అన్వేషించండి

Prashanth Reddy: కాంగ్రెస్, బీజేపీ గిమ్మిక్కులు పనిచేయవు- బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయంపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ధీమా

TS Minister Vemula Prashanth Reddy: సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో రాష్ట్రంలో అంతా సుభిక్షంగా ఉందని, తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

Telangana Minister Vemula Prashanth Reddy: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు చేస్తోందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రైతులు,  పేదలు రెండు కండ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన కొనసాగిస్తోందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, గిమ్మిక్కులు చేసినా లాభం లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి తెలంగాణలో గూలాబీ దళం విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ దార్శనిక పాలనలో రాష్ట్రంలో అంతా సుభిక్షంగా ఉందని, తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

రాష్ట్రంలో రైతు ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం పాలన ఉందన్నారు. రైతులకు పంట సాయం రైతు బంధు నగదు పంపిణీ దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. రైతు బంధు ఖరీష్, రబీ సీజన్లలో రెండు దఫాలుగా పంట పెట్టుబడి సాయాన్ని రూ.5 వేల చొప్పున సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. దళారీ వ్యవస్థను లేకుండా చేసేందుకు ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ సొంతమన్నారు. ఎకరాలను బట్టి రైతులకు బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సాయం జమ అవుతుందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల పంపిణీ చేసిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. వారికి సైతం రైతు బంధు అందించి రైతు బాంధవుడుగా నిలిచారని చెప్పారు.

ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని.. ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణ మోడల్ ను కోరుకుంటున్నారని, దేశ వ్యాప్తంగా రాష్ట్ర మోడల్ కు డిమాండ్ పెరుగుతోందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ధరణి పోర్టల్ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలకు అవగాహనా లేకనే పోర్టల్ ను రద్దు చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు రైతు బంధు అందాలంటే ధరణి పోర్టల్ ఉండాలని, లేకపోతే మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ కుట్రలు చేసినా, బీజేపీ గిమ్ముక్కులు చేసినా లాభం లేదని, వారి సర్కస్ ఫీట్లను ప్రజలు గమనిస్తున్నారని.. బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్‌ కొడుతుందని  ధీమా వ్యక్తం చేశారు. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.