అన్వేషించండి

Telangana News: పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ చేయడంలో తెలంగాణ టాప్- ఏపీది థర్డ్ ప్లేస్

Telangana News: చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 5 వేల 38 ఫోన్లను వాటి యజమానులకు అప్పగించారు.

Telangana News: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. మొబైల్ దొంగతనం, నకిలీ మొబైల్ పరికరాల ముప్పును అరికట్టడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) అభివృద్ధి చేసిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR)ని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర పోలీసులు 5,038 దొంగతన బారినపడిన లేదా పోగొట్టుకున్నన మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. 67.98 శాతం రికవరీతో తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 54.20 రికవరీ రేటుతో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, 50.90 శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.

సీఈఐఆర్ పోర్టల్ ను అధికారికంగా మే 17వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అయితే 2022 సెప్టెంబర్ లో కర్ణాటకలో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు. తెలంగాణలో పైలట్ ప్రాతిపదికన ఏప్రిల్ 19వ తేదీ 2023న ప్రారంభించగా.. 110 రోజుల వ్యవధిలో మొత్తం 5,038 పోగొట్టుకున్న, దొంగిలించిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఇందులో చివరి 1000 మొబైల్ ఫోన్లను కేవలం 16 రోజుల్లో రికవరీ చేసి ఫిర్యాదుదారులకు అందజేశారు. మొత్తం 5 వేల 38 ఫోన్లను రికవరీ చేయడంలో నిరంతరం పర్యవేక్షణ చేసిన నోడల్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ ను.. డీఐజీ అంజనీ కుమార్ అభినందించారు. 

రాష్ట్రంలోని మొత్తం 780 పోలీస్ స్టేషన్లలో ఈ పోర్టల్ పనిచేస్తోంది. ఏడీజీపీ, సీఐడీ సీఈఐఆర్ పోర్టల్ కింద పని పురోగతిని పర్యవేక్షిస్తుంది. తెలంగాణకు సంబంధించిన సీఈఐఆర్ డేటా ప్రకారం.. 55 వేల 219 మొబైల్ ఫోన్లను బ్లాక్ చేశారు. 11 వేల 297 ట్రేస్‌బిలిటీ నివేదికలు అందుకోగా.. 5,038 ఫోన్లను అన్‌బ్లాక్ చేసి నిజమైన యజమానులకు అప్పగించారు. అయితే 402 మొబైల్ ఫోన్లతో హైదరాబాద్ కమిషనరేట్, 398 పరికరాలతో రాచకొండ కమిషనరేట్లు ఉన్నాయి. వినియోగదారు స్నేహ పూర్వకతను మెరుగు పరచడానికి, తెలంగాణ పౌరులకు మరింత సమర్ధవంతంగా సేవలు అందించడానికి, తెలంగాణ పోలీసులు డీఓటీ సమన్వయంతో తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్‌తో సీఈఐఆర్ పోర్టల్‌ను విజయవంతంగా అనుసంధానించారు. ఫలితంగా పోగొట్టుకున్న, తప్పిపోయిన మొబైల్ ఫోన్లను మీసేవా లేదా పోలీస్ స్టేషన్‌లకు వచ్చే బదులు పౌరులు తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్‌లో ఈ సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. 

ఫోన్ పోగొట్టుకోగానే, చేయాల్సిన పని ఇదే

కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో  CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in  వెబ్ సైట్‌లోకి లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. పోయిన మొబైల్లోని నంబర్లు, IMEI నంబరు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్‌లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు పోయింది? ఎక్కడ పోయింది? రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఓటిపి (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ఇవ్వాలి.

ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. ఆ ఐడి మిస్సయిన ఫోన్ స్టేటస్ తెలుపుతుంది. అది ఎక్కడుంది? ఎవరి చేతుల్లో ఉంది అనే వివరాలను ఐడెంటిఫై చేస్తుంది. మొబైల్ ఏ కంపెనీది అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఆ ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఈ సాంకేతికను ఉపయోగించి మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకున్నారు పోలీసులు. ఫోన్ దొరికిన తర్వాత సదరు ఫిర్యాదుదారుడు చేయాల్సిన మరోపని- అన్ బ్లాక్! దీనికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఫోన్ దొరికిన అదే వెబ్‌ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. అడిగిన ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. లేకుంటే ఫోన్ ఆన్ కాదు. ఫోన్ పనిచేస్తున్న విషయాన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Embed widget