బాటలో పయనించింది. స్వాతంత్రం తర్వాత 1950లో ఫ్యాక్టరీని ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఫ్యాక్టరీలో వచ్చిన లాభాలతో 13 యూనిట్లను ఏర్పాటు చేశారు. షుగర్ ప్యాక్టరీ నడిపేందుకు 14 వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. సుమారుగా 6 వేల మంది కార్మికులు అప్పట్లో ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు.

మెదక్, బోధన్, మెట‌్‌పల్లిలోని ఫ్యాక్టరీలను 2002లో జాయింట్ వెంఛర్ పేరిట తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 2002 వరకు 1400 మంది పనిచేస్తుండగా బలవంతంగా 1200 మందికి వీఆర‌్ఎస్, సీఆర్ఎస్ ఇచ్చింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. కేవలం 200 మంది కార్మికులతో షుగర్ ఫ్యాక్టరీ టెకోవర్ చేసుకున్నారు. గోకరాజు గంగరాజు 51 శాతం, ప్రభుత్వం 49 శాతం జాయింట్ వెంచర్‌లో ఫ్యాక్టరీని నడిపించారు. ప్రైవేట్ యాజమాన్యం వచ్చాక ఫ్యాక్టరీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫ్యాక్టరీని టేకోవర్ చేసుకుంటామని జీవో విడుదల చేసింది. 2015లో గోకరాజు ఉన్నఫలంగా కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండునే లే ఆఫ్ ప్రకటించారు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు.

ఏడేళ్ల నుంచి ఫ్యాక్టరీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. 40 మంది కార్మికులు గుండెపోటు, అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో చనిపోయారు. ఉన్నఫలంగా ఫ్యాక్టరీకి లేఆఫ్ ప్రకటించటంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కార్మికులు న్యాయపోరాటానికి దిగారు. కేసును ప్రభుత్వం లేబర్ కోర్టుకు రిఫర్ చేసింది. గోకరాజు గంగరాజు ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మేందుకు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం అంగీకరించలేదని కార్మికులు చెబుతున్నారు. అయితే గోకరాజు నేషనల్ ఇండస్ట్రీ లా ట్రిబ్యూనల్ కు ( NCLT) అప్రోచ్ అయ్యారు. రాజకృష్ణ గుప్తను లిక్విడేటర్ గా అపాయింట్ చేసింది ఎన్ సీ ఎల్టీ. కార్మికులు చేసిన క్లైంసిని లిక్విడేటర్ రాజకృష్ణ గుప్త అంగీకరించలేదు. ఎన్సీఎల్టీలో కేసు నడుస్తున్న సమయంలో 2019లో మార్చిలో ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి చెల్లింపులు జరపాలని చూసింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తులు అమ్మొద్దని అప్పీల్ చేసింది. దీంతో దీంతో ఎన్సీఎల్టీ జడ్జిమెంట్ ఇవ్వకుండానే కేసును డిస్ మిస్ చేసింది.

ఫ్యాక్టరీ భవితవ్యాన్ని ఎటూ తేల్చకపోవటంతో కార్మికులు 7 ఏళ్ల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు రావాల్సిన జీతాలు, బెనిఫిట్స్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎందరి చుట్టు తిరిగినా ప్రయోజనం లేదని కార్మికులు వాపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఫ్యాక్టరీపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటున్నారు కార్మికులు.

200 మంది కార్మికులు 40 మంది కార్మికులు వివిధ కారణాలతో చనిపోయారు. ప్రస్తుతం దాదాపు 100 మంది కార్మికులు మిగిలారు. వారిలో కొంత మంది వయసు కుడా మీద పడింది. ఏ దిక్కు లేక కార్మికులు చిన్న చిన్న కిరాణ కొట్టులు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇంట్లో ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేక అవస్థలు పడుతున్నాంటున్నారు. కనీసం తినటానికి తిండికూడా లేదని వాపోతున్నారు. ఎంత మంది నాయకుల వద్ద తిరిగినా ప్రయోజనం లేదని భావించిన కార్మికులు చివరకు ఫ్యాక్టరీ భూములను కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో షెడ్ లాంటివి ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతామని కార్మికులు చెబుతున్నారు. ఏడేళ్లుగా తమకు రావాల్సిన ఎక్స్ గ్రేషియా. జీతాలు ఇంకా ఇవ్వలేదని అంటున్నారు. చేసేది లేకే ఫ్యాక్టరీ భూముల కబ్జాకు దిగామని చెబుతున్నారు ఫ్యాక్టరీ కార్మికులు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Uttam Kumar Reddy: తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

వీడియోలు

ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget