అన్వేషించండి

Medicines in Drone: నిజామాబాద్ నుంచి నిర్మల్‌కు డ్రోన్‌లో మెడిసిన్స్, 70 కి.మీ. ఆగకుండానే

నిజామాబాద్ నుంచి నిర్మల్ కు తొలిసారి డ్రోన్ ద్వారా మందులు సరఫరా చేసింది టీశా - మెడికార్ట్ అనే స్టార్టప్ కంపెనీ.

సాంకేతికత రాన్రానూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా డ్రోన్లు ప్రస్తుతం మన ఎన్నో అవసరాలను తీర్చుతున్నాయి. వ్యవసాయ రంగం నుంచి మెడికల్ రంగం వరకూ దాదాపు ప్రతి అవసరానికి డ్రోన్లు వాడుతున్నారు. గత ఏడాది కరోనా సంక్షోభ సమయంలో వికారాబాద్ జిల్లాలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి డ్రోన్ల ద్వారా కొవిడ్ వ్యాక్సిన్లు పంపి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. విదేశాల్లో అయితే ఇప్పటికే ఫుడ్ డెలివరీలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మన దగ్గర ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడిప్పుడే చేపడుతున్నారు. అందులో భాగంగానే గత ఏడాది వికారాబాద్ జిల్లాలో వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా సరఫరా చేశారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలోనూ ఈ తరహా ప్రయోగం జరిగింది.

నిజామాబాద్ నుంచి నిర్మల్ కు తొలిసారి డ్రోన్ ద్వారా మందులు సరఫరా చేసింది టీశా - మెడికార్ట్ అనే స్టార్టప్ కంపెనీ. డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరాను సోమవారం ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లా కేంద్రానికి విజయవంతంగా చేరవేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో డాక్టర్ ప్రశాంత్ ఆ మందులను స్వీకరించారు. ఏకంగా 70 కిలో మీటర్ల పాటూ డ్రోన్ ఆ మందులను మోసుకెళ్లింది.

నిజామాబాద్ నుంచి నిర్మల్ దాదాపు 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. రోడ్డుపై వెళ్లాలంటే ఎంత తక్కువ అనుకున్నా గంటన్నరకు పైగా సమయం పడుతుంది. డ్రోన్ ద్వారా మందులను పంపడంతో గాలిలో అరగంట కన్నా తక్కువ సమయంలోనే ఔషధాలు నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నాయి. ఉపగ్రహ పరిజ్ఞానం ఆధారంగా డ్రోన్ ఎక్కడకు చేరుకోవాలో, ఎలా చేరుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారు. భూమికి 400 అడుగులపైన గాలిలో ప్రయాణించే ఈ డ్రోన్ చేరుకోవాల్సిన ప్రదేశంలో క్యూఆర్ కోడ్ ను అతికిస్తారు. 60 మీటర్ల దూరం నుంచే ఆ క్యూఆర్ కోడ్ ను రీడ్ చేసి డ్రోన్ అక్కడ దిగుతుంది. ఈ విధానంలో 20 కిలోల వరకు మందులను సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందని డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. తొలిసారిగా ఇలా డ్రోన్ తో మందులను సరఫరా చేశామని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. బిజినెస్​ టు బిజినెస్ పద్ధతిలో సదరు సంస్థ నిర్వహకులు మందులను సరఫరా చేస్తారని అన్నారు. ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు, తక్కువ సమయంలోనే మందులు తీసుకొచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతోందని చెప్పారు. డ్రోన్​ ద్వారా ఆసుపత్రికి మందులను సరఫరా చేయడం దేశంలోనే తొలిసారని అన్నారు.

మంత్రి కేటీఆర్ స్పందన
తొలిసారిగా నిజామాబాద్ నుంచి నిర్మల్‌కు తొలిసారిగా డ్రోన్ సాయంతో ఔషధాల తరలింపుపై మంత్రి కేటీఆర్ ట్విటర్​ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఔషధాలు సరఫరా చేయడం సంతోషకరమని అన్నారు. ఈ మేరకు మంత్రి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రాజెక్టు మెడిసిన్ ఫ్రం ద స్కైలో తెలంగాణ ముందు ఉండడం గర్వకారణమని అన్నారు. సమాజానికి ఉపయోగపడని, మేలు చేయని సాంకేతికత‌ ఎందుకు ఉపయోగపడదని ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు పదేపదే చెబుతుంటారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget