అన్వేషించండి

ప్రైవేటు హోటల్‌లో తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌- విద్యార్థుల అభ్యంతరం

తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్‌కు వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. యూనివర్సిటీలో కాకుండా ప్రైవేట్ హోటల్‌లో సదస్సు నిర్వహించటాన్ని తప్పుబడుతున్నాయి విద్యార్థి సంఘాలు.

తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వ ర్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి సైంటిస్టులు మొదటి రోజు సదస్సులో పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలకు ఈ సదస్సు వేదికకానున్నట్లు తెలిపారు వీసీ రవీందర్ గుప్తా. ఈ సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వీసి. 

తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సదస్సును తెలంగాణ యూనివర్సిటీలోనే నిర్వహించాలి. కానీ ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహిస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. విద్యార్ధులు, వర్సిటీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

కరోనాతో వేదిక మార్చామంటున్న యూనివర్శిటీ అధికారులు

కాన్ఫ రెన్స్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే అమెరికా నుంచి 9 మంది, సౌత్ ఆఫ్రికా నుంచి ఒకరు నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఇంకా మరి కొందరు హాజరయ్యే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ ప్రతినిధులు హాజరువుతున్నారు. కరోనా సాకు చెప్పి వర్సిటీ క్యాంపస్‌లో కాకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే యూనివర్సిటీలో కొంత మంది విద్యార్థులు కరోనా సోకటం వల్ల యూనివర్సిటీలో కాకుండా హోటల్‌లో ఏర్పాటు చేశామని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. కరోనాతో క్యాంపస్ విద్యార్థులు ఆస్పత్రిలో, క్యాంపస్ క్వారంటైన్‌లో ఉండడంతో వెంటనే కాన్ఫరెన్స్‌ను వాయిదా వేయాల్సి ఉండగా వీసీ పట్టుదలకుపోయి కాన్ఫరెన్స్ ను జరిపించి తీరాలని చూడడం సమంజసం కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఒకవేళ విదేశీ ప్రతినిధులు కరోనా బారిన పడితే ఈ విషయం జాతీయస్థాయి సమస్యగా మారే అవకాశం ఉంటుందని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

తాము వెళ్తే కరోనా సోకదా అంటున్న విద్యార్థులు

తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్- అల్ట్రాసోనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో 'అల్ట్రాసో నిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టె క్నాలజీ'(ICUMSAT-2022) అనే అంశంపై జరుగుతున్న కాన్ఫరెన్స్‌కు సోషల్, ఆర్ట్స్, కామ ర్స్, మేనేజ్మెంట్ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు తప్పని సరిగా ఈ సదస్సుకు హాజరుకావాలని వర్సిటీ అధికారులు సూచించారు. మరోవైపు 1, 2, 3 వ తేదీల్లో సైన్స్‌సహా పలు విభాగాలు ఇంటర్నల్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు విద్యార్థులు. ఈ పరిస్థితుల్లో సదస్సుపై విద్యార్థుల్లో ఒకింత వ్యతిరేకత నెలకొంది. క్యాంపస్‌లో కరోనా వచ్చిందనే సాకుతో కాన్ఫరెన్స్ వేదికను ఒక ప్రైవేట్ హోటల్లోకి మార్చి నట్లు చెప్పుకుంటున్న ఉన్నతాధికారులు ఇక్కడ నుంచి విద్యార్థులను కాన్ఫరెన్స్‌కు తరలిస్తే కరోనా వ్యాపించదా అని భయాందోళనలకు గురవుతున్నారు.

నిధులు పక్కదారి పట్టించేందుకే ప్రైవేటు హోటల్‌లో సమావేశాలు!

తొలి రోజు సదస్సు ప్రారంభమవుతున్న సమయంలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు సదస్సు జరుగుతున్న హోటల్‌కి వెళ్లి ఆందోళన చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించకుండా ప్రైవేట్ హోటల్‌లో ఎలా నిర్వహిస్తారంటూ విద్యార్థి నాయకులను ప్రశ్నించారు. అక్కడున్న పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ హాల్ ఉన్నప్పటికీ వీసీ అక్కడ సదస్సును నిర్వహించకపోవటం సరికాదంటున్నారు విద్యార్థులు. యూనివర్సిటీలో నిర్వహించినట్లైతే ఇటు విద్యార్థులందరికీ ఉపయోగపడుతుందన్నారు. విదేశీ ప్రతినిధులు కూడా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉండేవారని విద్యార్థులు అభిప్రాయం. ఈ సదస్సుకు వచ్చే నిధులను పక్కదారి పట్టించేందుకు వర్సిటీ యాజమాన్యం ఇలా చేస్తోందంటున్నాయ్ విద్యార్థి సంఘాలు. ఓ వైపు కరోనాతో విద్యార్థులు యూనివర్సిటీలో బాధపడుతుంటే వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా... ఇలా సదస్సులు నిర్వహించటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
Bandi Bageerath POCSO case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Ram Charan : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
Telangana Cabinet Decisions: పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Telangana Heatwave: వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
Talliki Vandanam Eligibility Status: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనా.. ఇలా చెక్ చేసుకోండి
ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనా.. ఇలా చెక్ చేసుకోండి
Embed widget